
Ys jagan
YS Jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గత కొద్ది రోజుల నుంచి వైసీపీ పార్టీలోని అంతర్గత విషయాలపైన దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. పార్టీలో ఉన్న నేతల్లో ఎవరెవరు అసంతృప్తితో ఉన్నారు? ఎవరికి పదవులు ఇవ్వాలి? అనే విషయాలపై జగన్ క్లియర్గా ఒక అండర్ స్టాండింగ్కు వచ్చినట్లు వినికిడి.ఏపీలోని మూడు ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఎమ్మెల్యే కోటావి కాగా, 11 స్థానిక సంస్థల కోటాలో ఉన్నాయి. కాగా ఈ మొత్తం 14 స్థానాలు అధికారి వైసీపీకి దక్కుతాయని తెలుస్తోండగా, ఎవరెవరి జగన్ అభ్యర్థులుగా ఫైనల్ చేస్తారనేది కీలకాంశంగా మారింది.
YS Jagan
అయితే, ఎమ్మెల్యే కోటాల భర్తీ కానున్న మూడు ఎమ్మెల్సీ స్థానాలకు నేతలను జగన్ ఆల్రెడీ ఫైనల్ చేసినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఆ ముగ్గురి పేర్లను బుధవారం అనౌన్స్ చేయబోతున్నట్లు సమాచారం. ఇందులో గోవిందారెడ్డి పేరు కంపల్సరీగా ఉంటుందని, ఆయనతో పాటు మరో ఇద్దరు పేర్లుంటాయని తెలుస్తుండగా, వారిరువురు ఎవరు అనేది ప్రజెంట్ సస్పెన్స్గా మారింది. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను బుధవారం ప్రకటిస్తారని తెలుస్తోంది. అయితే, ఇందులో ఎంత వరకు నిజముందో తెలియదు. మొత్తం 14 మంది అభ్యర్థుల పేర్లను బుధవారం సాయంత్రం వరకు జగన్ ఫైనల్ చేస్తారని మరి కొందరు అంటున్నారు. మొత్తానికి పదవుల పంపకాలలో వైసీపీ నేతలకు ఉన్న సస్పెన్స్లు అన్నీ కూడా బుధవారం వీడనున్నాయని వైసీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
ఇకపోతే గత కొద్ది రోజుల నుంచి వైసీపీ నేతలు కొందరు మంత్రి వర్గ విస్తరణ గురించి చర్చించుకుంటున్నారని సమాచారం. కేబినెట్ విస్తరణలో కొత్త వారికి అవకాశాలుంటాయని వార్తలొస్తుండగా, తమకు అందులో అవకాశముంటుందా అని మధనపడుతున్నారట. ఈ క్రమంలోనే కేబినెట్ మినిస్టర్ ఆశలు పెట్టుకున్న వారికి కనీసం ఎమ్మెల్సీ పదవి అయినా దక్కుతుందా అనే చర్చ ఆ పార్టీ వర్గాల్లోనే జరుగుతున్నది.
Bhartha mahasayulaku vignapthi | మాస్ మహారాజ్ రవితేజ నటించిన తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఇటీవల థియేటర్లలో విడుదలై…
iPhone 15 : ఐఫోన్ సొంతం చేసుకోవాలనేది సగటు స్మార్ట్ఫోన్ ప్రియులందరి కల. కానీ దాని భారీ ధర కారణంగా…
Pawan Kalyan : బెంగళూరు నగరం అంటేనే ఐటీ హబ్తో పాటు అంతులేని ట్రాఫిక్ జామ్లకు కేరాఫ్ అడ్రస్గా మారిపోయింది.…
Nara Lokesh : మంత్రి నారా లోకేష్ ఏపీ రాజకీయాల్లో సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. సాధారణంగా ఏ రాజకీయ…
Eating : ఆరోగ్యకరమైన జీవనశైలిలో మనం తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమో, దానిని తీసుకునే పద్ధతి కూడా అంతే ముఖ్యం.…
Udyogini Scheme : మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఉద్యోగిని పథకం 2026' అందరిలో సంతోషాన్ని…
NIT Warangal Recruitment 2026 : వరంగల్లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) 2026 సంవత్సరానికి గాను…
దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరల పెరుగుదల సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా స్థిరంగా పెరుగుతూ వస్తున్న…
This website uses cookies.