Categories: ExclusiveNewspolitics

Chandrababu : వైసీపీ ఆఫీసు కూల్చ‌డంపై కార‌ణం చెప్పిన చంద్ర‌బాబు స‌ర్కార్..!

Chandrababu : రాష్ట్ర రాజ‌ధాని ప్రాంతం ప‌రిధిలోని తాడేప‌ల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాల‌యాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వం కూల్చి వేయ‌డం మ‌నం చూశాం. శ‌నివారం తెల్ల‌వారు జామున ఈ కూల్చివేత‌లు ప్రారంభం కాగా, దీనిపై కోర్టుకి వెళ్తామంటూ వైసీపీ చెబుతుతోంది. హైకోర్టు ఆదేశాలు ఉన్న‌ప్ప‌టికీ కూల్చివేయ‌డం దారుణ‌మ‌ని వైసీపీ నేత‌లు విమ‌ర్శిస్తున్నారు. కోర్టు ఆదేశాల‌ను ధిక్క‌రిస్తూ క‌క్ష‌పూరితంగా టీడీపీ కూట‌మి ప్ర‌భుత్వం కూల్చివేసింద‌ని దుయ్య‌బ‌ట్టారు.శ్లాబ్ వేయ‌డానికి సిద్ధంగా ఉన్న భ‌వ‌నాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వం తెల్ల‌వారు జామున 5ః30 గంట‌ల నుంచి భారీ పోలీసులు బందోబ‌స్తు మ‌ధ్య కూల్చి వేత‌లు ప్రారంభించింది. బుల్డోజ‌ర్లు, పొక్లెయిన‌ర్లను ఉప‌యోగించి భ‌వ‌న కూల్చివేత ప‌నులు మొద‌లు పెట్టారు.

Chandrababu ఇది అస‌లు కార‌ణం..

నిర్మాణం అక్ర‌మం అంటూ ఇటీవ‌లి సీఆర్‌డీఏ అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. దీనిపై కూల్చివేత‌కు సీఆర్‌డీఏ త‌యారు చేసిన ప్రాథ‌మిక ప్రొసీడింగ్స్‌ను స‌వాల్ చేస్తూ వైసీపీ శుక్ర‌వారం హైకోర్టును ఆశ్ర‌యించింది. దీన్ని విచారించిన హైకోర్టు చ‌ట్టాన్ని మీరి వ్య‌వ‌హ‌రించొద్ద‌ని సీఆర్‌డీఏని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల‌ను కూడా వైసీపీ త‌ర‌పు న్యాయ‌వాది సీఆర్‌డీఏ క‌మిష‌న‌ర్‌కు తెలిపారు. అయిన‌ప్ప‌టికీ టీడీపీ ప్ర‌భుత్వం… వైసీపీ కార్యాల‌యాన్ని కూల్చివేసింది. తాడేపల్లి వైసీపీ ఆఫీసు కూల్చివేత అంశంపై ప్రభుత్వం స్పందించింది.

Chandrababu : వైసీపీ ఆఫీసు కూల్చ‌డంపై కార‌ణం చెప్పిన చంద్ర‌బాబు స‌ర్కార్..!

వైసీపీ అక్రమ నిర్మాణంపై వివరణ ఇవ్వాలంటూ గత నెలలోనే మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చినట్లు తెలిపింది. పలుమార్లు నోటీసులిచ్చినా వైసీపీ లెక్కచేయలేదని అధికారులు తెలిపారు. వైసీపీ జిల్లా ఆఫీసుకు గతనెల 5న మొదటిసారి నోటీసులు అందినట్లు చెబుతున్నారు ప్రభుత్వం. మంగళగిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు నోటీసులు పంపించారు. మున్సిపల్‌ అధికారుల నోటీసులను వైసీపీ పట్టించుకోకపోవడంతో ఈనెల 10న రెండోసారి నోటీసులను పంపించారు. ఈ అక్రమ నిర్మాణంపై 7 రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో స్పష్టం చేసింది వైసీపీ. అధికారులు ఇచ్చిన గడువు ఈనెల 17తో పూర్తియినా వైసీపీ నుంచి స్పందన లేకపోవడంతో 20న కూల్చివేతకు ఆదేశాలు జారీ చేశామని ప్రభుత్వం చెబుతోంది. మున్సిపల్ అధికారుల ఆదేశాలతో ఈ రోజు వైసీపీ ఆఫీసును కూల్చివేశారు.

Recent Posts

Tulasi Kashayam | తులసి కషాయం ఆరోగ్యానికి అమృతం లాంటిది .. వర్షాకాలంలో రోగనిరోధకత పెంచే పానీయం

Tulasi Kashayam | భారతదేశంలో తులసి మొక్కను పవిత్రంగా భావించడం వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలేంటో తెలుసుకోవాలంటే ఆయుర్వేదాన్ని ఓసారి…

6 minutes ago

Zodiac Signs | పండగ సమయంలో మూడు రాశులపై కేతువు అనుగ్రహం ..ఆర్థిక లాభాలు, అదృష్టం కురిసే చాన్స్

Zodiac Signs | జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి వ్యక్తి జీవితంపై గ్రహాల ప్రభావం కీలకంగా ఉంటుంది. అనుకూల గ్రహాలు శుభఫలితాలు…

1 hour ago

Vivo | వివో నుంచి కొత్త బ్లాక్‌బస్టర్ ..Vivo T4R 5G స్మార్ట్‌ఫోన్ ₹17,499కే!

Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…

10 hours ago

Jupitar Price | జీఎస్టీ రేట్లు తగ్గడంతో టీవీఎస్ బైకులు, స్కూటీల ధరలు భారీగా తగ్గింపు .. కొత్త ధరల వివరాలు ఇదే!

Jupitar Price | దేశవ్యాప్తంగా జీఎస్టీ రేట్లలో మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ప్రముఖ ద్విచక్ర…

11 hours ago

Asia Cup 2025 | ఆసియా క‌ప్‌లో భార‌త్ క‌ప్ కొట్టినా కూడా తీసుకోదా.. సూర్యకి ఏమైంది?

Asia Cup 2025 | పాకిస్తాన్‌తో జరగబోయే ఫైనల్‌లో గెలిచి ఆసియా కప్ 2025 ట్రోఫీని కైవసం చేసుకోవాలని సూర్య…

13 hours ago

Aghori | వర్షిణి – అఘోరీ వివాదం కొత్త మలుపు.. మోసం చేసింది నువ్వురా..మోసపోయింది నేనురా అంటూ సంచలన వ్యాఖ్యలు

Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…

15 hours ago

Raja Saab | ఎట్ట‌కేల‌కి రాజా సాబ్ ట్రైల‌ర్‌కి ముహూర్తం ఫిక్స్ చేశారు.. ఇక ఫ్యాన్స్‌కి పండ‌గే..!

Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…

17 hours ago

Telangana | తెలంగాణలో దంచికొడుతున్న వ‌ర్షాలు.. 11 జిల్లాలకు ఆరెంజ్ వార్నింగ్

Telangana |  తెలంగాణ రాష్ట్రంలో వ‌ర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…

19 hours ago