Ys Jagan : ఏపీలో రెడ్డి మరియు కమ్మ సామాజిక వర్గంకు చెందిన వారు రాజ్యం ఏలుతారు అనడంలో సందేహం లేదు. కమ్మ నాయకులు మొదటి నుండి కీలక పదవులు నిర్వహిస్తూ వస్తున్నారు. రాష్ట్రంలో కమ్మ సామాజిక వర్గం మద్దతు లేకుండా అధికారంలోకి రావడం దాదాపు అసాధ్యం అని అంతా అనుకున్నారు. కాని అనూహ్యంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి కొత్త చరిత్రను సృష్టించాడు. చంద్రబాబు నాయుడు పై కమ్మ సామాజిక వర్గంలో కూడా ఉన్న వ్యతిరేకత కారణంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఉంటాడు అనేది కొందరి వాదన. అయితే రాబోయే రోజుల్లో మాత్రం కమ్మ సామాజిక వర్గం మద్దతు లేకుండా జగన్ మనుగడ సాధ్యం కాదేమో అంటున్నారు.
ఏపీలో కమ్మ సామాజిక వర్గం అనగానే అందరికి గుర్తుకు వచ్చే పేరు ముద్రగడ పద్మనాభం. ఈయన్ను వైకాపా ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కాస్త సైలెంట్ గానే ఉంచారు. అంటే ఈయన వైకాపా కు మద్దతు అనే సంకేతాలు ఉన్నాయి. ఇదే సమయంలో ఆయన కు వైకాపా నుండి ఆహ్వానం అందింది అంటూ వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు కాదు కాని వైకాపా నాయకులతో ఆయన క్లోజ్ గా ఉండటం మొదలుకుని పలు విషయాల్లో ఆయన వైకాపాకు మద్దతుగా ఉన్నాడు. అందుకే ఆయనకు ఎంపీ సీటును ఇవ్వాలని కూడా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నాడనే వార్తలు వచ్చాయి. ఆయనకు పదవి ఇచ్చినంత మాత్రాన కమ్మ వారు అంతా కూడా వైకాపా వెంట వస్తారా అంటే అనుమానమే.
తెలుగు దేశం పార్టీ అంటేనే కమ్మ పార్టీ. కమ్మ పార్టీ నాయకులు తెలుగు దేశంలో చాలా మంది ఉన్నారు. వారు ఈసారి సామాజిక వర్గం పేరుతో కాస్త సీరియస్ గానే అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పలువురు కమ్మ నాయకులను వైకాపా ప్రభుత్వం ఇబ్బంది పెట్టేలా ప్రయత్నిస్తుంది. కమ్మ సామాజిక వర్గంలోని పలువురు ఇప్పుడు ఆర్థికంగా కుదేలయ్యారు. దాంతో మళ్లీ వైకాపాకు మద్దతుగా నిలిచే అవకాశం లేదంటూ కొందరు కమ్మ నాయకులు అంటున్నారు. ఎన్నికలకు ఇంకా మూడు సంవత్సరాలు సమయం ఉంది. కనుక అప్పటి వరకు జగన్ ఏదైనా అద్బుతం చేసి కమ్మ వారిని తమ వైపుకు తిప్పుకుంటాడా లేదంటే వారి వల్ల అధికారంను కోల్పోతాడా అనేది కాలమే నిర్ణయించాలి.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.