America : ట్రంప్ బుద్ది ఏంటో మరోసారి భారతీయులకు తెలిసి వచ్చింది..!
America : ఆపరేషన్ సిందూర్ పరిణామాల నేపథ్యంలో భారత్కు ఒక స్పష్టమైన సందేశం అందింది. ప్రపంచం భావోద్వేగాలతో కాకుండా వ్యూహాత్మక లాభనష్టాల దృష్టితో పనిచేస్తోంది అని. భారత్ వంటి శాంతిని కోరే దేశం కూడా ఇప్పుడు నిజమైన మిత్రులను ఎంచుకునే విషయంలో ఎక్కువ ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన మాటలతో పాక్ను భారత్తో సమానంగా చూస్తూ, మితవాద దేశాన్ని ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశంతో ఒకే మూడులో ఉంచడం భారతీయుల మనసుకు బాధ కలిగించే అంశం. ఇది తమ ప్రయోజనాలను కాపాడుకోవడంలో మాత్రమే ఆసక్తి ఉన్న దేశాల బహిరంగ నైజాన్ని ఆవిష్కరిస్తోంది.
America : ట్రంప్ బుద్ది ఏంటో మరోసారి భారతీయులకు తెలిసి వచ్చింది..!
అసలు పాకిస్తాన్కు అమెరికా ఎందుకు మద్దతు ఇస్తోంది? అని చూస్తే, దానికి ప్రధాన కారణం చైనాతో ఉన్న సంబంధమే. చైనా ఈ ప్రాంతంలో వ్యూహాత్మకంగా బలమైన శక్తిగా ఎదగడంతో, పాక్ను వదలకుండా అమెరికా ముందుకు తీసుకెళుతోంది. ఈ క్రమంలో భారత్ను నిజమైన మిత్రుడిగా కాకుండా, వాణిజ్య భాగస్వామిగా మాత్రమే చూస్తున్నట్లు స్పష్టమవుతోంది. అవసరమైనప్పుడు వాణిజ్య ఒప్పందాలను కూడా విరమించేస్తామని హెచ్చరికలు చేయడం, వారి ఆలోచనలో మిత్రత్వానికి మించిన లాభం ముఖ్యమని నిరూపిస్తుంది. ఇది భారతీయులకు సరికొత్త హెచ్చరిక.
ఈ పరిస్థితుల్లో భారత్ తన అభివృద్ధిని ఇతరులపై ఆధారపడకుండా నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. అమెరికాపై పూర్తిగా ఆధారపడే ధోరణిని తగ్గించి, స్వావలంబనను పెంచుకోవాలి. దేశ భద్రత, ఆర్థిక స్థిరత్వం వంటి కీలక అంశాల్లో ఇతరులపై ఆశపడకుండా, భారతదేశం తన శక్తులను మరింతగా అభివృద్ధి చేసుకోవాలి. “శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు లేరు. శాశ్వతంగా ఉండేది దేశ ప్రయోజనం మాత్రమే” అనే మాటను గుండె లోతుల్లో పెట్టుకొని, ప్రతి భారతీయుడు సమర్థవంతంగా పనిచేయాల్సిన సమయం ఆసన్నమైంది.
New Ration Cards : రేషన్ కార్డు కోసం వేచిచూస్తున్న లబ్దిదారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి…
POMIS scheme : మధ్యతరగతి ప్రజలు, నెలవారీ స్థిర ఆదాయాన్ని కోరుకునే ఉద్యోగ విరమణ పొందినవారు తరచూ సురక్షితమైన పెట్టుబడి…
Brother : తమిళనాడులోని పుదుక్కోట్టై జిల్లా, అలంగుడి సమీపంలోని పుల్లన్విడుటి గ్రామంలో కుటుంబంలో జరిగిన హత్యాచారం తీవ్ర సంచలనంగా మారింది.…
Pakiza : 1990 దశకంలో కామెడీ పాత్రలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన నటి పాకీజా గుర్తుండే ఉంటుంది. ‘అసెంబ్లీ రౌడీ’…
Producer : దిల్ రాజు సోదరుడు శిరీష్ తాజాగా మాట్లాడిన మాటలు, బయట పెట్టిన లెక్కలన్నీ కూడా హాట్ టాపిక్గా…
Holidays : వేసవి సెలవులు ముగిసిన తర్వాత విద్యార్థులు బాగా అలసిపోయిన తరుణంలో జూన్ నెల పండగలేమీ లేకపోవడంతో కాస్త…
Jio Electric Bicycle : రిలయన్స్ జియో ఈ మధ్య ఎలక్ట్రిక్ వెహికిల్స్ని మార్కెట్లోకి తీసుకొస్తుంది. ఇప్పుడు 400 కిమీ రేంజ్తో…
Anil Kumar Yadav : ఏపీలో అధికారాన్ని కోల్పోయిన తరువాత వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వరుస…
This website uses cookies.