Ys jagan
Ys jagan ఎంపీ మార్గాని భరత్ వర్సెస్ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా.. కొన్నిరోజులుగా వీరిద్దరి మధ్య వార్ ఓ రేంజ్లో సాగుతోంది. అధికార పార్టీ నేతలే పరస్పర విమర్శలు.. అవినీతి ఆరోపణలతో రాజమండ్రిలో రచ్చ చేస్తున్నారు. ఎంపీ, ఎమ్మెల్యేల మాటల యుద్ధం రాష్ట్ర్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అధికారపార్టీ నేతలై ఉండి, ఎంపీపై ఎమ్మెల్యే అవినీతి ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. క్రిమినల్స్, రౌడీషీటర్స్ను వెంటేసుకుని దందాలు చేస్తున్నారంటూ ఎంపీ మార్గాని భరత్ ను ఎమ్మెల్యే జక్కంపూడి రాజా విమర్శించడం.. జక్కంపూడి రాజాపై మార్గాని భరత్ సైతం కాంట్రవర్సీ కామెంట్స్ చేయడంతో.. వారిద్దరి రగడ తాడేపల్లికి చేరింది.
Ys jagan
ఎంపీ, ఎమ్మెల్యేల కుంపటిని చల్లార్చే పనిని తూర్పుగోదావరి జిల్లా ఇంఛార్జి వైవీ సుబ్బారెడ్డికి అప్పగించింది పార్టీ అధిష్టానం. కానీ, వారిని కాంప్రమైజ్ చేయడం సుబ్బారెడ్డి వల్ల కూడా కాలేదు. వైవీ సమక్షంలోనే మార్గాని భరత్, జక్కంపూడి రాజాలు నువ్వెంతంటే నువ్వెంతంటూ తిట్టుకోవడం కలకలం రేపింది. వైవీ సుబ్బారెడ్డి రెండు విడతలుగా మార్గాని భరత్, జక్కంపూడి రాజాలతో మాట్లాడి.. విడివిడిగా వారి నుంచి వివరణ తీసుకున్నారు. మార్గాని భరత్, జక్కంపూడి రాజాలను కాంప్రమైజ్ చేయడం తన వల్ల కావటం లేదని వైవీ సుబ్బారెడ్డి చేతులెత్తేయడంతో.. ఇక తప్పేలా లేదని సీఎం జగన్ నేరుగా రంగంలోకి దిగాల్సి వచ్చింది.
ys jagan
రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను పిలిపించి సీఎం జగన్ మాట్లాడారు. పరస్పరం బహిరంగ ఆరోపణలు చేసుకోవడంపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ గీత దాటితే కఠిన చర్యలు తప్పవని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇంకోసారి మీడియా ముందు గొడవ పడితే యాక్షన్ తప్పదని.. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే పార్టీ అంతర్గత వేదికల్లో మాత్రమే మాట్లాడాలని గట్టిగా చెప్పారట సీఎం జగన్. దీంతో.. రాజమండ్రి వైసీపీ వర్గపోరు ప్రస్తుతానికి సమసిపోయినట్టే అంటున్నారు.
Ysrcp
Arattai app |ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు ఉపయోగిస్తున్న వాట్సాప్కి భారత్ నుండి గట్టి పోటీగా ఓ స్వదేశీ మెసేజింగ్…
RRB | సర్కారు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త! భారతీయ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) తాజాగా పెద్ద…
Farmers | ఆంధ్రప్రదేశ్ రైతులకు ఒక కీలకమైన హెచ్చరిక. ఈ-క్రాప్ బుకింగ్కు సెప్టెంబర్ 30 (రేపు) చివరి తేదీగా వ్యవసాయ…
Modi | ప్రధాని నరేంద్ర మోదీ తన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా…
Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (SEC)…
Prize Money | ఆసియా కప్ 2025 ఫైనల్లో ప్రతిష్టాత్మక భారత్ vs పాకిస్తాన్ తలపడడం క్రికెట్ ప్రపంచాన్నే ఉత్కంఠకు…
Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…
TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…
This website uses cookies.