
combat of words between sajjala and ys sharmila
YS Sharmila VS Sajjala : ఏపీలో వైసీపీ పార్టీ అధికారంలో ఉంది. ఏపీకి సీఎంగా జగన్ ఉన్నారు. ఆయన చెల్లెలు వైఎస్ షర్మిల తెలంగాణ రాజకీయాల్లో ఉన్నారు. వైఎస్సార్టీపీ పార్టీని స్థాపించారు. త్వరలో తెలంగాణలో ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో వైఎస్ షర్మిల తన పార్టీ తరుపున ఎన్నికల్లో పోటీ చేస్తారని అంతా భావించారు. కానీ.. తను మాత్రం ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. అంతే కాదు.. పోటీ నుంచి తప్పుకోవడం మాత్రమే కాదు.. ఈసారి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తామని చెప్పుకొచ్చారు వైఎస్ షర్మిల. దీంతో వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సొంత అన్నను హింసించి జైలులో పెట్టించిన కాంగ్రెస్ పార్టీకి ఎలా మద్దతు ఇస్తావు అంటూ షర్మిలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు వైసీపీ నేతలు. ఆ పార్టీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కూడా షర్మిలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబుతో కలిసి కాంగ్రెస్ పార్టీ ఆయన మీద అక్రమ కేసులు పెట్టింది. అయినా కూడా ఆమె ఒక పొలిటికల్ పార్టీ పెట్టారు. ఆమె విధానాలకు మాకు సంబంధం లేదు. మాకు సంబంధించినంత వరకు ఈ స్టేట్ ముఖ్యం. పక్క స్టేట్ గురించి మేము పెద్దగా పట్టించుకోవడం లేదు. జగన్ అయితే అస్సలు మాట్లాడటం లేదు అంటూ సజ్జల చెప్పుకొచ్చారు.
ఆయన మాటలపై షర్మిల కూడా స్పందించారు. కేసీఆర్ గారు ఏపీ గురించి ఏమన్నారో మరిచిపోయారా? బహిరంగంగానే సింగిల్ రోడ్ అయితే ఆంధ్రా, డబుల్ రోడ్ అయితే తెలంగాణ, చీకటి అయితే ఆంధ్రా, వెలుగు అయితే తెలంగాణ అని చెబుతున్నారు. మరి దానికి ఏం సమాధానం చెబుతారు సజ్జల గారు. ముందు మీ పని మీరు చూసుకోండి సార్ అంటూ షర్మిల హితవు పలికారు. సజ్జల మాట్లాడితే జగన్ మాట్లాడినట్టే కదా అంటే ఎవరికైనా ఇదే సమాధానం అంటూ షర్మిల చెప్పుకొచ్చారు. మీరు పోటీ చేయకుండా ఒక పార్టీకి ఎందుకు మద్దతు ఇస్తున్నారు అని మీడియా ప్రశ్నించగా.. ఇది డెమోక్రసీ అంటూ చెప్పుకొచ్చారు షర్మిల. నా పార్టీ వాళ్లు నన్ను దగ్గరగా చూసిన వాళ్లు అంటూ చెప్పుకొచ్చారు. వాళ్లు ఈ ఆరోపణలు చేయడం లేదు. మీరు చేస్తున్నారో.. మీ వెనుక ఎవరు చేస్తున్నారో అంటూ షర్మిల స్పష్టం చేశారు.
రాజకీయాల్లో ఉన్న వాళ్లంతా రాజకీయాలే చేయాలా? ఇంకేం చేయకూడదా? ప్రజల కోసం ఇంకా వేరే ఏం చేయకూడదా? రాజకీయ పార్టీ అంటే మన పార్టీనే సుప్రీం అవ్వాలా? ఇది ఏ పార్టీకి అయినా ఎందుకు గుర్తుకు లేదు. ఎంఐఎం పార్టీకి ఎందుకు గుర్తు లేదు. కాళేశ్వరం దగ్గర్నుంచి ప్రతి దాంట్లో అవినీతి చేశారు కేసీఆర్. మరి.. ఏ బేసిస్ మీద ఎంఐఎం మద్దతు పలుకుతోంది. రాజకీయాలు అంటే ప్రజలను పణంగా పెట్టడం కాదు. రాజకీయాలు అంటే ప్రజల కోసం త్యాగం చేయాలి. అప్పుడే ప్రజలు బాగుపడతారు. లేదంటే పార్టీలు మాత్రమే బాగుపడతాయి అంటూ షర్మిల చెప్పుకొచ్చారు.
Tea : ఉదయాన్నే నిద్రలేవగానే వేడివేడి టీ కప్పుతో రోజును ప్రారంభించడం చాలామందికి ఒక అలవాటు మాత్రమే కాదు, ఒక…
Bangladesh : భారత్ మరియు బాంగ్లాదేశ్ దేశాల మధ్య ఉన్న సరిహద్దు సమస్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీస్తున్నాయి.…
Vijayawada : గత నెల మార్చి 2026లో విజయవాడ పోలీసులు ఒక సాధారణ బైక్ డెలివరీ బాయ్ ని అరెస్ట్…
Aridhaman : విశాఖపట్టణం తీరంలో భారత నౌకాదళం ఒక అద్భుతమైన మైలురాయిని చేరుకుంది. అత్యంత రహస్యంగా జరిగిన ఒక కార్యక్రమంలో…
Realme : ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ Realme మరోసారి తన ‘C’ సిరీస్ను విస్తరించింది. తాజాగా ‘రియల్మీ C100…
Nalgonda : నల్లగొండ నియోజకవర్గంలో రైతుల సంక్షేమానికి మరొక ముందడుగు పడింది. నల్లగొండ మండలంలోని జి. చెన్నారం గ్రామంలో డీసీఎంఎస్…
Revanth Reddy : తెలంగాణ Telangana ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుకు సంబంధించి…
Busireddy Foundation : నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని నిడమనూరు మండలం బొక్కమంతులపహాడ్ గ్రామానికి చెందిన మేకల లింగమ్మ ప్రస్తుతం…
Kodali Nani : ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా, జగన్మోహన్…
Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు ఆయన పుట్టినరోజు (ఏప్రిల్ 8) సందర్భంగా చిత్ర బృందం…
Health Insurance : భారత ప్రభుత్వం ఇన్సూరెన్స్ రంగంలో పెద్ద మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్…
Rythu Bharosa : తెలంగాణలో రైతులకు ఆర్థికంగా తోడ్పడే లక్ష్యంతో అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కింద రెండో…
This website uses cookies.