ysrcp leader karanam venkatesh comments on chandrababu
Karanam Venkatesh : టీడీపీ చరిత్ర ముగిసిందని, చంద్రబాబు వల్ల ఆ పార్టీకి ఎలాంటి ప్రయోజనం లేదని చీరాల నియోజకవర్గం ఇంచార్జి కరణం వెంకటేష్ అన్నారు. సోమవారం తాడేపల్లి పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన తెలుగుదేశంపై విరుచుకుపడ్డారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ సంక్షేమం, అభివృద్ధిలో దూసుకెళ్తోందన్నారు. రూ. లక్షా 75 వేల కోట్లు ప్రత్యక్ష నగదు బదిలీ పథకాల ద్వారా ప్రజల వద్దకు పంపిణీ చేశామన్నారు. ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రగతి బాటలో ఎవరు తీసుకువెళ్తున్నారో ప్రజలందరికీ తెలుసని కరణం వెంకటేష్ స్పష్టం చేశారు. చంద్రబాబు పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు అన్యాయమే జరిగిందని, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా, 45 ఏళ్ళుగా క్యాబినెట్ హోదాలో ఉన్న బాబు వల్ల ఎవరికైనా మంచి జరిగిందా అంటే కుప్పం నియోజకవర్గ ప్రజలకే సమాధానం దొరకటం లేదని వెంకటేష్ విమర్శించారు.
కాబట్టే కుప్పంలో తిరుగుబాటు జరుగుతోందన్నారు. బాబు ఏమీ చేయలేదని… జగన్ వచ్చాకే అభివృద్ధి చేస్తున్నారనే ప్రజలు బాబుపై ఈ తిరుగుబాటు చేస్తున్నారని వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో 31 లక్షల మందికి ఇళ్లు ఇవ్వడమంటే అది చిన్న విషయం కాదని కరణం వెంకటేష్ అన్నారు. ప్రజలకు మంచి జరిగితే ఓర్చుకోలేక దుష్ప్రచారాలు చేస్తున్నారన్నారు. ఇన్నేళ్ల అనుభవంలో చంద్రబాబు ఎందుకు ఇలాంటి ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేయలేకపోయాడని నిలదీశారు. కేవలం మూడున్నర ఏళ్లలోనే సీఎం జగన్ ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చారని, ఈ తేడాను ప్రజలు గమనిస్తున్నారని వివరించారు. చంద్రబాబు గానీ, లోకేష్ గానీ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాల్లో ఎక్కడా కూడా ఒక మునిసిపాలిటీ గానీ, గ్రామ పంచాయతీ సీట్లను గానీ గెలుచుకోలేదని, వీళ్లు రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకువెళతారో ప్రజలే ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.
ysrcp leader karanam venkatesh comments on chandrababu
ఈ రోజు పొత్తులు పెట్టుకుంటామంటారన్నారని, మరి గతంలో ఎలా ఉన్నారో కూడా చూడాలని వెంకటేష్ అన్నారు. 2014లో కలిసి పోటీ చేసిన తెదేపా, జనసేనలు 2017లో ఎలా తిట్టుకున్నారో, 2019లో విడిపోయి ఎలా పోటీ చేశారో అందరం చూశామన్నారు. వాళ్లలో వాళ్లే తిట్టుకున్నారని, మళ్లీ ఇప్పుడు కలిసి వచ్చి డ్రామాలు వేస్తున్నారని మండిపడ్డారు. విడివిడిగా 175కి 175 స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పే దమ్ము లేదు కానీ అధికారంలోకి రావాలనే ఆశ మాత్రం ఉందని ఎద్దేవా చేశారు. ఆశ ఉంటే చాలదని, పేద, బడుగు బలహీన ప్రజల దీవెనలు ఉండాలని హితవు పలికారు. అది వైఎస్సార్ సీపీకి ఉందన్నారు. నాడు- నేడు ద్వారా జరుగుతున్న అభివృద్ధి, వాలంటీర్ వ్యవస్థ ద్వారా జరుగుతున్న ప్రజల వద్దకే పరిపాలన సీఎం జగన్ ఆలోచనలకు ఒక ఉదాహరణ అని కరణం వెంకటేష్ వివరించారు.
Daily Bath Saide Effects : ఉదయాన్నే లేవగానే చక్కగా స్నానం చేసి తమ రోజువారి దినచర్యలను పాటిస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వైద్యులు వర్షాకాలంలో కొన్ని రకాల పండ్లను తినాలని చెబుతుంటారు. వర్షాకాలంలో కొన్ని రకాల జ్యూసులు…
Vasthu Tips : గృహమునకు ప్రతి స్థలమునకు వాస్తు తప్పనిసరి. వాస్తు లేకపోతే ఆ గృహములో సెంచే వారికి అన్నీ…
Zodiac Signs :జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. గ్రహాలు ప్రతి నెలకు ఒకసారి, అలాగే ఆరు నెలలకు,సంవత్సరానికి…
Roja : వైసీపీ నేతల అరెస్టుల పరంపరలో మరో మాజీ మంత్రి వంతు వచ్చిందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ ఫైర్బ్రాండ్, అధికార…
Mallareddy : మాజీ మంత్రి మల్లారెడ్డి తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వస్తున్న వార్తలపై స్పష్టత ఇచ్చారు. తాను రాజకీయాలకు…
Coffee Face Pack : అమ్మాయిలు చాలా వరకు అందంపై దృష్టి పెట్టరు. కొందరు దృష్టి పెడితే మరికొందరు అస్సలు…
Narmal Sperm Count : ఈ రోజుల్లో పిల్లలు పుట్టడం లేదు ఆ సమస్య కేవలం మహిళలలో మాత్రమే ఉందని…
This website uses cookies.