America : ట్రంప్ బుద్ది ఏంటో మరోసారి భారతీయులకు తెలిసి వచ్చింది..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

America : ట్రంప్ బుద్ది ఏంటో మరోసారి భారతీయులకు తెలిసి వచ్చింది..!

 Authored By ramalingaiahtandu | The Telugu News | Updated on :14 May 2025,11:00 am

ప్రధానాంశాలు:

  •  America : ట్రంప్ బుద్ది ఏంటో మరోసారి భారతీయులకు తెలిసి వచ్చింది..!

America : ఆపరేషన్ సిందూర్ పరిణామాల నేపథ్యంలో భారత్‌కు ఒక స్పష్టమైన సందేశం అందింది. ప్రపంచం భావోద్వేగాలతో కాకుండా వ్యూహాత్మక లాభనష్టాల దృష్టితో పనిచేస్తోంది అని. భారత్ వంటి శాంతిని కోరే దేశం కూడా ఇప్పుడు నిజమైన మిత్రులను ఎంచుకునే విషయంలో ఎక్కువ ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన మాటలతో పాక్‌ను భారత్‌తో సమానంగా చూస్తూ, మితవాద దేశాన్ని ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశంతో ఒకే మూడులో ఉంచడం భారతీయుల మనసుకు బాధ కలిగించే అంశం. ఇది తమ ప్రయోజనాలను కాపాడుకోవడంలో మాత్రమే ఆసక్తి ఉన్న దేశాల బహిరంగ నైజాన్ని ఆవిష్కరిస్తోంది.

America ట్రంప్ బుద్ది ఏంటో మరోసారి భారతీయులకు తెలిసి వచ్చింది

America : ట్రంప్ బుద్ది ఏంటో మరోసారి భారతీయులకు తెలిసి వచ్చింది..!

America : పాక్ – భారత్ రెండు సమానమే అన్నట్లు మాట్లాడి భారతీయులను బాధకలిగించిన ట్రంప్

అసలు పాకిస్తాన్‌కు అమెరికా ఎందుకు మద్దతు ఇస్తోంది? అని చూస్తే, దానికి ప్రధాన కారణం చైనాతో ఉన్న సంబంధమే. చైనా ఈ ప్రాంతంలో వ్యూహాత్మకంగా బలమైన శక్తిగా ఎదగడంతో, పాక్‌ను వదలకుండా అమెరికా ముందుకు తీసుకెళుతోంది. ఈ క్రమంలో భారత్‌ను నిజమైన మిత్రుడిగా కాకుండా, వాణిజ్య భాగస్వామిగా మాత్రమే చూస్తున్నట్లు స్పష్టమవుతోంది. అవసరమైనప్పుడు వాణిజ్య ఒప్పందాలను కూడా విరమించేస్తామని హెచ్చరికలు చేయడం, వారి ఆలోచనలో మిత్రత్వానికి మించిన లాభం ముఖ్యమని నిరూపిస్తుంది. ఇది భారతీయులకు సరికొత్త హెచ్చరిక.

ఈ పరిస్థితుల్లో భారత్ తన అభివృద్ధిని ఇతరులపై ఆధారపడకుండా నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. అమెరికాపై పూర్తిగా ఆధారపడే ధోరణిని తగ్గించి, స్వావలంబనను పెంచుకోవాలి. దేశ భద్రత, ఆర్థిక స్థిరత్వం వంటి కీలక అంశాల్లో ఇతరులపై ఆశపడకుండా, భారతదేశం తన శక్తులను మరింతగా అభివృద్ధి చేసుకోవాలి. “శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు లేరు. శాశ్వతంగా ఉండేది దేశ ప్రయోజనం మాత్రమే” అనే మాటను గుండె లోతుల్లో పెట్టుకొని, ప్రతి భారతీయుడు సమర్థవంతంగా పనిచేయాల్సిన సమయం ఆసన్నమైంది.

Advertisement

ramalingaiahtandu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది