Categories: ExclusiveNewspolitics

Chandrababu Pawan Kalyan : హస్తినకు బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌… ప్ర‌త్యేక హోదాకు ఇదే మంచి చాన్స్‌..!

Advertisement
Advertisement

Chandrababu Pawan Kalyan : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ బుధవారం వేర్వేరుగా ఢిల్లీ బయలుదేరారు. ఎన్నికల్లో భారీ విజయం తర్వాత తొలిసారి వారు ఢిల్లీకి వెళ్లడం చర్చనీయాంశమైంది. మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీ చేరుకొని ఎన్టీయే సమావేశంలో పాల్గొనున్నారు. ఈ సమావేశానికి ప్రధాని మోదీ సహా ఇతర కీలక నాయకులు హాజరుకానున్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వ ఏర్పాటుకు టీడీపీ, జనసేన మద్దతు కీలకం కానున్న నేపథ్యంలో సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీ నూతన ప్రభుత్వ ఏర్పాటుకు చంద్రబాబు మద్దతు తెలపనున్నట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం సాయంత్రం 6 గంటలకు వారు తిరిగి విజయవాడ రానున్నారు.

Advertisement

ఈసారి బీజేపీ సొంతంగా మెజార్టీ సాధించకపోవడంతో కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు మిత్రపక్షాల అవసరం తప్పనిసరిగా మారింది. దీంతో ఆంధ్రప్రదేశ్, బిహార్‌ల నుంచి చంద్రబాబు, నితీశ్ కుమార్‌ల మద్దతు మోదీకి తప్పనిసరి. ఈ సమావేశంలో బిహార్ నుంచి నితీశ్ కుమార్ సైతం పాల్గొననున్నారు. ఏపీలోని కూటమికి చెందిన 21 లోక్ సభ సీట్లు బీజేపీకి కీలకంగా మారనున్నాయి. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీకి 31 సీట్లు అవసరం. దీంతో మిత్రపక్షాలతో సమావేశం నిర్వహిస్తున్నారు. కాగా, ఇండియా కూటమి సైతం ఇవాళ ఢిల్లీలో సమావేశం నిర్వహిస్తోంది. ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మరో 39 స్థానాలు అనివార్యం. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి నేతలు తీసుకునే నిర్ణయాలపైనా ఆసక్తి నెలకొంది.

Advertisement

Chandrababu Pawan Kalyan : హస్తినకు బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌… ప్ర‌త్యేక హోదాకు ఇదే మంచి చాన్స్‌..!

Chandrababu Pawan Kalyan ఎన్డీఏ కన్వీనర్ గా చంద్రబాబు ?

ఎన్డీఏకు కన్వీనర్ గా చంద్రబాబును నియమించాలని కూడా బీజేపీ పెద్దలు భావించినట్లు తెలిసింది. ఈ మేరకు ఎన్డీఏ కన్వీనర్ గా బాధ్యతలు చేపట్టాలని ప్రధాని మోదీ.. చంద్రబాబును ఫోన్ ద్వారా కోరగా.. తాను ఆలోచించి చెబుతానని 48 గంటలు సమయం ఇవ్వాలని చంద్రబాబు కోరినట్లు వార్తలు వస్తున్నాయి.ఎన్డీఏ కన్వీనర్ గా చంద్రబాబు ఉండడం ద్వారా కూటమిలోకి ఇతర పార్టీలను చేర్చుకోవడంలో బాబు అనుభవం పనికివస్తుందని అంటున్నారు. చంద్రబాబు లాంటి అనుభవం ఉన్నవారు ఉంటే ఎన్డీఏ కూటమికి మేలు చేకూరుతుందని భావిస్తున్నారు. పైగా అటు ఇండియా కూటమి కూడా 230కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉండడం.. ఇతరులు మరో 18 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండడంతో ఎన్డీఏ కూటమి ఆచితూచి వ్యవహరిస్తోంది.

Advertisement

Recent Posts

Miracle medicine : ఈ ఒక్క కషాయంతో జలుబు, ఇన్ఫెక్షన్లకు చెక్..ఎలా వాడాలో తెలుసా?

Miracle medicine : శీతాకాలం వచ్చిందంటేనే జలుబు, దగ్గు, ఫ్లూ, గొంతు నొప్పి వంటి సమస్యలు గుర్తుకు వస్తాయి. కానీ…

17 minutes ago

Zodiac Signs : 29 జనవరి 2026 గురువారం నేటి రాశిఫలాలు.. ఈ రాశి వారు జేబులో రాగి నాణెం ఉంచుకోండి

Zodiac Signs : వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ రోజు.. 29 జనవరి 2026, గురువారం ఏ రాశి…

1 hour ago

Ys Jagan : కూటమి పాలన లో ఆడవారికి రక్షణ కరువు : వైఎస్ జగన్..!

Ys Jagan  : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన 'ఆటవిక రాజ్యం'లా మారిందని, ప్రజా ప్రతినిధులు బరితెగించి వ్యవహరిస్తున్నారని…

2 hours ago

Arava Sridhar : అరవ శ్రీధర్‌ కారులోనే బలవంతం చేసాడు.. అతడి వల్ల ఐదుసార్లు అబార్షన్ అయ్యింది.. బాధిత మహిళ సంచలన వ్యాఖ్యలు..!

Arava Sridhar : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో రైల్వే కోడూరు జనసేన Janasena MLA ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై…

10 hours ago

Credit Card : ఫస్ట్ టైమ్ క్రెడిట్ కార్డు తీసుకుంటున్నారా? ఈ విషయాలు తెలియకపోతే నష్టపోవడం ఖాయం

Credit Card : నేటి డిజిటల్ యుగంలో క్రెడిట్ కార్డు అనేది ఒక ఆర్థిక అవసరంగా మారింది. సరైన పద్ధతిలో…

10 hours ago

RBI : రుణగ్రహీతలకు భారీ గుడ్‌న్యూస్‌… వారు లోన్ క‌ట్టన‌వ‌స‌ర‌లేదు.. RBI కొత్త మార్గదర్శకాలు ఇవే..!

RBI : ప్రకృతి విపత్తులు ఒక్కసారిగా జీవితాన్నే తలకిందులు చేస్తాయి. వరదలు, తుపాన్లు, భూకంపాలు, కొండచరియలు విరిగిపడటం వంటి సంఘటనలతో…

11 hours ago

Telangana Ration : రేషన్ లబ్ధిదారులకు బ్యాడ్‌న్యూస్‌.. ఇక‌పై వారికి రేష‌న్‌ బియ్యం క‌ట్‌..!

Telangana Ration : అక్రమ రేషన్ బియ్యం రవాణాను అడ్డుకోవడం ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి నిజమైన పేదలకు మాత్రమే…

12 hours ago

WhatsApp : యూజర్లకు బిగ్‌ షాకింగ్ న్యూస్‌.. ఇక పై డ‌బ్బులు చెల్లిస్తేనే వాట్సాప్

WhatsApp :  ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌లో తప్పనిసరిగా ఉండే యాప్ వాట్సాప్. ఉదయం లేచిన…

13 hours ago