Ambati Rambabu : పంచాయితీ ఎన్నికల్లో వందల కొద్ది ఏకగ్రీవాలు అవ్వడంపై తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరియు జనసేనాని పవన్ కళ్యాణ్ లు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వైకాపా నాయకులు బెదిరించి డబ్బులు ఆశ చూపించి చంపుతామంటూ హెచ్చరించి గ్రామ అభివృద్ది విషయంలో హెచ్చరించి చివరకు ఏకగ్రీవం అయ్యే చేస్తున్నారు. తమ పార్టీ అభ్యర్థి సర్పంచ్ అవ్వకుంటే గ్రామానికి వచ్చే నిధులను క్యాన్సిల్ చేయిస్తామని హెచ్చరిస్తూ ఏకగ్రీవాలకు పాల్పడుతున్నారు. అంటూ తెలుగు దేశం పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై పలు సందర్బాల్లో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కు ఫిర్యాదు చేసినా కూడా ఫలితం లేకుండా పోయింది. వైకాపా నాయకులు కూడా బాబు, పవన్లపై ప్రతి విమర్శలు మొదలు పెట్టారు.
పంచాయితీ ఎన్నికల్లో జరుగుతున్న ఏకగ్రీవాలపై తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లు పదే పదే విమర్శలు చేస్తున్న నేపథ్యంలో వైకాపా నాయకుడు అంబటి రాంబాబు స్పందించాడు. ఆయన మీడియాతో మాట్లాడుతూ పంచాయితీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు కావాలంటూ అంతా కోరుకుంటూ ఉంటారు. కాని వీరిద్దరు మాత్రం ఏకగ్రీవాలు వద్దని అంటున్నారు. ఇంతగా ఏకగ్రీవాలు వద్దు అంటున్న మీరు ఎందుకు కోర్టుకు వెళ్లడం లేదు అంటూ ప్రశ్నించారు. కోర్టుకు వెళ్తే ఏకగ్రీవాలు ఎందుకు వద్దంటున్నారు అంటూ రివర్స్ లో మీకే మొట్టికాయలు పడే అవకాశం ఉంది. అందుకే మీరు కోర్టుకు వెళ్లలేరు అంటూ రాంబాబు ఎద్దేవ చేశాడు.
పంచాయితీ ఎన్నికల్లో ఏకగ్రీవాలను స్వాగతించాల్సింది పోయి ఇలా వాటిని వ్యతిరేకించడం సిగ్గు చేటు. ఇది ప్రజాస్వామ్య దోరణికి సరైనది కాదు. అధికారం కోసం చంద్రబాబు నాయుడు చేస్తున్న ఆరోపణల్లో ఇది ఒకటి. ఆయన గతంలో చేసినట్లుగా ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా అక్రమంగా రాజకీయం చేస్తున్నాడని అనుకుంటున్నారు. కాని ప్రజాస్వామ్య బద్దంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తున్నారు. వైకాపా ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంకు వ్యతిరేకంగా వెళ్లదు అంటూ ఈ సందర్బంగా రాంబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు.
Current Affairs : వివిధ ప్రవేశ పరీక్షలతో పాటు సివిల్ సర్వీస్ పరీక్షలలో విజయం సాధించాలని ఆశించే యువత ప్రపంచంలోని…
New Ration Card : తెలంగాణ ప్రభుత్వం తన పౌరుల సంక్షేమాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో రేషన్ కార్డుల పంపిణీ వ్యవస్థలో…
Boom Boom Beer : ఏపీలో మద్యం ప్రియులు గత కొన్నాళ్లుగా సరికొత్త విధానాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. కొత్త…
Ap Womens : ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అమలులోకి వచ్చాక సూపర్ సిక్స్ పథకం అమలు దిశగా వడివడిగా అడుగులు…
New Liquor Policy : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సమూలమైన మార్పులు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తుంది. కొత్తగా మద్యం…
Chandrababu : గత కొన్ని రోజులుగా ఏపీలో మెడికల్ సీట్ల వ్యవహారం పెద్ద హాట్ టాపిక్ అవుతుంది. తన హయాంలో…
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రోజు రోజుకి రసవత్తరంగా మారుతుంది. కంటెస్టెంట్స్…
Electric Tractor : రైతులకు శుభవార్త... వ్యవసాయంలో రైతులకు వెన్నుదన్నుగా నిలిచే సరికొత్త ట్రాక్టర్ను మహారాష్ట్రకు చెందిన యువకుడు అభివృద్ధి…
This website uses cookies.