
Central Govt : 2025లో జనాభా లెక్కలు.. కొత్త నియోజకవర్గాల కోసం ఎన్డీయే ఇలాంటి ప్లాన్ చేసిందా ?
Central Govt : జనగణనకు కేంద్రం సిద్ధమవుతున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. నేషనల్ పాపులేషన్ రిజిస్టర్-ఎన్పీఆర్ను అప్డేట్ చేసే ప్రక్రియ వచ్చే ఏడాది ప్రారంభమవుతుందని టాక్ నడుస్తుంది. ఈ ప్రక్రియ 2026 వరకు జరగనుందని తెలుస్తోంది. 2026 ఏడాది చివర్లో పూర్తి వివరాలు ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.అయితే వచ్చే ఏడాది జరిగే జనగణనతో భవిష్యత్ సెన్సస్ సైకిల్స్ మారే అవకాశం ఉంది. అంటే ఈ జనగణన 2025-2035 కాలానికే చేపడితే, వచ్చేసారి 2035-2045 కాలానికి లెక్కిస్తారు. ఇదిలా ఉండగా, కులగణనపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయానికి రాలేదని తెలుస్తోంది.
2021లో జనాభా గణన జరగాల్సి ఉంది. కానీ కోవిడ్ (కోవిడ్ 19) కారణంగా ఆ ప్రక్రియ వాయిదా పడింది. లోక్ సభ పునర్విభజనతో మహిళా రిజర్వేషన్ కూడా అమల్లోకి రానుంది.జనాభా లెక్కల తర్వాత లోక్సభ స్థానాల విభజన ప్రక్రియ ప్రారంభమవుతుందని, 2028 నాటికి ఈ పని పూర్తయ్యే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. నివేదిక ప్రకారం, వర్గాల ఆధారంగా జనాభా గణనను నిర్వహించే ఆలోచన కూడా ఉంది. ఆ తర్వాత లోక్సభ సీట్ల డీలిమిటేషన్కు మార్గం సుగమం అవుతుంది. ఇపుడు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం జన గణన మీద పట్టుదలగా ఉంది. ఎందుకు అంటే దేశంలో ప్రస్తుతం ఉన్న 543 లోక్ సభ సీట్లను పునర్ వ్యవస్థీకరించి జనాభా ప్రాతిపదికన మరింతగా పెంచాలని కేంద్రం ఆలోచిస్తోంది.
Central Govt : 2025లో జనాభా లెక్కలు.. కొత్త నియోజకవర్గాల కోసం ఎన్డీయే ఇలాంటి ప్లాన్ చేసిందా ?
దీని వల్ల లోక్ సభ సీట్లు ఏకంగా 830 దాకా పెరగవచ్చు అని ఒక లెక్క ఉంది. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఉండగా నియోజకవర్గాల పునర్ విభజన జరిగితే కనుక కచ్చితంగా అది బీజేపీకే ఉపయోగకరంగా ఉంటుందని అంటున్నారు. తమకు బలం ఉన్న వాటిని విభజించుకుంటూ భారీగా రాజకీయ లబ్దికి తెర తీసే అవకాశం ఉంది అని విపక్షాలు అనుమానిస్తున్నాయి. జనగణన తర్వాత లోక్సభ స్థానాల పునర్విభజన ప్రక్రియ ప్రారంభమవుతుందని, అది 2028కి ముగుస్తుందని తెలుస్తోంది. అయితే దీనిపై దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జనాభా నియంత్రణలో విజయం సాధించినందున, తమ రాష్ట్రాలు లోక్సభ స్థానాలను కోల్పోయే అవకాశం ఉందని దక్షిణాది రాష్ట్రాల రాజకీయ నేతలు తమ ఆందోళన వ్యక్తం చేశారు.
Green Tea vs Matcha: ఆరోగ్యంపై శ్రద్ధ వహించే వారిలో 'గ్రీన్ టీ' Green Tea ఎప్పుడూ ముందుంటుంది. కానీ…
AUS vs SL T20 World Cup 2026 : పల్లెకెలె Pallekele వేదికగా జరిగిన ఐసీసీ పురుషుల టీ20…
Andhra Pradesh Politics : శాసనమండలి వేదికగా నారా లోకేష్ మరియు బొత్స సత్యనారాయణ మధ్య జరిగిన మాటల యుద్ధం…
JEE Main 2026 Result : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జేఈఈ మెయిన్స్ 2026 సెషన్-1 ఫలితాలను అధికారికంగా…
Jeevan Reddy : దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి Congress Party వెన్నెముకలా ఉన్న జీవన్ రెడ్డి, ప్రస్తుత పార్టీ తీరుపై…
Botsa Satyanarayana : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తరుణంలో వైఎస్ జగన్ Ys Jagan వ్యవహారశైలి ఇప్పుడు రాష్ట్ర…
Thanuja - Kalyan : బిగ్బాస్ సీజన్-9 Bigg Boss session 9 ముగిసి రెండు నెలలు దాటినా, కంటెస్టెంట్లకు…
This website uses cookies.