YS Sharmila : కొడుకు పుట్టినరోజు నాడు అరుదైన ఫొటోస్ షేర్ చేసిన వైఎస్ షర్మిల..!!

Authored By Breaking News | The Telugu News | Published on: December 18, 2022, 9:00 pm

YS Sharmila : YSRTP పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల తెలంగాణ రాజకీయాల్లో కీలక నాయకురాలిగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి కూతురిగా ఇంకా సీఎం జగన్ చెల్లెలిగా … అందరికీ సుపరిచితురాలే. అయితే అన్న ఆంధ్రాలో ముఖ్యమంత్రిగా రాణిస్తుంటే తెలంగాణ కోడలిగా… సొంతంగా YSRTP పార్టీ పెట్టి.. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా రాణిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్న షర్మిల అనేక రాజకీయ దాడులు ఎదుర్కొంటూ ఉంది.

ఇదే సమయంలో మరొక పక్క ఎట్టి పరిస్థితుల్లో పాదయాత్ర ఆగకుండా కొనసాగిస్తానని అంటూ ఉంది. “ప్రజా ప్రస్థానం” పేరిట షర్మిలా చేస్తున్న పాదయాత్ర ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ క్రమంలో పోలీసులు అరెస్టు చేయడంతో పాటు.. పాదయాత్రకి అనుమతులు ఇవ్వకపోవడం… వంటి వాటితో ఇటీవల వార్తలలో నిలిచింది. ఒకపక్క రాజకీయాలు చేస్తూనే మరోపక్క కుటుంబాన్ని కూడా చూసుకునే షర్మిల… కొడుకు రాజారెడ్డి పుట్టినరోజు నాడు.. సంచలన పోస్ట్ పెట్టడం జరిగింది.ఈ సందర్భంగా కొడుకుతో దిగిన అరుదైన ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేసి…

ys sharmila shared rare photos on her sons birthday

ys sharmila shared rare photos on her sons birthday

జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. హ్యాపీ బర్త్ డే రాజా… హ్యాపీనెస్ ఆల్వేస్… ఎప్పటికీ నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను అనే క్యాప్షన్ పెట్టి కొడుకు పై షర్మిల తన ప్రేమను చాటుకోవడం జరిగింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏదో వెకేషన్ లో ఫోటో దిగినట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం రాజారెడ్డి అమెరికాలో చదువుతూ ఉన్నాడు. అంతేకాదు బాక్సింగ్.. వంటి క్రీడల్లో కూడా రాజారెడ్డి ఛాంపియన్ గా అమెరికాలో నిలిచినట్లు.. అప్పట్లో వార్తలు వచ్చాయి. షేర్ చేసిన ఫోటోలో షర్మిల కాస్త మోడ్రన్ లుక్ లో కనిపించడం విశేషం.

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp