Rythu Bandhu : బిగ్ బ్రేకింగ్‌.. రైతుబంధుపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు ..!

Rythu Bandhu : రైతు బంధు నిధులను రైతుల ఖాతాలో విడతల వారీగా జమ చేస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు మట్టి విక్రమార్క Deputy CM Bhatti Vikramarka తెలిపారు. మంగళవారం అసెంబ్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన రైతులకు ఆర్థిక సహాయం అందించడం కోసం రోజువారీగా రైతుబంధు నిధులు విడుదల చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఒక ఎకరం భూమి ఉన్న పేద రైతులు 27 లక్షల మందికి రైతుబంధు నిధులు విడుదల అని అన్నారు. ఇప్పుడు రెండు ఎకరాల భూమి ఉన్న రైతులకు రైతుబంధు నిధులు విడుదల చేస్తున్నామన్నారు. ఈ మేరకు నిధులు ఆయా రైతుల ఖాతాలో జమ అవుతాయని బట్టి విక్రమార్క అన్నారు. రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులు ఒకేసారి జమ చేయడానికి నిధుల కొరత అడ్డుగా మారింది. ఖజానాలో డబ్బులు లేకపోవడంతో రైతుబంధు ఒకేసారి ఇవ్వలేకపోతున్నాం అని అన్నారు. వాస్తవంగా ఎన్నికల ముందు రైతుబంధు డబ్బులు రైతుల ఖాతాలో జమవుతాయని బీఆర్ఎస్ సర్కార్ పెద్దలు ప్రకటించారు.

అయితే ఆనాటి ఎన్నికల కమిషన్ కోడ్ కారణంగా రైతుల ఖాతాలో జమ చేయవద్దని ఎన్నికల షెడ్యూల్ ముగిసిన తర్వాత రైతుల ఖాతాలో జమ చేసుకోవాలని ఎన్నికల కమిషన్ తెలిపింది. అయితే రైతుబంధు కోసం ఖజానాలో జమ అయిన డబ్బులు అలాగే ఉంటాయని భావించిన రేవంత్ రెడ్డి ఆనాడు పిసీసీ అధ్యక్షుడు హోదాలో తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న రైతుల ఖాతాలో జమ చేస్తామని ప్రకటించారు. కానీ డిసెంబర్ 7వ తేదీన సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి అదే రోజు ఖజానా ఖాళీగా కనిపించింది. ఆర్థిక శాఖ అధికారులు తాపీగా వచ్చి నయా పైసా కూడా లేదు సార్ అని రేవంత్ కు సమాధానం ఇచ్చారు. దీంతో ఏం చేయాలో పాలు పోనీ పరిస్థితి రేవంత్ రెడ్డికి ఏర్పడింది. రైతు బంధు కోసం జమ చేసిన డబ్బులని పాత ప్రభుత్వం ఖర్చు చేస్తుందని

తాము అధికార పగ్గాలు చేపట్టే వరకు ఎలాంటి ఖర్చులు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ ను కోరింది. కాంగ్రెస్ పార్టీ భయపడినట్లుగానే ఖజానా ఖాళీగా దర్శనం ఇచ్చింది. దీంతో శ్వేత పత్రం విడుదల చేయాలని నిర్ణయించింది. శ్వేత పత్రం విడుదల చేసింది. రైతుబంధు కోసం జమ చేసిన సొమ్మును అనుకూల కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేశారని కాంగ్రెస్ ఆరోపించింది. ఒకవైపు ఖాళి ఖజానా మరోవైపు అప్పులు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. దీంతో వచ్చిన ఆదాయంతోనే ప్రస్తుతానికి రాష్ట్రాన్ని ముందుకు నడుపుతున్నారు. మరోవైపు కేంద్రం వద్ద కొత్త అప్పుల కోసం రేవంత్ సర్కార్ ఆర్జీ పెట్టింది. కేంద్రం కనికరిస్తే రైతుబంధు నిధులతో సహా ఇతర పథకాలకు కూడా నిధుల కొరత తీరుతుంది. ఈలోపు వచ్చే ఆదాయంలో రైతుబంధుకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి రైతు ఖాతాలో నిధులు జమ చేయాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది. ముందుగా ఎకరం రైతులకు రైతుబంధు ఇవ్వగా ఇప్పుడు రెండు ఎకరాలు రైతులకు రైతుబంధు ఇచ్చారు ఇలా విడతల వారీగా రైతుబంధు నిధులను రైతుల ఖాతాలో జమ చేస్తున్నారు.

Recent Posts

Actress : ఆ హీరో నా కెరీర్‌ని నాశ‌నం చేశాడు.. స్టార్ హీరోయిన్ సంచ‌ల‌న కామెంట్స్

Actress : తాజాగా ఓ స్టార్ హీరోయిన్ సంచ‌ల‌న కామెంట్స్ చేసి వార్త‌ల‌లో నిలిచింది. అందం, అభిన‌యంతో ఆక‌ట్టుకున్న‌ మనీషా…

28 minutes ago

Nagababu : నిహారిక కు పెళ్లి చేసి తప్పు చేసాం.. నాగబాబు

Nagababu : మెగా ఫ్యామిలీ సభ్యుడు, నటుడు, ఎమ్మెల్సీ నాగబాబు తాజాగా తన కుటుంబ విషయాలపై స్పందించారు. ముఖ్యంగా తన…

1 hour ago

Bike : బైక్ లు, స్కూటీలు కొనేవారికి భారీ గుడ్‌న్యూస్‌..!

Bike : ఇటీవ‌ల రోడ్డు ప్ర‌మాదాలు ఎక్కువ‌గా జ‌రుగుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ఈ క్ర‌మంలో కేంద్ర ప్రభుత్వం కీలక…

2 hours ago

Pawan Kalyn : వామ్మో.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ధ‌రించిన ఈ చెప్పుల ధ‌ర అంత‌నా.. !

Pawan Kalyn : టాలీవుడ్ కా పవర్ స్టార్ అలానే ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాల‌తో…

3 hours ago

Vijay Devarakonda : విజ‌య్ దేవ‌ర‌కొండ‌పై కేసు న‌మోదు.. ఆ వివాదం ఏంటి?

Vijay Devarakonda : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ. మనసులో ఏం దాచుకోకుండా, ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతారు. వేదికలపై ప్రసంగించేటప్పుడు…

4 hours ago

Wife : ఛీ .. ఇలాంటి ఆడవారు కూడా ఉంటారా..? పారాణి ఆరక ముందే భర్త..!

Wife : కర్నూలు జిల్లా పిన్నాపురంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. తెలంగాణకు చెందిన ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ అనే యువకుడిని,…

5 hours ago

Rappa Politics : అక్కడ వైసీపీ.. ఇక్కడ బిఆర్ఎస్.. రప్పా రాజకీయం..!

Rappa Politics : ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ సంచలనం రేపిన ‘రప్ప రప్ప’ నినాదం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లోనూ ఊపేసింది. ఏపీలో…

6 hours ago

Laya : సెకండ్ ఇన్నింగ్స్‌లో చిరంజీవితో న‌టించాల‌ని ఉంది.. ల‌య కామెంట్స్.. వీడియో!

Laya  : అందం.. అభినయంతో ఒకప్పుడు తెలుగు చిత్రపరిశ్రమలో అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగింది హీరోయిన్ లయ. స్వయంవరం సినిమాతో…

8 hours ago