
Ysrcp
YSRCP పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి తుది ఫలితాలు వెలువడ్డాయి. వైఎస్ జగన్ సారధ్యంలోని అధికార వైసీపీ మరోసారి ఏలూరును కైవసం చేసుకుంది. కోర్టు వివాదాల నేపథ్యంలో నాలుగు నెలలు ఆలస్యంగా ఓట్ల లెక్కింపు జరగ్గా, విపక్ష టీడీపీ TDP కేవలం 3 సీట్లకు పరిమితమైంది. పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేన-బీజేపీ కూటమికి ఒక్క సీటూ దక్కలేదు. ఏలూరు కార్పొరేషన్ లో మొత్తం 50 డివిజన్లున్నాయి.
అందులో మూడు సీట్లను ఎన్నికలను ముందే వైసీపీ YSRCPఏకగ్రీవంగా గెలుచుకోగా, ఇవాళ 47 స్థానాలకు కౌంటింగ్ జరిగింది. తుది ఫలితాలు కలిపి, వైసీపీ YSRCP మొత్తం 47 డివిజన్లను గెలుచుకోగా, టీడీపీ TDP కేవలం 3 డివిజన్లలోనే సత్తా చాటుకుంది. సీఎం జగన్ చేస్తోన్న అభివృద్ధి, సంక్షేమానికే ప్రజలు జై కొట్టారని వైసీపీ నేతలు చెప్పారు. ఏలూరు కార్పొరేషన్ లో వైసీపీ గెలుపు ఊహించిందే అయినప్పటికీ, టీడీపీ అంతో ఇంతో పోటీ ఇస్తుందని, గుంటూరు, విశాఖపట్నం మాదిరిగా చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లు సాధిస్తుందని అంతా భావించారు. కానీ చివరికి 3 సీట్లతోనే టీడీపీ సరిపెట్టుకుంది. 28, 37, 47వ డివిజన్లలో టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు.
Ysrcp
రిజర్వేషన్ ప్రకారం ఏలూరు మేయర్ పదవిని ఈసారి జనరల్ మహిళకు కేటాయించారు. వైసీపీ YSRCP తన మేయర్ అభ్యర్థిగా మాజీ మేయర్ షేక్ నూర్జహాన్ పేరును ఖరారు చేసింది. 50 డివిజన్ నుంచి నూర్జహాన్ బేగం విజయం సాధించారు. ప్రత్యర్థిపై 570 ఓట్లు ఆధిక్యతతో ఆమె గెలుపొందారు. కౌంటింగ్ పూర్తి కాకుండానే ఏలూరు మునిసిపల్ కార్పొరేషన్ ను కైవసం చేసుకున్న వైసీపీ.. మేయర్ అభ్యర్థిపై కసరత్తును ప్రారంభించిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. డిప్యూటీ సీఎం ఆళ్ల నాని సొంతూరైన ఏలూరులో మేయర్ పదవి కోసం చాలా మందే కాసుక్కూర్చున్నారు.
YS Jagan
వారిలో ఎవరికి పదవి ఇచ్చినా.. మిగిలిన వారు అలిగి కూర్చునే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా, ఏ ఒక్క చోట కూడా కనిపించని విధంగా ఇక్కడ ఏకంగా ఐదుగురికి మేయర్ పదవిని ఇవ్వనున్నామని అప్పుడెప్పుడో ఆళ్ల నాని ప్రకటించిన సంగతి తెలిసిందే. అంటే.. ఐదేళ్ల కాల పరిమితి కలిగిన మేయర్ పదవిని ఐదుగురికి పంచాలంటే.. ఏడాదికో మేయర్ మారాల్సిందేనన్న మాట. ఎంపికైన వారు ఏడాది తిరక్కుండానే పదవిని అంత ఈజీగా ఎలా వదులుతారోనన్న విషయాలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
Petrol : భారత్లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
High-Protein Breakfast : ఉదయాన్నే తీసుకునే బ్రేక్ఫాస్ట్ మన ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. చాలామంది ఉదయం అల్పాహారాన్ని స్కిప్…
This website uses cookies.