
ysp mla jogi ramesh in ys jagan cabinet race
Ys Jagan : ఏపీలో రెడ్డి మరియు కమ్మ సామాజిక వర్గంకు చెందిన వారు రాజ్యం ఏలుతారు అనడంలో సందేహం లేదు. కమ్మ నాయకులు మొదటి నుండి కీలక పదవులు నిర్వహిస్తూ వస్తున్నారు. రాష్ట్రంలో కమ్మ సామాజిక వర్గం మద్దతు లేకుండా అధికారంలోకి రావడం దాదాపు అసాధ్యం అని అంతా అనుకున్నారు. కాని అనూహ్యంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి కొత్త చరిత్రను సృష్టించాడు. చంద్రబాబు నాయుడు పై కమ్మ సామాజిక వర్గంలో కూడా ఉన్న వ్యతిరేకత కారణంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఉంటాడు అనేది కొందరి వాదన. అయితే రాబోయే రోజుల్లో మాత్రం కమ్మ సామాజిక వర్గం మద్దతు లేకుండా జగన్ మనుగడ సాధ్యం కాదేమో అంటున్నారు.
Ys Jagan This community Lots of hopes
ఏపీలో కమ్మ సామాజిక వర్గం అనగానే అందరికి గుర్తుకు వచ్చే పేరు ముద్రగడ పద్మనాభం. ఈయన్ను వైకాపా ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కాస్త సైలెంట్ గానే ఉంచారు. అంటే ఈయన వైకాపా కు మద్దతు అనే సంకేతాలు ఉన్నాయి. ఇదే సమయంలో ఆయన కు వైకాపా నుండి ఆహ్వానం అందింది అంటూ వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు కాదు కాని వైకాపా నాయకులతో ఆయన క్లోజ్ గా ఉండటం మొదలుకుని పలు విషయాల్లో ఆయన వైకాపాకు మద్దతుగా ఉన్నాడు. అందుకే ఆయనకు ఎంపీ సీటును ఇవ్వాలని కూడా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నాడనే వార్తలు వచ్చాయి. ఆయనకు పదవి ఇచ్చినంత మాత్రాన కమ్మ వారు అంతా కూడా వైకాపా వెంట వస్తారా అంటే అనుమానమే.
తెలుగు దేశం పార్టీ అంటేనే కమ్మ పార్టీ. కమ్మ పార్టీ నాయకులు తెలుగు దేశంలో చాలా మంది ఉన్నారు. వారు ఈసారి సామాజిక వర్గం పేరుతో కాస్త సీరియస్ గానే అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పలువురు కమ్మ నాయకులను వైకాపా ప్రభుత్వం ఇబ్బంది పెట్టేలా ప్రయత్నిస్తుంది. కమ్మ సామాజిక వర్గంలోని పలువురు ఇప్పుడు ఆర్థికంగా కుదేలయ్యారు. దాంతో మళ్లీ వైకాపాకు మద్దతుగా నిలిచే అవకాశం లేదంటూ కొందరు కమ్మ నాయకులు అంటున్నారు. ఎన్నికలకు ఇంకా మూడు సంవత్సరాలు సమయం ఉంది. కనుక అప్పటి వరకు జగన్ ఏదైనా అద్బుతం చేసి కమ్మ వారిని తమ వైపుకు తిప్పుకుంటాడా లేదంటే వారి వల్ల అధికారంను కోల్పోతాడా అనేది కాలమే నిర్ణయించాలి.
Telangana : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఉత్కంఠను రేపుతున్నాయి. సుమారు 30కి పైగా మున్సిపాలిటీల్లో…
Rashmi Gautam : తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ కలిగిన యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరు. జబర్దస్త్ షో ద్వారా…
Shivajyothi : ప్రముఖ యాంకర్ శివజ్యోతి తల్లి అయ్యారు. తీన్మార్ వార్తలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శివజ్యోతి,…
Womens : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Andhra Pradesh Government 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి…
Nara Lokesh : ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకటే చర్చ నడుస్తోంది, అదేంటంటే నారా లోకేష్ పట్టాభిషేకం ఎప్పుడు అని.…
Maruti Mini Brezza 2026 Review : భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి Maruti Suzuki మరోసారి మార్కెట్లో…
Rythu Bharosa : తెలంగాణలో యాసంగి సాగు పనులు ఊపందుకున్న వేళ, రైతులకు గొప్ప శుభవార్త అందించబోతుంది తెలంగాణ సర్కార్.…
AP Budget 2026-27 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం రూ. 3,32,205 కోట్ల…
This website uses cookies.