ap gets huge investments from industrialists in summit
YS Jagan : ఏపీలో అసెంబ్లీ సమావేశాలు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈనేపథ్యంలో అసెంబ్లీలో వ్యవహరించాల్సిన తీరుపై వైసీపీ ప్రభుత్వం ఇప్పటి నుంచే పథకాలు రచిస్తోంది. ఈనెల 14 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యలో అసెంబ్లీలో ఏ బిల్లులు ప్రవేశపెట్టాలి అనే దానిపై చర్చించేందుకు అదే రోజు మంత్రి వర్గ సమావేశం ఉండనుంది. ఆ మంత్రివర్గ సమావేశంలోనే మూడు రాజధానుల అంశం గురించి సీఎం జగన్ చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అంటే.. వైజాగ్ కు పరిపాలన రాజధాని ఎప్పుడు షిఫ్ట్ అవుతుందో సీఎం జగన్ చెబుతారన్నమాట.
ys jagan to talk about ap capital issue in cabinet meeting
14న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయినా.. 14న గవర్నర్ ప్రసంగమే ఉంటుంది. 15న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతారు. 17వ తారీఖున ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఏపీ బడ్జెట్ 2023 ని ప్రవేశపెడతారు. ఆ తర్వాత సీఎం జగన్ మూడు రాజధానుల అంశం గురించి ప్రకటన చేస్తారు అని తెలుస్తోంది. నిజానికి.. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవ్వడానికి ముందే సుప్రీంలో మూడు రాజధానుల అంశం విచారణ పూర్తవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఏపీ హైకోర్టు అమరావతికే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాజధాని వికేంద్రీకరణ,
అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో ఏపీ ప్రభుత్వం సుప్రీంలో పిటిషన్ ఫైల్ చేసింది. దానిపై విచారణ మాత్రం త్వరగా ముగియడం లేదు. మరోవైపు ఎన్నికలు సమీపిస్తున్నాయి. అలాగే.. అసెంబ్లీ సమావేశాలు కూడా నిర్వహించి బడ్జెట్ ను ప్రవేశపెట్టాల్సి ఉంది. ఈనేపథ్యంలో సీఎం జగన్ మూడు రాజధానుల అంశాన్ని ఓ కొలిక్కి తేవాలని భావిస్తున్నారు. సుప్రీంలో వచ్చే తీర్పు ఆధారంగానే సీఎం జగన్ ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కానీ.. అసెంబ్లీ సమావేశాలకు ముందే.. విశాఖకు పరిపాలన రాజధానిని తరలించే అంశంపై సీఎం జగన్ ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తుండటంతో ఏ ప్రకటన చేస్తారు అని అందరూ అనుకుంటున్నారు.
Kannappa Movie Review : తెలుగు చిత్ర పరిశ్రమలో Kannappa Review పాపులర్ ప్రొడక్షన్ హౌస్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ,…
kannappa Movie : మంచు విష్ణు భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన కన్నప్ప సినిమా రేపు గ్రాండ్గా విడుదల కానుంది.…
Ram charan : గ్లోబల్ స్టార్ రామ్చరణ్ కుడి చేయికి గాయం అయినట్లు వార్తలు వెలుగుచూస్తున్నాయి. బుధవారం హైదరాబాద్లోని శిల్పకళా…
Subhanshu Shukla : భారత అంతరిక్ష చరిత్రలో మరొక సువర్ణాధ్యాయం లిఖితమైంది. యాక్సియం-4 (Axiom-4) మిషన్లో భాగంగా భారతీయుడు శుభాంశు…
Father : ఆస్తుల కోసం తల్లిదండ్రులను వేధించే ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా పడవేడు గ్రామానికి చెందిన…
Daughter : హైదరాబాద్ జీడిమెట్లలో జరిగిన ఓ హృదయవిదారక ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. ప్రేమకు అడ్డుగా మారిందనే కారణంతో పదో…
Phone Tapping Case : తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు మొదట చిన్న ఉదంతంలా కనిపించినా, ఇప్పుడది పెద్ద స్థాయిలో…
Heroine : చాలా మంది హీరోయిన్స్ సినిమాలతో పాటు బిజినెస్ లతోనూ కోట్లు సంపాదిస్తున్నారు. అలా సంపాదించిన డబ్బుతో కాస్ట్లీ…
This website uses cookies.