YS Jagan : తెలంగాణ ఎన్నికల్లో ఏం జరిగిందో తెలుసు కదా. తన సిట్టింగ్ ఎమ్మెల్యేలను కేసీఆర్ మార్చకపోవడంతో సిట్టింగులంతా ఓడిపోవడం జరిగింది. అందులో ఎక్కువ శాతం మంత్రులే. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఓడిపోవడంతో చివరకు తనకు అధికారమే దూరమైంది. కేవలం 39 సీట్లతో బీఆర్ఎస్ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సిట్టింగ్ లను మార్చిన 9 నియోజకవర్గాల్లో ఏడుగురు అభ్యర్థులు గెలిచారు. సిట్టింగ్ ల మీద నియోజకవర్గ స్థాయిలో తీవ్రమైన వ్యతిరేకత ఉందని తెలిసినా కేసీఆర్ డేర్ స్టెప్ వేశారు. కానీ.. మూడో సారి అధికారంలోకి రాలేకపోయారు. ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. తెలంగాణలో కేసీఆర్ చెప్పిన తప్పును ఏపీలో వైఎస్ జగన్ చేయాలని అనుకోవడం లేదు. ఒకవేళ కేసీఆర్ చేసిన తప్పునే జగన్ కూడా చేస్తే.. 2024 ఎన్నికల తర్వాత జగన్ కూడా ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వస్తుంది. అందుకే 62 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చే పనిలో పడ్డారు సీఎం జగన్. ఏపీలో ఉన్నది 175 నియోజకవర్గాలు. అందులె 150కి పైగా వైసీపీకి ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో 62 మంది సిట్టింగ్ లను ఖచ్చితంగా మారుస్తున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే 11 స్థానాల్లో కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలకే వేరే నియోజకవర్గాన్ని అప్పగించారు. ఇక.. 62 స్థానాల్లో సిట్టింగ్ లను లేపేసి కొత్త వారికి, లేదా ఇతర నాయకులకు జగన్ అవకాశం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఏపీలో ఎన్నికలకు ఇంకా 4 నెలలు మాత్రమే సమయం ఉంది. అందుకే ఇప్పటి నుంచే అభ్యర్థుల ఎంపికలో పడింది హైకమాండ్. అయితే.. ఒక్కసారిగా 62 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్స్ ఇవ్వకపోవడం అనేది ఎంత మేరకు వర్కవుట్ అవుతుంది అనేది మాత్రం తెలియదు. మరోవైపు తనకు ఎంతో సన్నిహితుడు అయిన ఆళ్ల రామకృష్ణారెడ్డినే కాదని బీసీకే టికెట్ ఇవ్వాలని జగన్ ఫిక్స్ అయ్యారంటే.. ఎవ్వరు ఏం అనుకున్నా.. ఎవ్వరు ఫీల్ అయినా కాకున్నా.. ఎవరు రెబల్ గా మారినా.. ఇంకేం చేసినా కూడా 62 చోట్ల మాత్రం ఖచ్చితంగా అభ్యర్థులను మారుస్తున్నట్టు తెలుస్తోంది.
తాజాగా జగన్ అన్ని నియోజకవర్గాల్లో సర్వే చేయిస్తున్నారు. ఆ సర్వేలో ఎమ్మెల్యేలకు పాజిటివ్ గా రిపోర్ట్ వస్తేనే వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వాలని జగన్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఒకవేళ సర్వేలో పాజిటివ్ రాకపోతే ఆ స్థానంలో వేరే నేతకు టికెట్ ఇవ్వాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఒకవేళ సిట్టింగ్ లకు టికెట్లు ఇవ్వకపోతే వాళ్లు వేరే పార్టీలోకి వెళ్లినా.. వాళ్లు ఏం చేసినా కూడా జగన్ లెక్కచేసేది లేదని.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలవాలంటే ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.