ys sharmila to announce her party on ysr jayanthi
YS Sharmila : తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ పెట్టబోతున్నారు.. అనే వార్తలు వచ్చినప్పుడు అందరూ నవ్వారు. వైఎస్ షర్మిల ఏంది? తెలంగాణలో పార్టీ పెట్టడం ఏంది? అని అంతా అబద్ధం అనుకున్నారు కానీ.. షర్మిల నిజంగానే పార్టీ పెడుతున్నానంటూ ప్రకటించడంతో.. అంతా విస్తుపోయారు. ఎందుకంటే.. తను పార్టీ పెట్టేది ఏపీలో కాదు.. తెలంగాణలో. వైఎస్సార్ అభిమానులు తెలంగాణలో కూడా ఉన్నారని.. తెలంగాణలో రాజన్న రాజ్యం తేవడమే లక్ష్యంగా పార్టీ పెడుతున్నానంటూ షర్మిల ప్రకటించారు. దీంతో తెలంగాణలో ఉన్న మిగితా రాజకీయ పార్టీలు వెంటనే అలర్ట్ అయ్యాయి. షర్మిల పార్టీ పెడితే.. తమ పార్టీ నుంచి ఎవ్వరూ బయటికి వెళ్లకూడదని ముందుగానే అన్ని ప్రణాళికలు రచిస్తున్నారు.
ys sharmila to announce her party on ysr jayanthi
అయితే.. షర్మిల తెలంగాణలో ఎప్పుడు పార్టీ పెడుతారు.. అనేదానిపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. పార్టీ పేరును, జెండా, అజెండాను షర్మిల త్వరలో ప్రకటిస్తారని చెప్పినా.. ఏరోజు తను పార్టీని ప్రకటిస్తారో అన్నదానిపై మాత్రం క్లారిటీ లేదు.
తాజా సమాచారం ప్రకారం.. వైఎస్ అభిమానులతో, ఇతర నేతలతో షర్మిల పార్టీ ఆవిర్భావ తేదీపై చర్చలు జరుపుతున్నారట. ఏరోజైతే బాగుంటుందని.. వైఎస్ అభిమానులను అడిగి తెలుసుకుంటున్నారట.
అయితే.. వైఎస్ షర్మిల.. తన తండ్రి బాటలోనే నడవాలని అనుకుంటున్నారు కాబట్టి.. తన తండ్రి డైరీలో ఉన్న ప్రత్యేకమైన తేదీలనే ఆమె ఎంచుకోనున్నట్టు తెలుస్తోంది. మే 14 వ తారఖున లేదంటే జులై 8న షర్మిల పార్టీని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఎందుకంటే.. మే 14న వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆరోజు అయితే బెటర్ అని ఆమె భావిస్తున్నారట. ఒకవేళ మే 14న కుదరకపోతే.. జులై 8న ఆయన జయంతి రోజున పార్టీని ప్రకటించేందుకు షర్మిల సమాయత్తమవుతున్నారట.
అదే రోజు.. పార్టీ పేరుతో పాటు పార్టీ జెండా, అజెండా, విధివిధానాలు.. అన్నింటినీ షర్మిల ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్కి బూస్టప్ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
This website uses cookies.