CM KCR : ST ఓటు బ్యాంకు మొత్తం టీఆర్ఎస్ కే పడే ప్రకటన చేసిన కేసీఆర్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

CM KCR : ST ఓటు బ్యాంకు మొత్తం టీఆర్ఎస్ కే పడే ప్రకటన చేసిన కేసీఆర్

CM KCR : సీఎం కేసీఆర్ తాజాగా సంచలన ప్రకటన చేశారు. గిరిజనులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. త్వరలోనే గిరిజనులకు పది శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని… దానికి సంబంధించిన జీవోను కూడా త్వరలోనే విడుదల చేస్తామని సీఎం తెలిపారు. కేవలం వారం రోజుల్లోనే ఆ జీవోను విడుదల చేస్తామన్నారు. ప్రస్తుతం గిరిజనులకు ఉన్న ఆరు శాతం రిజర్వేషన్ ను 10 శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన ఆదివాసీ, […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :17 September 2022,6:38 pm

CM KCR : సీఎం కేసీఆర్ తాజాగా సంచలన ప్రకటన చేశారు. గిరిజనులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. త్వరలోనే గిరిజనులకు పది శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని… దానికి సంబంధించిన జీవోను కూడా త్వరలోనే విడుదల చేస్తామని సీఎం తెలిపారు. కేవలం వారం రోజుల్లోనే ఆ జీవోను విడుదల చేస్తామన్నారు. ప్రస్తుతం గిరిజనులకు ఉన్న ఆరు శాతం రిజర్వేషన్ ను 10 శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన ఆదివాసీ, గిరిజనుల ఆత్మీయ సభలో సీఎం కేసీఆర్ ఈ ప్రకటన చేశారు..

cm kcr to implement 10 percent reservation for tribals

cm kcr to implement 10 percent reservation for tribals

అయితే.. ఆ జీవోకు రాష్ట్రపతి ఆమోదం కావాలని.. రాష్ట్రపతికి ఆమోదం కోసం అక్కడికి పంపాలన్నారు. కానీ.. దేశ ప్రధాని మోదీ దాన్ని అమలు చేస్తారా? లేక దాన్నే ఉరితాడు చేసుకుంటారా అనేది ఆలోచించుకోవాలన్నారు.

CM KCR : త్వరలో గిరిజన బంధు పథకం కూడా

గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లే కాదు.. గిరిజన బంధు కూడా త్వరలో ప్రారంభిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. పోడు వ్యవసాయం చేసుకునే రైతులకు పోడు భూములు ఇస్తామని, ప్రస్తుతం ప్రతి గిరిజన తండాకు మిషన్ భగీరథ పథకం కింద మంచినీరు అందుతోందన్నారు. గిరిజనులను తెలంగాణ ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది