2025 Year : విషాదాన్ని నింపిన 2025.. ఏడాది సగంలో నాల్గు విషాద ఘటనలు.. వందలాది మంది మృతి..!
ప్రధానాంశాలు:
విషాద ఘటనలకు కేరాఫ్ గా నిలుస్తున్న 2025
2025 Year : విషాదాన్ని నింపిన 2025 .. ఏడాది సగంలో నాల్గు విషాద ఘటనలు.. వందలాది మంది మృతి..!
2025 Year : 2025 సంవత్సరం భారతదేశ ప్రజల మనసుల్లో చిరకాలం గుర్తుండిపోయే దుర్ఘటనలతో నిలిచింది. ముందుగా జమ్మూ కాశ్మీర్లోని పహాల్గమ్ వద్ద పర్యాటకులపై ఉగ్రవాదులు జరిగిన ఉగ్రదాడి దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఆ దాడిలో దాదాపు 26 మంది అమాయకుల ప్రాణాలు కోల్పోగా, ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. భద్రతా దళాలు వెంటనే స్పందించి ఆపరేషన్ చేపట్టి పరిస్థితిని నియంత్రించినప్పటికీ, ఈ ఘటన దేశవ్యాప్తంగా ఆందోళనలకు దారితీసింది.

2025 Year : విషాదాన్ని నింపిన 2025.. ఏడాది సగంలో నాల్గు విషాద ఘటనలు.. వందలాది మంది మృతి..!
2025 Year : 2025 సగం ఏడాదిలో నాల్గు విషాద ఘటనలు.. వందలాది మంది మృతి
అలాగే బెంగుళూరులో RCB సక్సెస్ సంబరాల్లో జరిగిన తొక్కిసలాట లో 11 మంది అభిమానులు చనిపోయారు. ఈ ఘటన క్రీడా ప్రపంచాన్ని షాక్ కు గురి చేస్తుంది. భద్రతా లోపం వల్ల వేలాది మందిలో తొక్కిసలాట జరిగింది. ఇది ఊహించని విషాదంగా మారింది. ప్రభుత్వ ఏర్పాట్లు, పోలీసుల నిర్లక్ష్యం, నిర్వాహకుల లోపాలు ఈ ఘటనకు కారణమయ్యాయి. ఈ ఘటన ప్రజలకు ఓ గుణపాఠంగా మిగిలిపోయే ఘటనగా ఇది నిలిచింది.
ఇక ముంబైలో జరిగిన లోకల్ ట్రైన్ తొక్కిసలాట ప్రమాదం, మరియు అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ఈ రెండు ఘోరమైన సంఘటనలు కూడా కలిచివేశాయి. ముంబై లోకల్ ట్రైన్ వద్ద జరిగిన తొక్కిసలాట లో పలువురు ప్రయాణికులు మరణించగా, మరెందరో గాయపడ్డారు. అదే విధంగా జూన్ 12న ఎయిర్ ఇండియా విమానం మెడికల్ హాస్టల్ మీద కుప్పకూలిన ఘటనలో 265 మంది ప్రాణాలు కోల్పోవడం దేశ చరిత్రలో ఒక విషాద మైలు రాయిగా మిగిలింది. ఈ నాలుగు సంఘటనలు దేశ భద్రతా వ్యవస్థలపై, ఆపద సమయంలో స్పందించే విధానాలపై పలు ప్రశ్నలను రేపాయి. రాబోయే రోజుల్లో ఎలాంటి ఘటనలు జరగకూడదని అంత కోరుకుందాం.