Chandrababu Pawan Kalyan : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ బుధవారం వేర్వేరుగా ఢిల్లీ బయలుదేరారు. ఎన్నికల్లో భారీ విజయం తర్వాత తొలిసారి వారు ఢిల్లీకి వెళ్లడం చర్చనీయాంశమైంది. మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీ చేరుకొని ఎన్టీయే సమావేశంలో పాల్గొనున్నారు. ఈ సమావేశానికి ప్రధాని మోదీ సహా ఇతర కీలక నాయకులు హాజరుకానున్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వ ఏర్పాటుకు టీడీపీ, జనసేన మద్దతు కీలకం కానున్న నేపథ్యంలో సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీ నూతన ప్రభుత్వ ఏర్పాటుకు చంద్రబాబు మద్దతు తెలపనున్నట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం సాయంత్రం 6 గంటలకు వారు తిరిగి విజయవాడ రానున్నారు.
ఈసారి బీజేపీ సొంతంగా మెజార్టీ సాధించకపోవడంతో కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు మిత్రపక్షాల అవసరం తప్పనిసరిగా మారింది. దీంతో ఆంధ్రప్రదేశ్, బిహార్ల నుంచి చంద్రబాబు, నితీశ్ కుమార్ల మద్దతు మోదీకి తప్పనిసరి. ఈ సమావేశంలో బిహార్ నుంచి నితీశ్ కుమార్ సైతం పాల్గొననున్నారు. ఏపీలోని కూటమికి చెందిన 21 లోక్ సభ సీట్లు బీజేపీకి కీలకంగా మారనున్నాయి. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీకి 31 సీట్లు అవసరం. దీంతో మిత్రపక్షాలతో సమావేశం నిర్వహిస్తున్నారు. కాగా, ఇండియా కూటమి సైతం ఇవాళ ఢిల్లీలో సమావేశం నిర్వహిస్తోంది. ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మరో 39 స్థానాలు అనివార్యం. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి నేతలు తీసుకునే నిర్ణయాలపైనా ఆసక్తి నెలకొంది.
ఎన్డీఏకు కన్వీనర్ గా చంద్రబాబును నియమించాలని కూడా బీజేపీ పెద్దలు భావించినట్లు తెలిసింది. ఈ మేరకు ఎన్డీఏ కన్వీనర్ గా బాధ్యతలు చేపట్టాలని ప్రధాని మోదీ.. చంద్రబాబును ఫోన్ ద్వారా కోరగా.. తాను ఆలోచించి చెబుతానని 48 గంటలు సమయం ఇవ్వాలని చంద్రబాబు కోరినట్లు వార్తలు వస్తున్నాయి.ఎన్డీఏ కన్వీనర్ గా చంద్రబాబు ఉండడం ద్వారా కూటమిలోకి ఇతర పార్టీలను చేర్చుకోవడంలో బాబు అనుభవం పనికివస్తుందని అంటున్నారు. చంద్రబాబు లాంటి అనుభవం ఉన్నవారు ఉంటే ఎన్డీఏ కూటమికి మేలు చేకూరుతుందని భావిస్తున్నారు. పైగా అటు ఇండియా కూటమి కూడా 230కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉండడం.. ఇతరులు మరో 18 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండడంతో ఎన్డీఏ కూటమి ఆచితూచి వ్యవహరిస్తోంది.
Ginger Juice : అల్లం లో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అనే సంగతి మన అందరికీ తెలిసిన…
Current Affairs : వివిధ ప్రవేశ పరీక్షలతో పాటు సివిల్ సర్వీస్ పరీక్షలలో విజయం సాధించాలని ఆశించే యువత ప్రపంచంలోని…
New Ration Card : తెలంగాణ ప్రభుత్వం తన పౌరుల సంక్షేమాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో రేషన్ కార్డుల పంపిణీ వ్యవస్థలో…
Boom Boom Beer : ఏపీలో మద్యం ప్రియులు గత కొన్నాళ్లుగా సరికొత్త విధానాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. కొత్త…
Ap Womens : ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అమలులోకి వచ్చాక సూపర్ సిక్స్ పథకం అమలు దిశగా వడివడిగా అడుగులు…
New Liquor Policy : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సమూలమైన మార్పులు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తుంది. కొత్తగా మద్యం…
Chandrababu : గత కొన్ని రోజులుగా ఏపీలో మెడికల్ సీట్ల వ్యవహారం పెద్ద హాట్ టాపిక్ అవుతుంది. తన హయాంలో…
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రోజు రోజుకి రసవత్తరంగా మారుతుంది. కంటెస్టెంట్స్…
This website uses cookies.