BRS MLAs : కాంగ్రెస్‌ ఆపరేషన్‌ ఆకర్ష్‌.. అబ్బె.. ఉత్తిదే..!

BRS MLAs : తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. దీంతో భారత రాష్ట్ర సమితి పార్టీలో టెన్షన్ మొదలైంది. గులాబీ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం, ఆయనకు పుష్పగుచ్చం సమర్పించుకొని, ఆయనతో కలిసి ఫోటోలు దిగటం, భేటీ కావడం, చర్చ సాగించడం ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాలలో సంచలనంగా మారింది. అయితే ఈ నలుగురు ఎమ్మెల్యేలు కూడా తాము తమ తమ నియోజకవర్గ అభివృద్ధి పనుల గురించి చర్చించడానికి మాత్రమే ముఖ్యమంత్రిని కలిశామని, అంతకుమించి తమ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదని అంటున్నారు. అలాంటి మాటల ద్వారా తాము కాంగ్రెస్ లోకి ఫిరాయించడం లేదని సంకేతాలను పంపడానికి ప్రయత్నిస్తున్నారు.అయినా తాడి చెట్టు కింద నిల్చుని పాలు తాగిన కళ్ళు తాగినట్టే అని సమాజం భావిస్తుంది. ఈ సంగతి సామాన్యులైన మన తోటి వారి కంటే రాజకీయాల్లో ఉన్న వారికి ఇంకా బాగా తెలుస్తుంది. ఒకవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల జోలికి ఇంకా వెళ్లకుండా కిందిస్థాయిలో కార్యకర్తలని అందరిని ఆ పార్టీలోంచి ఖాళీ చేసేస్తూ మున్సిపాలిటీలను జిల్లా పరిషత్తులను తమ వశం చేసుకుంటూ కాంగ్రెస్ రాజకీయం నడిపిస్తోంది.

ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే కూలుతుందని గులాబీ విమర్శలకు కౌంటర్ గా పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నుంచి 30 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి చేరుతారని సాక్షాత్తు మంత్రులే చెబుతున్న తరుణంలో నలుగురు భారాస ఎమ్మెల్యేలు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలవడం ఫిరాయింపుకు తొలిమెట్టుగానే ప్రజలు భావిస్తారు.సునీత లక్ష్మారెడ్డి ( నర్సాపూర్ ) , మహిపాల్ రెడ్డి ( పటాన్ చెరువు) , కొత్త ప్రభాకర్ రెడ్డి ( దుబ్బాక ) మాణిక్ రావు ( జహీరాబాద్) లు సీఎంను కలిశారు. అయితే ఈ నలుగురు భేటీ అయి వచ్చిన వెంటనే బీఆర్ఎస్ కంగారు పడింది. వారితో మాట్లాడింది. సునీత లక్ష్మారెడ్డి మాత్రం తన నియోజకవర్గ డెవలప్మెంట్ అనే పదంతో పాటు ఎమ్మెల్యే భద్రత గురించి మాట్లాడాను అన్నారు. ఇక మహిపాల్ రెడ్డి కాస్త క్రియేటివిటీ ప్రదర్శించి ప్రధాని మోడీని సీఎం రేవంత్ రెడ్డి ఎలా కలిశారో తాము కూడా సీఎంను అలాగే కలిసామని అన్నారు. మిగిలిన ఇద్దరు కూడా ఇంచుమించు అలాంటి ప్రకటనలే చేశారు.

అయితే బీఆర్ఎస్ లో మాత్రం కంగారు ఇంకా తగ్గలేదు.బుధవారం నాడు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. తాము భేటి కావడంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండించడానికి ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినట్టుగా పార్టీ ప్రకటించింది. ఈ ప్రెస్ మీట్ లో కేవలం దుష్ప్రచారాన్ని ఖండించడం మాత్రమే కాకుండా రేవంత్ రెడ్డి సర్కార్ మీద ఈ నలుగురు ఎలా విరుచుకుపడతారు అనేదాన్ని బట్టి వారు ఫిరాయిస్తున్నారా లేదా అనేది అర్ధమైపోతుంది అంటున్నారు. అయినా ఇలాంటి కలయికలకు అర్థాలు వేరేలా ఉంటాయి. వీరు నుంచి సిగ్నల్ వెళ్ళిపోయింది. అటునుంచి రేవంత్ పచ్చజెండా ఎప్పుడూ ఊపుతారు అనేదాన్ని బట్టి, అప్పటిదాకా వారు గులాబీ ప్రేమనే ఒలక పోస్తూ ఈ గట్టున ఉంటారని అటు నుంచి సిగ్నల్ రాగానే జంప్ చేస్తారని ప్రజలు భావిస్తున్నారు.

Recent Posts

Health Benefits : ఈ ఆకు సర్వరోగ నివారిణి… తమాషా కాదు… దీని ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు…?

Health Benefits : ఆకు గురించి చెబితే కొందరు తమాషాగా తీసుకుంటారు.. కానీ ఇది ఒక దివ్య ఔషధం. ఇది…

24 minutes ago

Weak Bones Symptoms : ఈ తప్పులు చేశారో… మీ ఎముకలు విరిగిపోయినట్లే… రాబోయే కాలానికి,తస్మాత్ జాగ్రత్త…?

Weak Bones Symptoms : శరీరంలో ప్రతి ఒక్క అవయవం ముఖ్యమే. అందులో ఎముకలు ఇంకా ముఖ్యం. వీటిని జాగ్రత్తగా…

1 hour ago

Zodiac Signs : ఈ రాశుల వారికి… నక్షత్ర సంచారం చేత… కోరిన కోరిక కొంగుబంగారమే….?

Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు వాటి గమనం ఎల్లప్పుడూ వాటి దిశలు మార్చుకుంటాయి. ఈ క్రమంలో…

2 hours ago

Totapuri Mangoes : రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టిన తోతాపురి మామిడి..!

Totapuri Mangoes : ప్రతీ వేసవి సీజన్‌లో కర్ణాటక రాష్ట్రం నుండి పెద్ద ఎత్తున తోతాపురి మామిడి పండ్లు ఆంధ్రప్రదేశ్‌లోని…

11 hours ago

Pithapuram Varma : అక్రమ పనులు ఏ పార్టీ నాయకులు చేసినా అడ్డుకొనితీరుతాం : పిఠాపురం వర్మ

Pithapuram Varma : పిఠాపురం నియోజకవర్గం ప్రజలు నిజాయితీ, నైతికతతో ముందుకు సాగాలని మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు. ప్రజల…

12 hours ago

Ahmedabad Plane Crash : అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం .. కన్నీరు పెట్టిస్తున్న గుడ్ బై ఇండియా అంటూ బ్రిటీష్ ప్రయాణికుల సెల్ఫీ వీడియో..!

Ahmedabad Plane Crash : భారతదేశ విమానయాన చరిత్రలో తీవ్ర విషాదాన్ని మిగిల్చిన సంఘటనగా అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన…

13 hours ago

Ahmedabad Plane Crash : ఒక్కరూ బతికే ఛాన్స్ లేదు – 242 చనిపోయి ఉంటారు అహ్మదాబాద్ సీపీ జ్ఞానేంద్ర సింగ్ ప్ర‌క‌ట‌న‌..?

Ahmedabad Plane Crash : గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం కూలిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ నుండి లండన్‌కు…

14 hours ago

House Loan : మీరు ఇల్లు కట్టుకోవాలని చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్..!

House Loan : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో రెపో రేటును…

14 hours ago