
ysrcp leader karanam venkatesh comments on chandrababu
Karanam Venkatesh : టీడీపీ చరిత్ర ముగిసిందని, చంద్రబాబు వల్ల ఆ పార్టీకి ఎలాంటి ప్రయోజనం లేదని చీరాల నియోజకవర్గం ఇంచార్జి కరణం వెంకటేష్ అన్నారు. సోమవారం తాడేపల్లి పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన తెలుగుదేశంపై విరుచుకుపడ్డారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ సంక్షేమం, అభివృద్ధిలో దూసుకెళ్తోందన్నారు. రూ. లక్షా 75 వేల కోట్లు ప్రత్యక్ష నగదు బదిలీ పథకాల ద్వారా ప్రజల వద్దకు పంపిణీ చేశామన్నారు. ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రగతి బాటలో ఎవరు తీసుకువెళ్తున్నారో ప్రజలందరికీ తెలుసని కరణం వెంకటేష్ స్పష్టం చేశారు. చంద్రబాబు పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు అన్యాయమే జరిగిందని, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా, 45 ఏళ్ళుగా క్యాబినెట్ హోదాలో ఉన్న బాబు వల్ల ఎవరికైనా మంచి జరిగిందా అంటే కుప్పం నియోజకవర్గ ప్రజలకే సమాధానం దొరకటం లేదని వెంకటేష్ విమర్శించారు.
కాబట్టే కుప్పంలో తిరుగుబాటు జరుగుతోందన్నారు. బాబు ఏమీ చేయలేదని… జగన్ వచ్చాకే అభివృద్ధి చేస్తున్నారనే ప్రజలు బాబుపై ఈ తిరుగుబాటు చేస్తున్నారని వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో 31 లక్షల మందికి ఇళ్లు ఇవ్వడమంటే అది చిన్న విషయం కాదని కరణం వెంకటేష్ అన్నారు. ప్రజలకు మంచి జరిగితే ఓర్చుకోలేక దుష్ప్రచారాలు చేస్తున్నారన్నారు. ఇన్నేళ్ల అనుభవంలో చంద్రబాబు ఎందుకు ఇలాంటి ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేయలేకపోయాడని నిలదీశారు. కేవలం మూడున్నర ఏళ్లలోనే సీఎం జగన్ ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చారని, ఈ తేడాను ప్రజలు గమనిస్తున్నారని వివరించారు. చంద్రబాబు గానీ, లోకేష్ గానీ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాల్లో ఎక్కడా కూడా ఒక మునిసిపాలిటీ గానీ, గ్రామ పంచాయతీ సీట్లను గానీ గెలుచుకోలేదని, వీళ్లు రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకువెళతారో ప్రజలే ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.
ysrcp leader karanam venkatesh comments on chandrababu
ఈ రోజు పొత్తులు పెట్టుకుంటామంటారన్నారని, మరి గతంలో ఎలా ఉన్నారో కూడా చూడాలని వెంకటేష్ అన్నారు. 2014లో కలిసి పోటీ చేసిన తెదేపా, జనసేనలు 2017లో ఎలా తిట్టుకున్నారో, 2019లో విడిపోయి ఎలా పోటీ చేశారో అందరం చూశామన్నారు. వాళ్లలో వాళ్లే తిట్టుకున్నారని, మళ్లీ ఇప్పుడు కలిసి వచ్చి డ్రామాలు వేస్తున్నారని మండిపడ్డారు. విడివిడిగా 175కి 175 స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పే దమ్ము లేదు కానీ అధికారంలోకి రావాలనే ఆశ మాత్రం ఉందని ఎద్దేవా చేశారు. ఆశ ఉంటే చాలదని, పేద, బడుగు బలహీన ప్రజల దీవెనలు ఉండాలని హితవు పలికారు. అది వైఎస్సార్ సీపీకి ఉందన్నారు. నాడు- నేడు ద్వారా జరుగుతున్న అభివృద్ధి, వాలంటీర్ వ్యవస్థ ద్వారా జరుగుతున్న ప్రజల వద్దకే పరిపాలన సీఎం జగన్ ఆలోచనలకు ఒక ఉదాహరణ అని కరణం వెంకటేష్ వివరించారు.
Heavy Rain Alert : తెలంగాణ రాష్ట్రంలో వర్షాల జోరు కొనసాగుతోంది. గత నాలుగు రోజులుగా పలు జిల్లాల్లో వర్షాలు…
Farmers : దేశంలో రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. రైతుల…
Komatireddy Venkat Reddy : నల్లగొండ జిల్లాలో Nalgonda అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర రోడ్లు,…
AP Thalliki Vandanam Scheme : ఆంధ్రప్రదేశ్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి సిద్ధమవుతున్న వేళ ప్రభుత్వం కీలక నిర్ణయాలపై…
Peddi 6 Days Box Office Collection : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ram charan హీరోగా,…
Students Good News : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమాన్ని మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక…
PM Kisan : దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం…
Gold Rate Today : బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి మరోసారి శుభవార్త అందింది. గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులు…
Rythu Bharosa : రైతు సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలపై మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి…
Banana Health Tips : ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన పండ్లలో అరటిపండు ఒకటి. మన దేశంలో ప్రతి ఇంట్లో…
Tea : భారతీయుల రోజువారీ జీవితంలో చాయ్కు ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం నిద్రలేచిన వెంటనే ఒక కప్పు వేడి…
Today Horoscope : ఈరోజు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ముఖ్యంగా అలసట, ఒత్తిడి సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం…
This website uses cookies.