
YS Jagan Mohan Reddy : రఘురామకృష్ణం రాజుకు పోటీగా ప్రభాస్ ని రంగంలోకి దింపుతున్న వై.యస్.జగన్మోహన్ రెడ్డి..!
YS Jagan Mohan Reddy : 2024 శాసనసభ ఎన్నికల్లో ఏ నియోజకవర్గంలో వైసీపీ గెలుపు వచ్చిన రాకపోయినా కొన్ని నియోజకవర్గాలలో మాత్రం కచ్చితంగా వైసీపీ గెలవాల్సి ఉంటుంది.ఎందుకంటే ఇవి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నియోజకవర్గాలు. అందులో మొదటిది రఘురామకృష్ణంరాజు గత ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి పోటీ చేసిన నరసాపురం. ఇది వైసీపీ పార్లమెంట్ నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో రానున్న ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని జగన్ తనదైన శైలిలో ప్లాన్ చేసుకున్నారు. ఎందుకంటే ఎప్పటినుంచో వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి వర్సెస్ రఘురామకృష్ణంరాజుగా ఏపీ రాజకీయాలు జరుగుతున్నాయి. 2019లో జగన్ ఫోటోతో జగన్ పార్టీ తరపున గెలిచిన రఘురామ అపాయింట్మెంట్ ఇవ్వలేదని, తనను అవమానించారని ఇలా రకరకాల కారణాలతో వైసీపీ నుంచి బయటికి వచ్చి రెబల్ ఎంపీగా మారారు. ఆ రోజు నుంచి జగన్ వర్సెస్ రఘురామగా నడుస్తుంది.
ఆ తర్వాత కొన్నాళ్లకి రఘురామ చేసిన వ్యాఖ్యలకి జగన్ తనదైన శైలిలో రివేంజ్ తీసుకోవడానికి ప్రయత్నం చేయడం, జగన్ తన పోలీసు అధికారులతో తనని కొట్టారని రఘురామ కృష్ణంరాజు నేరుగా కోర్టులో చెప్పడం అలాంటి హైడ్రామా నడిచింది. ఆ తర్వాత కాలం మొత్తం రఘురామకృష్ణం రాజు ఢిల్లీలో ఉంటూ వచ్చారు. ఏ రోజు కూడా నరసాపురానికి వచ్చే ప్రయత్నం చేయలేదుష రీసెంట్ గా సంక్రాంతికి రఘురామకృష్ణం రాజు నరసాపురం వచ్చే ప్రయత్నం చేశారు. రానున్న 2024 ఎన్నికల్లో తాను కచ్చితంగా గెలిచి తీరుతానని నరసాపురం పార్లమెంటు నుంచి పోటీ చేస్తాను అని, ఎవరైనా ఓడించుకోవచ్చు అంటూ ఆయన సవాల్ విసిరారు.
ఈ క్రమంలో రఘురామకృష్ణంరాజును ఓడించాలంటే ఒక మార్గాన్ని జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేసుకున్నారు. దివంగత కృష్ణంరాజు భార్య శ్యామలాదేవిని ఇక్కడ రంగంలో దించడానికి జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఆమె ఇక్కడ పోటీ చేస్తే ఇద్దరు ఒకే సామాజిక వర్గం కాబట్టి ఆ సామాజిక వర్గపు ఓట్లు ఎక్కువగా ఉండడంతో నేరుగా ప్రభాస్ ని రంగంలోకి దించి ప్రచారం కూడా చేయించుకోవచ్చని జగన్ ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉండే పెద్దలు ప్రభాస్ తో చాలా క్లోజ్ గా ఉంటారు. ఇక యాత్ర 2 సినిమాని మూవీ క్రియేషన్స్ వారే తీస్తున్నారు. వంశీ, ప్రమోద్ ఇద్దరూ ప్రభాస్ కి సన్నిహితులు. ప్రభాస్ ని తన పెద్దమ్మకు సపోర్టుగా నరసాపురంలో ప్రచారం చేయించాలని జగన్ ప్లాన్ చేస్తున్నారని, తద్వారా రఘురామ కృష్ణంరాజును దెబ్బ కొట్టాలని జగన్ ప్లాన్ వేస్తున్నారని తెలుస్తుంది.
Vijay TVK : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆ రాష్ట్ర రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. దళపతి…
Night Heat Stroke : సాధారణంగా వడదెబ్బ అనగానే మనందరికీ మండుటెండలు, మధ్యాహ్నపు వేడి గాలులు మాత్రమే గుర్తొస్తాయి. పగటిపూట…
Prasar Bharati Recruitment 2026 : భారత ప్రభుత్వ సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన ప్రముఖ పబ్లిక్…
భానుడు భగభగమంటున్నాడు. రోజురోజుకు ఎండ తీవ్రత పెరుగుతుండటంతో పిల్లలు, పెద్దలు, ముసలివారు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తీవ్ర…
AP Housing Scheme 2026 : సొంతంగా ఒక ఇల్లు నిర్మించుకోవాలనేది ప్రతి పేద, మధ్యతరగతి కుటుంబం యొక్క దశాబ్దాల…
Husband Wife : నేటి సమాజంలో మనుషుల ప్రాణాలకు విలువే లేకుండా పోతోంది. చిన్నపాటి మనస్పర్థలు, అనవసరపు అనుమానాలు నిండు…
Mamata Banerjee : పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి తీవ్ర ఉత్కంఠకు దారితీశాయి. నిన్న వెలువడిన ఎన్నికల ఫలితాలు, ఓట్ల…
IPL 2026 SRH : సన్రైజర్స్ హైదరాబాద్ అభిమానులారా.. ఆరెంజ్ ఆర్మీ మద్దతుదారులారా.. సిద్ధంగా ఉండండి! మీ గుండెల్లో ఆశలు…
Curd : భానుడి భగభగలకు అల్లాడిపోతున్న తరుణంలో, శరీరానికి చల్లదనాన్ని ఇచ్చే పెరుగు, మజ్జిగ లేదా లస్సీలను ప్రతి ఒక్కరూ…
Watermelon : ఎండకాలం వచ్చిందంటే చాలు.. దాహార్తిని తీర్చుకోవడానికి మనందరికీ గుర్తొచ్చే మొదటి పండు పుచ్చకాయ. ఎర్రటి రంగుతో, తియ్యని…
Vomiting : చాలామందికి ప్రయాణం అంటే ఒక అందమైన అనుభూతి. కానీ, కొంతమందికి మాత్రం అది ఒక పీడకలగా మారుతుంది.…
Vijay TVK : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాల్లో కొత్త చరిత్రను లిఖించాయి. నటుడు విజయ్ స్థాపించిన…
This website uses cookies.