YS Sharmila VS Sajjala : ఏపీలో వైసీపీ పార్టీ అధికారంలో ఉంది. ఏపీకి సీఎంగా జగన్ ఉన్నారు. ఆయన చెల్లెలు వైఎస్ షర్మిల తెలంగాణ రాజకీయాల్లో ఉన్నారు. వైఎస్సార్టీపీ పార్టీని స్థాపించారు. త్వరలో తెలంగాణలో ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో వైఎస్ షర్మిల తన పార్టీ తరుపున ఎన్నికల్లో పోటీ చేస్తారని అంతా భావించారు. కానీ.. తను మాత్రం ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. అంతే కాదు.. పోటీ నుంచి తప్పుకోవడం మాత్రమే కాదు.. ఈసారి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తామని చెప్పుకొచ్చారు వైఎస్ షర్మిల. దీంతో వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సొంత అన్నను హింసించి జైలులో పెట్టించిన కాంగ్రెస్ పార్టీకి ఎలా మద్దతు ఇస్తావు అంటూ షర్మిలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు వైసీపీ నేతలు. ఆ పార్టీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కూడా షర్మిలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబుతో కలిసి కాంగ్రెస్ పార్టీ ఆయన మీద అక్రమ కేసులు పెట్టింది. అయినా కూడా ఆమె ఒక పొలిటికల్ పార్టీ పెట్టారు. ఆమె విధానాలకు మాకు సంబంధం లేదు. మాకు సంబంధించినంత వరకు ఈ స్టేట్ ముఖ్యం. పక్క స్టేట్ గురించి మేము పెద్దగా పట్టించుకోవడం లేదు. జగన్ అయితే అస్సలు మాట్లాడటం లేదు అంటూ సజ్జల చెప్పుకొచ్చారు.
ఆయన మాటలపై షర్మిల కూడా స్పందించారు. కేసీఆర్ గారు ఏపీ గురించి ఏమన్నారో మరిచిపోయారా? బహిరంగంగానే సింగిల్ రోడ్ అయితే ఆంధ్రా, డబుల్ రోడ్ అయితే తెలంగాణ, చీకటి అయితే ఆంధ్రా, వెలుగు అయితే తెలంగాణ అని చెబుతున్నారు. మరి దానికి ఏం సమాధానం చెబుతారు సజ్జల గారు. ముందు మీ పని మీరు చూసుకోండి సార్ అంటూ షర్మిల హితవు పలికారు. సజ్జల మాట్లాడితే జగన్ మాట్లాడినట్టే కదా అంటే ఎవరికైనా ఇదే సమాధానం అంటూ షర్మిల చెప్పుకొచ్చారు. మీరు పోటీ చేయకుండా ఒక పార్టీకి ఎందుకు మద్దతు ఇస్తున్నారు అని మీడియా ప్రశ్నించగా.. ఇది డెమోక్రసీ అంటూ చెప్పుకొచ్చారు షర్మిల. నా పార్టీ వాళ్లు నన్ను దగ్గరగా చూసిన వాళ్లు అంటూ చెప్పుకొచ్చారు. వాళ్లు ఈ ఆరోపణలు చేయడం లేదు. మీరు చేస్తున్నారో.. మీ వెనుక ఎవరు చేస్తున్నారో అంటూ షర్మిల స్పష్టం చేశారు.
రాజకీయాల్లో ఉన్న వాళ్లంతా రాజకీయాలే చేయాలా? ఇంకేం చేయకూడదా? ప్రజల కోసం ఇంకా వేరే ఏం చేయకూడదా? రాజకీయ పార్టీ అంటే మన పార్టీనే సుప్రీం అవ్వాలా? ఇది ఏ పార్టీకి అయినా ఎందుకు గుర్తుకు లేదు. ఎంఐఎం పార్టీకి ఎందుకు గుర్తు లేదు. కాళేశ్వరం దగ్గర్నుంచి ప్రతి దాంట్లో అవినీతి చేశారు కేసీఆర్. మరి.. ఏ బేసిస్ మీద ఎంఐఎం మద్దతు పలుకుతోంది. రాజకీయాలు అంటే ప్రజలను పణంగా పెట్టడం కాదు. రాజకీయాలు అంటే ప్రజల కోసం త్యాగం చేయాలి. అప్పుడే ప్రజలు బాగుపడతారు. లేదంటే పార్టీలు మాత్రమే బాగుపడతాయి అంటూ షర్మిల చెప్పుకొచ్చారు.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.