YS Jagan : స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అది కూడా 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని దేశమంతా వజ్రోత్సవాలు జరుపుకుంటున్న నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ తన స్వాతంత్ర్య వేడుకల ఉపన్యాసంలో మూడు రాజధానుల అంశాన్ని ప్రస్తావించారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం జగన్..
ఈసందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా 13 జిల్లాలను మరో 13 జిల్లాలుగా.. మొత్తం 26 జిల్లాలుగా ఏపీని విభజించామని చెప్పుకొచ్చారు. అలాగే రాజధాని స్థాయిలో పరిపాలన వికేంద్రీకరణ తమ విధానం అన్నారు.
పరిపాలన వికేంద్రీకరణే తమ విధానం అని… రాజధాని స్థాయిలోనే పరిపాలన వికేంద్రీకరణ ఉండాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. అలాగే.. ప్రాంతీయ ఆకాంక్షలకు, ప్రాంతాల ఆత్మగౌరవానికి, సమతౌల్యానికి ఇదే పునాది అన్నారు. ఆ దిశగా తాము అడుగులు వేస్తున్నామన్నారు.
ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యానికి మన దేశం ప్రతీక అని, పింగళి వెంకయ్య రూపొందించిన జెండా భారతీయుల గుండె అని తెలిపారు. ప్రపంచంలో పోటీ పడి మరీ మనం ప్రగతిని సాధిస్తున్నాం. ఆహార ధాన్యాల లోటును దేశం అధిగమించింది. ఫార్మా రంగంలోనే ప్రపంచంలోనే భారత్ టాప్ ప్లేస్ లో ఉంది. ప్రపంచానికే ఇప్పుడు మనం అవసరమైన ఔషధాలను అందిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు.
Flipkart Big Billon Days Sale 2024 : ఫ్లిప్ కార్ట్ నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024…
Balineni Srinivasa Reddy : ఏపీలో ప్రస్తుతం పరిస్థితులు ఎంతగా మారుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం. వైసీపీ పార్టీ నాయకులు…
Pushpa 2 : సుకుమార్- అల్లు అర్జున్ ప్రధాన పాత్రలలో రూపొందిన పుష్ప చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో…
Chandrababu : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కో హామీని నెరవేరుస్తున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో కూటమి పార్టీ…
Ram Charan : డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్.…
TDP Alliance ఆంధ్రప్రదేశ్లోని కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నెల 20…
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.…
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
This website uses cookies.