Categories: andhra pradeshNews

ys jagan : పార్లమెంట్ లో జగన్ పరువు నిలబెట్టండి మహాప్రభో … మీకోక దండం !

ys jagan : ఏపీ అధికార పార్టీ నుండి పార్లమెంట్ కు మొత్తం 22 మంది ఎన్నిక అయ్యారు. వారిలో ఒకరు మృతి చెందగా మరొకరు పార్టీలో ఉన్నారా లేరా అనే విషయం అర్థం కాకుండా ఉంది. ఆయనే నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు. చనిపోయిన ఎంపీ మరియు రఘురామ కృష్ణంరాజులను వదిలేస్తే ఇంకా 20 మంది ఎంపీలు వైకాపా తరపున పార్లమెంట్‌ లో మాట్లాడేందుకు అవకాశం ఉంది. పార్లమెంట్ అతి పెద్ద పార్టీల జాబితాలో ముందు వరుసలో ఉన్న వైకాపాకు సభాపతి కావాల్సినంత సమయం ఇచ్చే అవకాశం ఉంది. కాని ఏపీ ఎంపీలు మాత్రం సరిగా ఆ సమయంను ఉపయోగించుకోవడం లేదు. అసలు కొన్ని సార్లు సమయాన్ని కూడా కోరేందుకు వైకాపా ఎంపీలు ఆసక్తి చూపడం లేదు అంటూ విమర్శలు వస్తున్నాయి. ఇటీవల కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై వైకాపా ఎంపీలు ఏం మాట్లాడారో కనీసం ఆ పార్టీ నాయకులకు కూడా తెలియడం లేదు.

ys jagan YSRCP 20 mps not talking in parliament about ap problems

ys jagan : 20 మంది ఎంపీలు ఉండి ఏం లాభం..

వైకాపాకు చెందిన 20 మంది ఎంపీలు కూడా పార్లమెంట్ లో మౌన ముద్రలో కనిపించడం ఆ పార్టీ నాయకులకు నిరాశ కలిగిస్తుంది. ప్రజల్లో కూడా వారిపై నమ్మకం కలగడం లేదు. వైకాపా నాయకులు కేంద్రం నుండి నిధులు వచ్చే విషయమై ఎంపీలది కీలక పాత్ర ఉంటుందని, ప్రత్యేక హోదాతో పాటు కేంద్రం నుండి రావాల్సినవన్నీ కూడా రాబట్టేందుకు ఎక్కువ మంది ఎంపీలను ఇవ్వాలంటూ వైఎస్‌ జగన్ ఎన్నికల సందర్బంగా ప్రజలకు విజ్ఞప్తి చేశాడు. ప్రజలు ఏకంగా 22 మంది ఎంపీల బలంను జగన్ కు ఇచ్చారు. కాని ఎంపీలు మాత్రం వైఎస్‌ జగన్ కు పెద్దగా ప్రయోజనం కలిగేలా చేయడం లేదు.

వైఎస్‌ జగన్‌ పరువు తీస్తున్నారు..

సీఎం వైఎస్ జగన్‌ ఎంతో నమ్మకం పెట్టుకుని పార్లమెంట్‌ కు వారిని పంపిస్తే వారేమో ఇలా మౌనంగా పార్లమెంట్ కు వెళ్తున్నాం వస్తున్నాం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయంలో తీవ్రమైన విమర్శలు ఆ పార్టీ నాయకులపై వ్యక్తం అవుతున్నాయి. బడ్జెట్ కేటాయింపులు మొదలుకుని ఏపీ ప్రజల కల అయిన పోలవరం కు కనీస నిధులను తీసుకు రావడంలో విఫలం అవుతున్నారు. పక్క రాష్ట్రాలకు వేల కోట్లు పంపిస్తున్న కేంద్రం ఏపీకి ఇవ్వకుంటే కనీసం ప్రశ్నించకుండా పార్లమెంట్‌ లో వైఎస్‌ జగన్ పరువు తీస్తున్నారు. ఏపీలో కూడా వైఎస్‌ జగన్ గురించి తప్పుగా మాట్లాడుకునేలా వైకాపా ఎంపీలు చేస్తున్నారంటూ స్వయంగా ఆ పార్టీ కి చెందిన కొందరు నేతలు అంటున్నారు.

Recent Posts

CMF Phone 2 Pro | ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ఆఫర్: రూ. 15వేలలో CMF Phone 2 Pro.. ఫీచర్లు, డిస్కౌంట్ వివరాలు ఇవే

CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…

3 hours ago

Corona | కరోనా త‌గ్గిన వీడని స‌మ‌స్య‌.. చాలా మందికి ఈ విష‌యం తెలియ‌క‌పోవ‌చ్చు..!

Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…

4 hours ago

AP Farmers | ఏపీ రైతుల‌కి శుభ‌వార్త‌.. రూ.8,110 నేరుగా అకౌంట్‌లోకి

AP Farmers | ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…

6 hours ago

TGSRTC | టీఎస్‌ఆర్టీసీ ప్రయాణికుల కోసం లక్కీ డ్రా.. ₹5.50 లక్షల బహుమతులు సిద్ధం!

TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…

8 hours ago

OG Collections | రికార్డులు క్రియేట్ చేస్తున్న ఓజీ.. తొలి రోజు ఎంత వ‌సూళ్లు రాబ‌ట్టింది అంటే..!

OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…

10 hours ago

OG | ‘ఓజీ’ టికెట్ రేట్ల పెంపుపై మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం.. ఇక నుండి పెంపు ఉండ‌దు

OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…

12 hours ago

Coconut | కొబ్బరి తినడం మంచిదేనా.. ఇందులో దాగిన‌ అపాయం ఏంటో తెలుసా?

Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…

13 hours ago

Jackfruit seeds | వైరస్‌లకు చెక్ పెట్టే పనస గింజలు.. రోగనిరోధక శక్తి పెంచే ఆరోగ్య రహస్యం ఇదే!

Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…

14 hours ago