Categories: ExclusiveNewspolitics

Election Offers : ఓటు వేస్తే ఫ్రీగా బీర్‌, బిర్యానీ, బటర్‌ దోశతో పాటు మ‌రెన్నో.. ఈ బంప‌ర్ ఆఫ‌ర్ ఎక్క‌డంటే..!

Advertisement
Advertisement

Election Offers : ఓట‌ర్ల‌ని ఆకర్షించేందుకు రాజ‌కీయ నాయ‌కులు ఓట్ల‌ర‌కి అనేక ఆఫ‌ర్స్ ఇస్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. మరోవైపు ఎల‌క్ష‌న్స్ అధికారులు కూడా ఓటింగ్ శాతాన్ని పెంచాల‌ని బంప‌ర్ ఆఫ‌ర్స్ ఇస్తున్నారు. ప్రజలు ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు ఇలా చేస్తున్నారు. ఇప్పుడు ఇండోర్ జిల్లా అడ్మినిస్ట్రేషన్, స్థానిక వ్యాపార సంస్థలు ఈ దిశలో ఒక అడుగు ముందుకు వేసి ఓటింగ్ శాతాన్ని పెంచడానికి వినూత్నంగా ప్ర‌య‌త్నిస్తున్నారు. న‌గ‌రంలో ఓటు వేసే ఓటర్లకు పోహా-జలేబీ, నూడుల్స్, మంచూరియా ఉచితంగా తినిపించనున్నారు. దీంతో పాటు వారికి ఉచితంగా ఐస్‌క్రీం, శీతల పానీయాలు కూడా అందజేయనున్నారు

Advertisement

Election Offers : ఓటు వేయి బీరు తాగు…

జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌సింగ్‌ అధ్యక్షతన ‘ఓటర్‌ అవగాహన డైలాగ్‌’లో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఓ స‌మావేశంలో జిల్లా అధికారితో పాటు మార్కెట్ అసోసియేషన్, ఫుడ్ అసోసియేషన్, కేఫ్, మాల్, హోటల్ అసోసియేషన్ తదితర వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఓటింగ్‌లో ఇండోర్‌ను నంబర్‌వన్‌గా నిలపడంతోపాటు ఓటింగ్ ప్రక్రియలో మరింత మంది పాల్గొనేలా చేసేందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్న‌ట్టు క‌లెక్ట‌ర్ తెలిపారు. ఏప్రిల్‌ 26వ తేదీన కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని లోక్‌సభ స్థానాల్లో పోలింగ్‌ జరగనుంది. కర్ణాటక రాజధాని బెంగళూరులోని నృపతుంగ రోడ్డులోని నిసర్గ హోటల్‌లో ఓటు వేసిన వారు తమ సిరా గుర్తు చూపిస్తే ఉచితంగా బటర్‌ దోశ, గీ రైస్‌, ఒక కూల్‌ డ్రింక్‌ ఇవ్వనుంది.

Advertisement

Election Offers : ఓటు వేస్తే ఫ్రీగా బీర్‌, బిర్యానీ, బటర్‌ దోశతో పాటు మ‌రెన్నో.. ఈ బంప‌ర్ ఆఫ‌ర్ ఎక్క‌డంటే..!

ఇందుకు సంబంధించి హోట‌ల్ యాజ‌మాన్యం ఓ ప్ర‌క‌ట‌న కూడా చేసింది. ఇక బెల్లందూర్‌లోని ఓ పబ్ అయితే రెండు రోజుల పాటు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఏప్రిల్‌ 27, 28వ తేదీల్లో ఓటర్లకు ఒక జగ్గు బీర్‌ ఉచితంగా ఇవ్వనున్నట్టుగా ప్రకటించింది. ఇక రవాణా విషయంలో ప్రముఖ ఆన్‌లైన్‌ క్యాబ్‌ సర్వీస్‌ సంస్థ ర్యాపిడో ఆఫర్లు ఇచ్చింది. ఓటు వేయడానికి వెళ్లాలనుకున్న వృద్ధులు, దివ్యాంగులకు ఉచితంగా క్యాబ్‌ సేవలు ప్రకటించింది. మే 13న ఓటు వేసే రోజు ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఓటు వేసే వారికి ఉచితంగా పోహా-జలేబీ అందించాలని నగరంలోని చప్పన్ షాప్ అసోసియేషన్ నిర్ణయించింది. తొలిసారి ఓటు వేసే వారికి ఐస్‌క్రీం కూడా అందిస్తార‌ట‌. కృష్ణపుర ఛత్రీ రోడ్ బజరంగ్ మందిర్ సమీపంలోని ఛాయిస్ చైనీస్ సెంటర్ పేరుతో ఏర్పాటైన ఓ సంస్థ ఓటు వేసే ప్రజలకు ఉచితంగా మంచూరియన్, నూడుల్స్ అందించనుంది. ఇది తెలుసుకున్న వారు ఇదేద బాగుందిగా అంటూ కామెంట్ చేస్తున్నారు.

Advertisement

Recent Posts

Shivajyothi : బిడ్డని కన్న ఆనందం కూడా లేకుండా శివజ్యోతి కి బిగ్ బ్యాడ్ న్యూస్..!

Shivajyothi : ప్రముఖ యాంకర్ శివజ్యోతి తల్లి అయ్యారు. తీన్మార్ వార్తలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శివజ్యోతి,…

42 minutes ago

Womens : ఏపీ లో మహిళల కు బంపర్ గుడ్ న్యూస్..!

Womens : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Andhra Pradesh Government  2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి…

3 hours ago

Nara Lokesh : బిగ్ బ్రేకింగ్ : నారా లోకేష్ పటాభిషేకానికి ముహూర్తం ఫిక్స్ ..!

Nara Lokesh : ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకటే చర్చ నడుస్తోంది, అదేంటంటే నారా లోకేష్ పట్టాభిషేకం ఎప్పుడు అని.…

3 hours ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్..మరో మూడు రోజుల్లో రైతుల ఖాతాల్లో భరోసా డబ్బు జమ !!

Rythu Bharosa : తెలంగాణలో యాసంగి సాగు పనులు ఊపందుకున్న వేళ, రైతులకు గొప్ప శుభవార్త అందించబోతుంది తెలంగాణ సర్కార్.…

7 hours ago

AP Budget 2026-27 : ఏపీ బడ్జెట్ 2026-27 హైలైట్స్ ! ఏ శాఖకు ఎంత కేటాయించారంటే..!!

AP Budget 2026-27 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం రూ. 3,32,205 కోట్ల…

7 hours ago

TG Municipal Elections : మున్సిపల్ ఎన్నికల్లో గల్వాన్ అమరుడు కల్నల్ సంతోష్ ఫ్యామిలీ కి షాక్ ఇచ్చిన ఓటర్లు

TG Municipal Elections : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు సూర్యాపేటలో అధికార కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రావడమే కాకుండా,…

8 hours ago

TG Municipal Results : మున్సిపల్ ఎన్నికల్లో రూ.20 కోట్లు ఖర్చు చేసిన ఓడిన అభ్యర్థి..ఏ పార్టీ అభ్యర్దో తెలుసా ?

TG Municipal Results : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో నిజామాబాద్ కార్పొరేషన్ వేదికగా జరిగిన ఒక ఖరీదైన ఓటమి…

9 hours ago