Ysrcp MLA Narayana swamy coments on Ys jagan
Ysrcp ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి.. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కీలక హోదాలో ఉన్నారు నారాయణస్వామి. కాని సీఎం జగన్ ను ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశారు. సీఎం జగన్ పై ప్రజలే దాడి చేస్తారని మాట్లాడారు.. ఉప ముఖ్యమంత్రిగా ఉండి, ముఖ్యమంత్రిపై ప్రజలే దాడి చేస్తారని మాట్లాడటం సంచలనంగా మారింది. ఈ వీడియో వైరల్ గా మారి రచ్చ రచ్చవుతోంది.. ఇదిలా ఉంటే, నారాయణస్వామి అసలీ కామెంట్ ఎందుకు చేశారన్న చర్చ వైసీపీ నేతల్లో చర్చనీయాంశంగామారింది. అసలు విషయానికి వస్తే.. సీఎం జగన్ పై ప్రజలే దాడి చేస్తారని మాట్లాడింది డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. ప్రస్తుతం ఏపీలో పవన్ కల్యాణ్ రచ్చ సాగుతోంది. సీఎం జగన్ ను టార్గెట్ చేస్తూ పీకే మాట్లాడటంతో.. ఆయనకు వైసీపీ నేతలు కౌంటర్లు వేస్తున్నారు. తమ స్వామి భక్తిని చాటుకునేందుకు ఏపీ వైసీపీ నేతలంతా పోటాపోటీగా ప్రెస్మీట్లు పెట్టి జనసేన అధినేత పవన్ కల్యాణ్పై దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం నారాయణస్వామి సైతం స్వామి భక్తి చాటుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆయన పవన్ ను టార్గెట్ చేయడంలో భాగంగా జగన్పై విమర్శలు చేశారు. పవన్ పై ప్రజలే దాడి చేస్తారని అనబోయి.. నోరు జారారు. జగన్పై ప్రజలే దాడి చేస్తారంటూ వ్యాఖ్యానించారు. ఇదే ఇప్పుడు వైరల్ గా మారింది.
Ysrcp MLA Narayana swamy coments on Ys jagan
ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి జగన్మోహన్ రెడ్డి సర్కార్ పై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్న పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయబోయి అధినేత జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు. పవన్ పైన ఏదో చెప్పాలనుకుని ఇంకేదో చెప్పేశారు. పొరపాటున నోరు జారారు. పవన్ కళ్యాణ్ ను తిట్టబోయి తమ పార్టీ అధినేతపైనే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో చేరడం కోసం పవన్ కళ్యాణ్ ఎన్నో ప్రయత్నాలు చేశారని, అయినా జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ను దగ్గరకు కూడా రానివ్వలేదని నారాయణస్వామి వ్యాఖ్యానించారు. ఇక ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయబోయి జగన్ ను ఉద్దేశించి నారాయణస్వామి చేసిన వ్యాఖ్యలను ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. నారాయణస్వామి ప్రజలు తిరుగుబాటు చేసే రోజులు త్వరలో ఉన్నాయంటూ వ్యాఖ్యలు చేస్తూ, జగన్ దాడి చేయడం ఏమిటి? ప్రజలే దాడి చేస్తారు.. ప్రజలు జగన్మోహన్ రెడ్డి పై దాడి చేసే రోజులు రాబోతున్నాయి అంటూ డిప్యూటీ సీఎం నారాయణస్వామి పొరబాటుగా వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ వీడియో తెలుగు తమ్ముళ్ళ చేతికి చిక్కింది.
ys jagan
పవన్ కళ్యాణ్ ను అనబోయి ఆ స్థానంలో జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రస్తుతం వైరల్ గా మారాయి. నారాయణస్వామి చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. వైసీపీ లీడర్స్ లో జగన్ పై అసంతృప్తి, ఆగ్రహం పెరిగిపోతున్నాయని, అందులో భాగంగానే డిప్యూటీ సీఎం నారాయణస్వామి జగన్ మోహన్ రెడ్డి పై దాడి చేసే రోజు వస్తుందంటూ మనసులో మాట బయటపెట్టారు అంటూ ట్రోల్ చేస్తున్నారు.
Ysrcp MLA Narayana swamy coments on Ys jagan
ప్రజలే జగన్మోహన్ రెడ్డి పై దాడి చేసే రోజులు వస్తాయని ఏడుకొండల వెంకన్న సాక్షిగా డిప్యూటీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి చెప్పారని ట్రోల్ చేస్తూ తెలుగు తమ్ముళ్ళు పోస్టులు పెడుతున్నారు. ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి మాట్లాడిన మాటలను జనసేన, టీడీపీ నేతలు వైరల్ చేస్తున్నారు. జగన్ పై ప్రజలు దాడి చేయడం ఖాయమని, వైసీపీ నేతలే ఈ విషయం చెబుతున్నారంటూ పోస్టులు పెడుతున్నారు.
Ajwain Leaves : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా జింక్ ఫుడ్ ని అలవాటు చేసుకుంటున్నారు. దీని వల్ల…
Seem Chintakaya : సీమ చింతకాయ, దీని గురించి ఇప్పటి ప్రజలకు అసలు తెలియదు. పల్లెల్లో హేమ చింతకాయ గురించి…
Mint Health Benefits : పుదీనా ప్రకృతి నుంచి లభించిన దివ్య ఔషధం. దీని సువాసన అమోఘం. దిని రుచి…
Mars Transit : జ్యోతిష్య శాస్త్రంలో 12 రాశుల గురించి, గ్రహాల గురించి, అవి జీవితంలో ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయో…
Rashmi Gautam : బుల్లితెర సెన్సేషన్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు . వ్యాఖ్యాతగా స్మాల్ స్క్రీన్…
Iphone 15 : ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ల కంటే ఐఫోన్లు ఖరీదైనవి అనే విషయం తెలిసిందే. ఇవి కొనాలంటే కాస్త ఆలోచిస్తాం.…
Husband Wife : వైవాహిక జీవితంలో ముద్దులు ఇద్దరి మధ్య బంధాన్ని మరింత స్ట్రాంగ్ చేస్తాయి. కానీ ఎక్స్ప్లోరేటరీ రీసెర్చ్…
Husband Wife : అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన భార్యాభర్తలకు అదృష్టం మాములుగా లేదు. కేవలం 3 డాలర్లు అంటే మన…
This website uses cookies.