Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబుకు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఆయనకు మళ్లీ నిరాశే ఎదురైంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్, అంగళ్లు అల్లర్లు కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయగా.. ఏపీ హైకోర్టు ఆ పిటిషన్లను కొట్టేసింది. మూడు ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు డిస్మిస్ చేసింది. కనీసం ఒక్క కేసులో కూడా చంద్రబాబుకు బెయిల్ మంజూరు కాలేదు. ఇతర నిందితులకు ఈ కేసులో బెయిల్ వచ్చినా చంద్రబాబుకు మాత్రం కోర్టు బెయిల్ మంజూరు చేయలేదు.
మరోవైపు ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ పై తీర్పు త్వరలో వెలువడనుంది. లంచ్ తర్వాత జడ్జి.. సీఐడీ రిమాండ్ పై తీర్పు వెలువరించనున్నారు. కస్టడీ పిటిషన్, బెయిల్ పై ఏసీబీ కోర్టు తీర్పుపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇక.. స్కిల్ డెవలప్ మెంట్ కేసు విషయంలో బెయిల్ పై ఎలాంటి తీర్పు వస్తుందో అని అంతా ఎదురు చూస్తున్నారు.ఇన్నర్ రింగ్ ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో చంద్రబాబును ఏ1గా పేర్కొన్నారు. దీంతో తనకు ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు.
అలాగే.. ఫైబర్ నెట్ లోనూ అక్రమాలు చోటు చేసుకున్నాయని సీఐడీ కేసు నమోదు చేసింది. అంగళ్లు ఘటనపై కూడా చంద్రబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అప్పుడు చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.