BRS : తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ కు సమరం సిద్ధమైంది. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు తెలంగాణలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సమరానికి అంతా సిద్ధం అవుతున్నారు. ఈనేపథ్యంలో తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంది. ఎన్నికల కోసం రాజకీయాలు యూ టర్న్ తీసుకుంటున్నాయి. ఎప్పుడు ఏ నేత ఎటువైపు వెళ్తాడో కూడా తెలియడం లేదు. నిజానికి ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బలం పెరిగింది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ కోసం తెగ ప్రయత్నాలు చేస్తోంది. బీజేపీ కూడా ఈసారి అధికారం కోసం తెగ వ్యూహాలు రచిస్తోంది. ఇవన్నీ పక్కన పెడితే అధికార బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నుంచి కాంగ్రెస్ లోకి చేరికలు మాత్రం జోరుగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు చాలా మంది నేతలు బీఆర్ఎస్, బీజేపీలను వీడి కాంగ్రెస్ లో చేరారు. అధికార పార్టీ బీఆర్ఎస్ కే నేతలు షాకుల మీద షాకులు ఇస్తున్నారు.
అధికార పార్టీకి ఏం చేయాలో అర్థం కావడం లేదు. మూడు నెలల ముందే బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించడంతో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలంతా వేరే పార్టీ వైపు చూశారు. టికెట్ రాని ఆశావహులు వేరే పార్టీ వైపు చూస్తున్నారు. ఇప్పటికే కొందరు కారు తిగి హస్తం గూటికి చేరారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా కారు దిగి కాంగ్రెస్ లో చేరడంతో బీఆర్ఎస్ నేతలు అయోమయానికి గురవుతున్నారు. తాజాగా మరో బీఆర్ఎస్ నేత కూడా కారు దిగి కాంగ్రెస్ లో చేరారు. హుస్నాబాద్ నియోజకవర్గానికి చెందిన కీలక నేత వొడితల ప్రణవ్ బాబు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. ఆయన ఎవరో కాదు.. మాజీ ఎంపీ సింగాపురం రాజేశ్వరరావు మనవడు. ఆ నేత బీఆర్ఎస్ ను వీడి.. కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో బీఆర్ఎస్ కు భారీ ఎదురుదెబ్బ తాకినట్టయింది.
అయితే.. ప్రణవ్ బాబు హుజురాబాద్ కాంగ్రెస్ టికెట్ ఆశించినట్టు తెలుస్తోంది. కానీ.. హుజురాబాద్ టికెట్ ను కేసీఆర్ పాడి కౌశిక్ రెడ్డికి కేటాయించడంతో ప్రణవ్ అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. దీంతో తన తాత పని చేసిన కాంగ్రెస్ పార్టీలో తాజాగా చేరారు. ప్రణవ్ కు హుజురాబాద్ నుంచి కాంగ్రెస్ టికెట్ ఇచ్చేందుకు హైకమాండ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అందుకే ప్రణవ్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నట్టు తెలుస్తోంది.
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
This website uses cookies.