Home » Exclusive » Cm Kcr To Implement 10 Percent Reservation For Tribals
Exclusive

CM KCR : ST ఓటు బ్యాంకు మొత్తం టీఆర్ఎస్ కే పడే ప్రకటన చేసిన కేసీఆర్

Authored By
Jagadesh Gatla
The Telugu News | Updated on: September 17, 2022, 6:47 pm
Advertisement

CM KCR : సీఎం కేసీఆర్ తాజాగా సంచలన ప్రకటన చేశారు. గిరిజనులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. త్వరలోనే గిరిజనులకు పది శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని… దానికి సంబంధించిన జీవోను కూడా త్వరలోనే విడుదల చేస్తామని సీఎం తెలిపారు. కేవలం వారం రోజుల్లోనే ఆ జీవోను విడుదల చేస్తామన్నారు. ప్రస్తుతం గిరిజనులకు ఉన్న ఆరు శాతం రిజర్వేషన్ ను 10 శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన ఆదివాసీ, గిరిజనుల ఆత్మీయ సభలో సీఎం కేసీఆర్ ఈ ప్రకటన చేశారు..

Advertisement

cm kcr to implement 10 percent reservation for tribals

అయితే.. ఆ జీవోకు రాష్ట్రపతి ఆమోదం కావాలని.. రాష్ట్రపతికి ఆమోదం కోసం అక్కడికి పంపాలన్నారు. కానీ.. దేశ ప్రధాని మోదీ దాన్ని అమలు చేస్తారా? లేక దాన్నే ఉరితాడు చేసుకుంటారా అనేది ఆలోచించుకోవాలన్నారు.

Advertisement

CM KCR : త్వరలో గిరిజన బంధు పథకం కూడా

గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లే కాదు.. గిరిజన బంధు కూడా త్వరలో ప్రారంభిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. పోడు వ్యవసాయం చేసుకునే రైతులకు పోడు భూములు ఇస్తామని, ప్రస్తుతం ప్రతి గిరిజన తండాకు మిషన్ భగీరథ పథకం కింద మంచినీరు అందుతోందన్నారు. గిరిజనులను తెలంగాణ ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.

Jagadesh Gatla

Author Bio Info : Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి