Farmers : కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త..!
ప్రధానాంశాలు:
Farmers : కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త..!
Farmers : భారత ప్రభుత్వం రైతుల ఆర్థిక భద్రతను దృష్టిలో ఉంచుకుని కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC) పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయడంపై దృష్టి సారించింది. ఈ దిశగా 2025 మే 28న కేంద్ర మంత్రివర్గం మాడిఫైడ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ (MISS)ను 2025-26 ఆర్థిక సంవత్సరానికి పొడిగించింది. ముఖ్యంగా రైతులకు అందుతున్న రుణ పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచడం ద్వారా వ్యవసాయ రంగానికి మరింత బలాన్నిచ్చేలా నిర్ణయం తీసుకుంది. తక్కువ వడ్డీ రేటుతో రుణాలు ఇవ్వడం, పంటల ఉత్పాదకతను పెంచడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను సమర్థవంతంగా అభివృద్ధి చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యాలు.

Farmers : కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త..!
Farmers : KCC-MISS పథకంలో కీలక మార్పులు..మరి రైతులకు ఎంత వరకు మేలు..?
1998లో ప్రారంభమైన కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం రైతులకు సకాలంలో, తక్కువ వడ్డీతో రుణాలు అందించేందుకు రూపొందించబడింది. ఈ పథకం ద్వారా రైతులు విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పరికరాలు కొనుగోలు చేయడంలో ఆర్థిక స్వావలంబన పొందుతున్నారు. 2019లో ఈ పథకంలో పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, మత్స్య సంపద రంగాల రైతులను కూడా చేర్చారు. ఈ విభాగాల రైతులు రూ.2 లక్షల వరకు పూచీకత్తులేని రుణాలను పొందే అవకాశం ఉంది. పంటలు నాటి కోతదాకా, అలాగే పంట తర్వాత నిల్వ, రవాణా వంటి ఖర్చులకు కూడా ఈ పథకం ద్వారా ఆర్థిక సాయం లభిస్తోంది.
MISS పథకం కింద ఏడాదికి 7% వడ్డీ రేటుతో రైతులకు రుణాలు లభిస్తాయి. కానీ సకాలంలో రుణం తిరిగి చెల్లించిన రైతులకు అదనంగా 3% రాయితీ అందించి వడ్డీ రేటును 4%కి తగ్గిస్తున్నారు. ఈ విధంగా రైతులకు ఆర్థిక ఒత్తిడి తక్కువవుతుంది. అలాగే, 2023లో ప్రారంభించిన కిసాన్ రిన్ పోర్టల్ (KRP) వడ్డీ రాయితీ మరియు రీపేమెంట్ ప్రోత్సాహకాల క్లెయిమ్ ప్రక్రియను పూర్తిగా డిజిటలైజ్ చేసి, బ్యాంకులు, RBI, NABARD మధ్య సమన్వయం సులభతరం చేసింది. ఇప్పటివరకు ఈ పథకం ద్వారా దాదాపు 5.9 కోట్ల మంది రైతులు లబ్ధి పొందారు. 2025 బడ్జెట్లో తీసుకున్న తాజా నిర్ణయాలు 7.7 కోట్ల మందికి మేలు చేసేలా ఉండటం విశేషం.