ex minister paleti ramarao not leaving ysrcp
ys jagan : ఏపీ అధికార పార్టీ నుండి పార్లమెంట్ కు మొత్తం 22 మంది ఎన్నిక అయ్యారు. వారిలో ఒకరు మృతి చెందగా మరొకరు పార్టీలో ఉన్నారా లేరా అనే విషయం అర్థం కాకుండా ఉంది. ఆయనే నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు. చనిపోయిన ఎంపీ మరియు రఘురామ కృష్ణంరాజులను వదిలేస్తే ఇంకా 20 మంది ఎంపీలు వైకాపా తరపున పార్లమెంట్ లో మాట్లాడేందుకు అవకాశం ఉంది. పార్లమెంట్ అతి పెద్ద పార్టీల జాబితాలో ముందు వరుసలో ఉన్న వైకాపాకు సభాపతి కావాల్సినంత సమయం ఇచ్చే అవకాశం ఉంది. కాని ఏపీ ఎంపీలు మాత్రం సరిగా ఆ సమయంను ఉపయోగించుకోవడం లేదు. అసలు కొన్ని సార్లు సమయాన్ని కూడా కోరేందుకు వైకాపా ఎంపీలు ఆసక్తి చూపడం లేదు అంటూ విమర్శలు వస్తున్నాయి. ఇటీవల కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై వైకాపా ఎంపీలు ఏం మాట్లాడారో కనీసం ఆ పార్టీ నాయకులకు కూడా తెలియడం లేదు.
ys jagan YSRCP 20 mps not talking in parliament about ap problems
వైకాపాకు చెందిన 20 మంది ఎంపీలు కూడా పార్లమెంట్ లో మౌన ముద్రలో కనిపించడం ఆ పార్టీ నాయకులకు నిరాశ కలిగిస్తుంది. ప్రజల్లో కూడా వారిపై నమ్మకం కలగడం లేదు. వైకాపా నాయకులు కేంద్రం నుండి నిధులు వచ్చే విషయమై ఎంపీలది కీలక పాత్ర ఉంటుందని, ప్రత్యేక హోదాతో పాటు కేంద్రం నుండి రావాల్సినవన్నీ కూడా రాబట్టేందుకు ఎక్కువ మంది ఎంపీలను ఇవ్వాలంటూ వైఎస్ జగన్ ఎన్నికల సందర్బంగా ప్రజలకు విజ్ఞప్తి చేశాడు. ప్రజలు ఏకంగా 22 మంది ఎంపీల బలంను జగన్ కు ఇచ్చారు. కాని ఎంపీలు మాత్రం వైఎస్ జగన్ కు పెద్దగా ప్రయోజనం కలిగేలా చేయడం లేదు.
సీఎం వైఎస్ జగన్ ఎంతో నమ్మకం పెట్టుకుని పార్లమెంట్ కు వారిని పంపిస్తే వారేమో ఇలా మౌనంగా పార్లమెంట్ కు వెళ్తున్నాం వస్తున్నాం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయంలో తీవ్రమైన విమర్శలు ఆ పార్టీ నాయకులపై వ్యక్తం అవుతున్నాయి. బడ్జెట్ కేటాయింపులు మొదలుకుని ఏపీ ప్రజల కల అయిన పోలవరం కు కనీస నిధులను తీసుకు రావడంలో విఫలం అవుతున్నారు. పక్క రాష్ట్రాలకు వేల కోట్లు పంపిస్తున్న కేంద్రం ఏపీకి ఇవ్వకుంటే కనీసం ప్రశ్నించకుండా పార్లమెంట్ లో వైఎస్ జగన్ పరువు తీస్తున్నారు. ఏపీలో కూడా వైఎస్ జగన్ గురించి తప్పుగా మాట్లాడుకునేలా వైకాపా ఎంపీలు చేస్తున్నారంటూ స్వయంగా ఆ పార్టీ కి చెందిన కొందరు నేతలు అంటున్నారు.
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
Kalpika Ganesh Father : నటి కల్పిక గురించి ఆమె తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు.…
This website uses cookies.