
cm kcr to lost in gajwel as mla
CM KCR : తెలంగాణలో 119 నియోజకవర్గాలు ఉన్నాయి. కానీ.. మనం ఎక్కువగా మాట్లాడుకునే నియోజకవర్గాలు మాత్రం మూడే. అందులో ఒకటి గజ్వేల్. రెండోది సిద్దిపేట కాగా.. మూడోది సిరిసిల్ల. ఈ మూడు నియోజకవర్గాలను డెవలప్ చేసి ఇదిగో చూడండి తెలంగాణ ఎంతగా అభివృద్ధి చెందిందో అని చెప్పుకుంటారు మన పాలకులు. గజ్వేల్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించేది సాక్షాత్తూ సీఎం కేసీఆర్ కావడంతో గజ్వేల్ ను అభివృద్ధిలో ముందంజలో ఉంచాల్సిన బాధ్యత ఆయనదే. ఆ తర్వాత మంత్రి కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలోనూ అభివృద్ధి జరిగింది. మంత్రి హరీశ్ రావు ప్రాతినిథ్యం వహిస్తున్న సిద్ధిపేట నియోజకవర్గంలోనూ అభివృద్ధి బాగానే జరిగింది. అయితే.. ఈ మూడు నియోజకవర్గాలు అభివృద్ధి జరిగితే చాలా.. మిగితా నియోజకవర్గాల పరిస్థితి ఏంటి.. ఆ మూడు నియోజకవర్గాలు అభివృద్ధి చెందితే రాష్ట్రమంతా అభివృద్ధి జరిగినట్టేనా అని ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో అప్పుడు ఇతర నియోజకవర్గాలపై కూడా దృష్టి సారించారు పాలకులు.
అయినా కూడా జరగాల్సిన తప్పు జరిగిపోయింది. కేవలం ఆ మూడు నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకొని రాష్ట్రమంతా అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వాన్ని ఓడిస్తామని ఓవైపు ప్రజలు ముక్తకంఠంతో చెబుతున్నారు. ఇదంతా పక్కన పెడితే.. ఇంత అభివృద్ధి చేసిన గజ్వేల్ లోనూ కేసీఆర్ పై వ్యతిరేకత వస్తోంది. దానికి కారణం ఏంటి అని లోతుగా అధ్యయనం చేస్తే.. అసలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిజానికి ఈసారి కేసీఆర్ గజ్వేల్ తో పాటు కామారెడ్డిలోనూ పోటీ చేస్తున్నారు. కామారెడ్డిలో ఎందుకు పోటీ చేస్తున్నారు. గజ్వేల్ లో ఎలాగూ భారీ మెజారిటీతో గెలుస్తారు కదా అనే అనుమానం అందరికీ వచ్చింది. కానీ.. ఈసారి గజ్వేల్ లో కేసీఆర్ ఓడిపోయే చాన్స్ ఉందని తెలిసే కామారెడ్డిలో కూడా పోటీ చేస్తున్నారు అని అంటున్నారు.
గజ్వేల్ లో కేసీఆర్ ఓడిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది అనే దానిపై ఒకసారి విశ్లేషిద్దాం. గజ్వేల్ నియోజకవర్గ ప్రజల కోసం 50 టీఎంసీలతో మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ ను నింపే ప్రయత్నం చేశారు. దాని కోసమే 15 టీఎంసీల సామర్థ్యంతో ప్రభుత్వం ములుగులో కొండ పోచమ్మ సాగర్ నిర్మాణాన్ని చేపట్టింది. అయితే.. కొండ పోచమ్మ సాగర్ ప్రాజెక్ట్ కోసం చాలామంది దగ్గర భూములు తీసుకున్నారు. దీంతో చాలామంది ప్రజలు, రైతులు రోడ్డున పడ్డారు. భూనిర్వాసితులకు కనీసం నష్టపరిహారం కూడా సరిగ్గా ఇవ్వలేదు. వాళ్లకు అప్పుడు మార్కెట్ లో ఉన్న ధర కంటే కూడా తక్కువ ధర ఇచ్చి అధికారులు చేతులు దులుపుకున్నారు. అక్కడే ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. అందుకే.. కేసీఆర్ కాదు కదా.. బీఆర్ఎస్ పార్టీ తరుపున ఎవరు పోటీ చేసినా దారుణంగా ఓడిస్తామని ప్రజలు బీష్మించుకు కూర్చున్నారు. అసలు తమ గ్రామాల్లోకి కూడా నేతలను రానివ్వడం లేదు. ప్రచారం చేయనీయడం లేదు. అవసరానికి మించి ప్రజల దగ్గర్నుంచి భూములు సేకరించి ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టారని.. తమకు నష్టపరిహారం కూడా సరిగ్గా ఇవ్వలేదని కేసీఆర్ పై మండిపడుతున్నారు. అందుకే ఈసారి గజ్వేల్ లో కేసీఆర్ కు ఎదురుదెబ్బ తగిలే చాన్స్ ఉంది. అందుకే మరో ఆప్షన్ గా కేసీఆర్.. కామారెడ్డిలో పోటీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
OnePlus 11 5G : ప్రీమియం స్మార్ట్ఫోన్ కొనాలని ఆలోచిస్తున్న వారికి ఇది నిజంగా శుభవార్తే. ఫ్లాగ్షిప్ ఫీచర్లతో మార్కెట్లో…
Ration Card : దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ ప్రాధాన్యత సంతరించుకుంటున్న వేళ, రేషన్…
Peddi Box Office Collection Day 3 : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ‘పెద్ది’ చిత్రం…
Today Gold Rate : బంగారం కొనుగోలు చేయాలని ఎదురుచూస్తున్న వారికి ఈరోజు మంచి వార్త వచ్చింది. గత కొన్ని…
Eat Eggs in Summer : వేసవి కాలం మొదలవగానే మన ఆహారపు అలవాట్లలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా…
Tea : భారతీయుల రోజువారీ జీవితంలో టీకి ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం నిద్రలేవగానే ఒక కప్పు వేడి వేడి…
Today Horoscope 7th June 2026 : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రోజు గ్రహాల సంచారం మన జీవితంపై…
Yamadonga : తెలుగు సినీ పరిశ్రమలో దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ‘యమదొంగ’ ఒకటి. యంగ్…
Police Jobs : తెలంగాణలో పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త…
Anasuya Jabardasth : తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు స్టార్ యాంకర్గా, వెండితెరపై ప్రతిభావంతమైన నటిగా గుర్తింపు పొందిన అనసూయ భరద్వాజ్…
Team India or Gujarat Titans : భారత క్రికెట్ జట్టు ఆఫ్ఘనిస్తాన్తో ఆడుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైన…
School Holidays : తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు సంతోషకరమైన వార్త అందింది. ఇప్పటికే వేసవి సెలవులను ఆస్వాదిస్తున్న విద్యార్థులకు ప్రభుత్వం…
This website uses cookies.