Errabelli Dayakar Rao : ఝాన్సీ రెడ్డి పేరు కొత్తగా వినిపించి ఉండొచ్చు కానీ.. ఝాన్సీ రెడ్డి పేరు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో మారుమోగిపోతోంది. దానికి కారణం.. ఆమె ఒక ఎన్ఆర్ఐ. తనది పాలకుర్తి నియోజకవర్గం. 6 నెలల కింద భారత్ కు వచ్చిన ఝాన్సీ రెడ్డి కాంగ్రెస్ లో యాక్టివ్ గా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆమె పాలకుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది. నిజానికి పాలకుర్తి నియోజకవర్గం అంటేనే రాజకీయాలు చాలా హీటెక్కిస్తూ ఉంటాయి. అక్కడ ఉన్నది బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎర్రబెల్లి దయాకర్ రావు. ఇప్పుడు ఆయన మంత్రిగా ఉన్నారు. అందుకే.. అక్కడ వేరే పార్టీల నుంచి ఎవరు పోటీ చేస్తారా అని పెద్ద రచ్చ నడుస్తోంది. అయితే.. పాలకుర్తి నియోజకవర్గంలో ఎర్రబెల్లిని ఢీకొట్టే వారు లేరని అనుకుంటున్న నేపథ్యంలో ఝాన్సీ రెడ్డి రాకతో బీఆర్ఎస్ క్యాడర్ కు టెన్షన్ స్టార్ట్ అయింది.
పాలకుర్తి నియోజకవర్గంలో ఝాన్సీ రెడ్డి యాక్టివ్ అయ్యారు. ఎర్రబెల్లిని ఓడించేందుకు తన శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. చాలామంది బీఆర్ఎస్ నేతలు ఆమె సమక్షంలో కాంగ్రెస్ లో చేరుతున్నారు. తాజాగా నియోజకవర్గంలో తొర్రూరు మండలం మడిపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నేతలు ఝాన్సీ రెడ్డి సమక్షంలో హస్తం గూటికి చేరారు. దీంతో బీఆర్ఎస్ పార్టీకి అక్కడ ఎదురుదెబ్బ తగిలింది. ఇలా.. నియోజకవర్గంలో రోజూ కొందరు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరుతుండటంతో నియోజకవర్గంలో ఈసారి బీఆర్ఎస్ పార్టీ ఆశలు వదిలేసుకోవాల్సిందేనా అనే మాటలు వినిపిస్తున్నాయి.
ఈసందర్భంగా బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ లోకి ఆహ్వానించి.. పేదలకు భూములు ఇవ్వాలన్నా.. ఇండ్లు కట్టించాలన్నా.. మన పొలాలకు నీళ్లు రావాలన్నా, మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా పరిశ్రమలకు ఏర్పాట్లు జరగాలన్నా.. తెలంగాణలో అధికారంలోకి రావాల్సింది కాంగ్రెస్ ప్రభుత్వమే అని ఝాన్సీ రెడ్డి అన్నారు. వరుసగా రెండు సార్లు బీఆర్ఎస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జ్ ఝాన్సీ రెడ్డి ప్రజలను కోరారు.
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
This website uses cookies.