YS VIjayamma : ఇక ఏపీలో గెలిచేది చంద్రబాబే.. మాకు జగన్ తో పనిలేదురా.. నా కొడుకుతో అవసరమే లేదు.. వైఎస్ విజయమ్మ సంచలన వ్యాఖ్యలు.. వీడియో
YS VIjayamma : వైఎస్ విజయమ్మ తెలుసు కదా. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి భార్య, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తల్లి, వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తల్లి. ప్రస్తుతం వైఎస్ విజయమ్మ తన బిడ్డ షర్మిలతో ఉండి తన పక్కనే నడుస్తున్నారు. తన పార్టీకి మద్దతు ఇస్తున్నారు. వైఎస్సార్సీపీ పార్టీకి గౌరవ అధ్యక్షురాలిగా అప్పట్లో ఉన్న విజయమ్మ.. ఆ తర్వాత ఆ పదవి నుంచి గత సంవత్సరమే తప్పుకున్నారు. అప్పటి నుంచి తెలంగాణకు వచ్చి తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీకి మద్దతు ఇస్తూ ఆమెకు తోడుగా ఉంటున్నారు.
ఇటీవల వైఎస్ షర్మిల దీక్షను భగ్నం చేసి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే కదా. హైదరాబాద్ లో షర్మిల, విజయమ్మ పోలీసులను కొట్టారంటూ రచ్చ రచ్చ జరిగింది సోషల్ మీడియాలో. ప్రజల కోసం నిరసన చేస్తే, ధర్నా చేస్తే అరెస్ట్ చేస్తారా? అది రాజ్యాంగం కల్పించిన హక్కు కదా. పాదయాత్ర చేస్తూ అందరికీ చెప్పుకుంటూ వెళ్తున్నది ఆమె. దాంట్లో తప్పేముంది అంటూ ప్రశ్నించారు విజయమ్మ.షర్మిల ఏం పరుష పదజాలం ఉపయోగించింది.
YS Vijayamma Comments Over YS Jagan Involvement In Sharmila Arrest
YS VIjayamma : ఏం పరుష పదజాలం ఉపయోగించింది షర్మిల?
రాజశేఖర్ రెడ్డి గారు ఏం చేశారు. ప్రస్తుతం ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది అని అడిగితే ప్రజలే చెబుతున్నారు. ప్రజలే తనను మాట్లాడాలని అంటున్నారు.. అంటూ చెప్పుకొచ్చారు విజయమ్మ. ఈ విషయంలో జగన్ మోహన్ రెడ్డి ఒక అన్నగా స్పందించారా? అని మీడియా ప్రశ్నించగా ఇప్పుడు మనకు జగన్ మోహన్ రెడ్డితో పనేంటి. ఆ రాష్ట్రంతో మనకు పనేంటమ్మా. ఆ రాష్ట్రాన్ని ఇక్కడికి ఎందుకు లాగుతున్నారు. జగన్ తో ఏం సంబంధం. జగన్ తో మనకేం సంబంధం లేదు. ఆ రాష్ట్రంతో అస్సలు సంబంధం లేదు అంటూ చెప్పుకొచ్చారు విజయమ్మ.
