Chandra Babu Naidu : వైయస్సార్ చావు వెనుక వై.యస్.షర్మిల.. చంద్రబాబునాయుడు షాకింగ్ కామెంట్స్ ..!

Chandra Babu Naidu : తాజాగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రా కదలిరా అంటూ బహిరంగ సభను నంద్యాలలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ ఇంట్లో గొడవలకు మాకు ఏంటి సంబంధం అని, జగన్ వదిలిన బాణం తిరిగి ఆయనకే రివర్స్ అయిందని, అప్పుడు రాష్ట్రమంతా తిరిగిన షర్మిల ఇప్పుడు రివర్స్లో తిరుగుతున్నారని అన్నారు. జగన్ తన ఇంట్లో తానే చిచ్చు పెట్టుకున్నాడని, ఇప్పుడు మాపై పడుతున్నారని అన్నారు. గతంలో వై.యస్.జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు జగనన్న అంటూ షర్మిల రాష్ట్రమంతా తిరిగారు. కానీ ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ లోకి చేరారు. ఏ కుటుంబంలో అయినా ఆడబిడ్డను అన్ని విధాల ఆదుకుంటారు. ఆస్తి పంపకాల విషయంలో ఆడపిల్లకు ఎటువంటి లోటు ఉండకూడదని అనుకుంటారు. అది మన సాంప్రదాయం కూడా.

కానీ జగన్ షర్మిలకు వచ్చే ఆస్తులను ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. అందుకే ఆమె వ్యతిరేకంగా పోటీ చేస్తున్నారు. అయిన అది వాళ్ళ ఇంట్లో సమస్య. మాకేంటి సంబంధం అని, మాపై పడి ఏడవటం ఏంటి అని అన్నారు. వై.యస్.రాజశేఖర్ రెడ్డి నేను చాలా సన్నిహితంగా ఉండేవారం. రాజకీయ విరోధులు అయినప్పటికీ ఆయన కాంగ్రెస్ లో ఉన్నారు, నేను టీడీపీలో ఉన్నా ఇద్దరం సన్నిహితంగా ఉండేవారం. ఇక ఆయన తమ్ముడు వివేకానంద వై.యస్.రాజశేఖర్ రెడ్డి మాటను అసలు జవదాటే వారు కాదు. అలాంటి ఆయనను వై.యస్.జగన్మోహన్ రెడ్డి హత్య చేశాడు అని వై.యస్.జగన్మోహన్ రెడ్డి పై చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. సైకో జగన్ పోవాలని అందుకు ప్రజలంతా కదలి రావాలని పిలుపునిచ్చారు. అన్ని విధాల నష్టపోయిన ఏపీని కాపాడుకునేందుకు ప్రజలందరూ కదలిరావాలని చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు.

జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ 30 ఏళ్ళు వెనక్కి వెళ్లిందని విమర్శించారు. మహిళలు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని, నిత్యవసర ధరలు పెరిగిపోయాయి అని, టమాటాకు పొటాటోకు తేడా తెలియని ముఖ్యమంత్రి అని ఎద్దేవా చేశారు. మూడు రాజధానులను మూడు ముక్కలు చేసి సర్వనాశనం చేశారన్నారు. ఒకప్పుడు సైబరాబాద్ ను డెవలప్ చేయకుంటే ఇప్పుడు హైదరాబాద్ అలా అభివృద్ధి అయ్యేది కాదని అన్నారు. రాజధాని లేకుండా ఐదేళ్లు పాలించాడని అన్నారు. తాము అధికారంలోకి రాగానే రాజధాని అమరావతి చేస్తామని చెప్పారు. భవిష్యత్తు గ్యారెంటీతో సూపర్ సిక్స్ అందిస్తామని హామీ ఇచ్చారు. ఐదేళ్లలో 20 లక్షలు మంది యువతకు ఉద్యోగాలు ఇస్తామన్నారుష జయహో బీసీ కింద ప్రత్యేక చట్టం తీసుకొస్తామని చంద్రబాబు వెల్లడించారు. వై.ఎస్.జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపడానికి ప్రజలంతా సిద్ధం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

Recent Posts

Pawan Kalyn : వామ్మో.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ధ‌రించిన ఈ చెప్పుల ధ‌ర అంత‌నా.. !

Pawan Kalyn : టాలీవుడ్ కా పవర్ స్టార్ అలానే ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాల‌తో…

36 minutes ago

Vijay Devarakonda : విజ‌య్ దేవ‌ర‌కొండ‌పై కేసు న‌మోదు.. ఆ వివాదం ఏంటి?

Vijay Devarakonda : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ. మనసులో ఏం దాచుకోకుండా, ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతారు. వేదికలపై ప్రసంగించేటప్పుడు…

2 hours ago

Wife : ఛీ .. ఇలాంటి ఆడవారు కూడా ఉంటారా..? పారాణి ఆరక ముందే భర్త..!

Wife : కర్నూలు జిల్లా పిన్నాపురంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. తెలంగాణకు చెందిన ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ అనే యువకుడిని,…

2 hours ago

Rappa Politics : అక్కడ వైసీపీ.. ఇక్కడ బిఆర్ఎస్.. రప్పా రాజకీయం..!

Rappa Politics : ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ సంచలనం రేపిన ‘రప్ప రప్ప’ నినాదం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లోనూ ఊపేసింది. ఏపీలో…

3 hours ago

Laya : సెకండ్ ఇన్నింగ్స్‌లో చిరంజీవితో న‌టించాల‌ని ఉంది.. ల‌య కామెంట్స్.. వీడియో!

Laya  : అందం.. అభినయంతో ఒకప్పుడు తెలుగు చిత్రపరిశ్రమలో అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగింది హీరోయిన్ లయ. స్వయంవరం సినిమాతో…

6 hours ago

Chandrababu : వారంతా లక్కీ.. చంద్రబాబు వారికీ కనిపించే దేవుడయ్యాడు..!

Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం సామాజిక భద్రతా పింఛన్లను రికార్డు స్థాయిలో పెంచడం ద్వారా మళ్లీ…

6 hours ago

Manchu Vishnu : ప్ర‌భాస్ మాన‌వ‌త్వం వ‌ల‌న ఆయ‌న‌ని ఎక్కువ‌గా ప్రేమిస్తాను.. మంచు విష్ణు కామెంట్స్.. వీడియో !

Manchu Vishnu : మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ క‌న్న‌ప్ప చిత్రం జూన్ 27న విడుద‌ల కానున్న విష‌యం తెలిసిందే.…

7 hours ago

Jaundice : అసలు కామెర్లు ఎందుకు వస్తాయో మీకు తెలుసా… కళ్ళు, గోర్లు పచ్చగా ఎలా మారుతాయి.. కారణం ఇదే…?

Jaundice : చాలామంది కామెర్లు వస్తే భయపడిపోతుంటారు. కొందరైతే కామెర్లు ముదిరి చనిపోయిన వారు కూడా ఉన్నారు. కాబట్టి కామెర్లు…

8 hours ago