
behind the story kcr delhi tour
KCR Delhi Tour ఏ ప్రయోజనం లేనిదే రాజకీయ నాయకులు ఏం చేయరనేది అందరికీ తెలిసిన విషయమే. ఎన్నికల్లో విజయం దగ్గర నుంచి అధికారాన్ని నిలబెట్టుకోవడం వరకూ ప్రతి సందర్భంలోనూ తమ ప్రయోజనాల కోసమే నాయకులు వ్యూహాలు రచిస్తారు. ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ దిల్లీ పర్యటన వెనక కూడా ఇలాంటి ప్రణాళికే దాగి ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో అక్కడ గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న ఈటల రాజేందర్ను ఇరకాటంలో పెట్టే దిశగా బీజేపీపై వ్యతిరేకిత తెప్పించడమే కేసీఆర్ మాస్టర్ ప్లాన్గా రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కేసీఆర్ అక్కడ విజయం కోసం అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు.
behind the story kcr delhi tour
దళిత బంధు పథకాన్ని ఆ నియోజకవర్గంలోనే మొదటగా అమలు చేయడంతో పాటు అక్కడ స్థానిక నాయకులకు కీలక పదవులు అప్పజెప్పడం అభివృద్ధి పనులను పరుగులెత్తించడం ఇలా అన్ని ప్రణాళికలు అమలు చేస్తున్నారు. అయినప్పటికీ ఈటలకే అక్కడి ప్రజల మద్దతు ఉందని ఇంటిలిజెన్స్ రిపోర్ట్ రావడంతో కరోనా సాకుతో ఉప ఎన్నిక వాయిదా పడేలా చేశారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు బీజేపీని ఇరకాటంలో పెట్టే వ్యూహాన్ని తెరపైకి తెచ్చారని చెప్తున్నారు.ఏడాదికిపైగా ఢిల్లీ ముఖం చూడని కేసీఆర్ ఇప్పుడు దేశ రాజధానిలో టీఆర్ఎస్ పార్టీ భవనం భూమి పూజ కోసం వెళ్లి అక్కడే మకాం వేశారు. ప్రధాని మోడీతో సహా హోంశాఖ మంత్రి అమిత్ షా ఇతర కేంద్రమంత్రులను ఆయన కలిశారు.
behind the story kcr delhi tour
అయితే ఇలా బీజేపీ నేతలను కలవడం వెనక ఇక్కడ హుజూరాబాద్లో ఆ పార్టీ తరపున పోటీ చేయనున్న ఈటలను టార్గెట్ చేయాలనే ప్లాన్ దాగి ఉందని నిపుణులు అనుకుంటున్నారు. పెండింగ్ సమస్యలను కేంద్రం ముందు పెట్టారు. విభజన హామీలను అమలు చేయాలని కోరారు. ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వానికి అధికారిక భవనం కావాలనే డిమాండ్ లేవనెత్తారు. తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలకు కేంద్రమే పరిష్కారం చూపాలనే కోణంలో ట్రిబ్యునల్ను డిమాండ్ చేశారు. ఇలా వివిధ సమస్యలనే ఏకరవు పెట్టారు. రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణకు హామీ ఇచ్చిన అనేక అంశాలు కేంద్రం వద్ద పెండింగ్లోనే ఉన్నాయి. ఇప్పుడు వీటిన మరోసారి ప్రస్తావించిన కేసీఆర్ బీజేపీని ఇరకాటంలో పెట్టేలా వ్యవహరించారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
behind the story kcr delhi tour
కేంద్రం వద్ద కేసీఆర్ ప్రస్తావించిన ఈ అంశాలన్నీ ఉప ఎన్నికల్లో బీజేపీపై ప్రయోగించేందుకు టీఆర్ఎస్కు విమర్శనాస్త్రాలు కాబోతున్నాయని టాక్. తాము ప్రధానిని కలిసి పదే పదే విన్నివించుకున్నప్పటికీ రాష్ట్రానికి న్యాయం చేయడం లేదనే ఆరోపణలను టీఆర్ఎస్ ప్రజల ముందు ఉంచబోతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కేసీఆర్ బతిమాలుకుంటేనే ప్రధాని అపాయింట్మెంట్ ఇచ్చారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలు కూడా టీఆర్ఎస్కే రాజకీయ ఆయుధంగా మారే వీలుంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏమైనా చేస్తానని గతంలో కేసీఆర్ చాలా సార్లు ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ కోసం తాము ప్రధానిని బతిమాలుకున్నా పని కావడం లేదని మోడీని కలిసినా రాష్ట్ర ప్రాజెక్టులకు అనుమతులు లభించలేదని టీఆర్ఎస్ ప్రచారం చేసుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు.
Trump Modi Putin : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఇరాన్ అమెరికా యుద్ధ వాతావరణాన్ని గమనిస్తే దీని వెనుక రష్యా…
India : ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా వ్యవస్థలు ఒడిదుడుకులకు లోనవుతున్న తరుణంలో భారతదేశం తన శక్తి అవసరాల కోసం ఒక…
Trisha - Vijay : తమిళ రాజకీయాల్లో ప్రస్తుతం దళపతి విజయ్ పేరు మారుమోగిపోతోంది. తన సొంత పార్టీ తమిళగ…
CM Revanth Reddy : తెలంగాణ ప్రజల ఆరోగ్యం విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు నిజంగా అభినందనీయం.…
Mobile Recharge : మొబైల్ రీఛార్జ్ ప్లాన్ల విషయంలో సామాన్యులకు ఊరటనిచ్చేలా భారీ మార్పులు రాబోతున్నాయి. ఇప్పటివరకు టెలికాం సంస్థలు…
Central Govt Employees DA Hike : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు Central Government Employees, పెన్షనర్లకు ఇది నిజంగా…
AP and Telangana Weather Report : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం విచిత్రమైన వాతావరణం నెలకొంది. ఉదయం పూట సూర్యుడు…
Farmer : సాధారణంగా ఏదైనా ప్రభుత్వ ప్రాజెక్టు కోసం భూములు సేకరిస్తే.. రైతులు ఆందోళన చెందుతారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారం…
Gold Silver Rate 31st March 2026 : బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న పసిడి ప్రియులకు మళ్లీ సడెన్…
Karthika Deepam 2 March 31st 2026 Episode : స్టార్ మా ఛానెల్లో అత్యంత విజయవంతంగా, ప్రేక్షకుల ఆదరణ…
Pineapple Juice : వేసవి తాపం నుండి ఉపశమనం పొందడానికి పైనాపిల్ రసం ఒక అద్భుతమైన పానీయం అని చెప్పవచ్చు.…
Potatoes : వేసవి కాలంలో బంగాళదుంపలు తినవచ్చా లేదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. సాధారణంగా బంగాళదుంపను ఒక…
This website uses cookies.