Husband Wife : ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావు..? అని అడిగినందుకు భర్తను చంపిన భార్య..!
Husband Wife : ఒకప్పుడు భర్త చేతిలో భార్య హతం అనే వార్తలు వెలుగులోకి వచ్చాయి. కానీ ఇప్పుడు కాలం మారింది. భార్య చేతిలో భర్త హతం అనే వార్తలు ప్రతి రోజు పదుల సంఖ్యలో వెలుగులోకి వస్తున్నాయి. అక్రమ సంబంధాలు దీనికి ప్రధాన కారణం. కట్టుకున్న భర్త, పిల్లలు ఉన్నప్పుడు కొంతమంది మహిళలు పరాయి వ్యక్తులతో అక్రమ సంబంధం పెట్టుకొని కట్టుకున్న భర్తను , కన్న బిడ్డలను హతమారుస్తున్నారు. తాజాగా మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
Husband Wife : ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావు..? అని అడిగినందుకు భర్తను చంపిన భార్య..!
వికారాబాద్ జిల్లా తాండూరు మండలం మల్కాపూర్ గ్రామంలో రెడ్డిపల్లి వెంకటేష్ (33) అనే వ్యక్తి జయశ్రీ అనే మహిళను 11 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే, మూడు సంవత్సరాల క్రితం భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తడంతో, జయశ్రీ పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది. గ్రామ పెద్దల చొరవతో రెండు నెలల క్రితం ఇద్దరూ సమాధానంగా కలిసివుండేందుకు అంగీకరించారు. భార్యాపిల్లలతో కలిసి వెంకటేష్ జీవితం కొనసాగిస్తూ ఉన్నాడు.
జూలై 21వ తేదీ ఆదివారం రోజు బోనాల పండుగ సందర్భంగా వెంకటేష్ రాత్రి 11 గంటల సమయంలో ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో జయశ్రీ ఫోన్లో మాట్లాడుతుండగా, వెంకటేష్ ఆమెను ఎవరితో మాట్లాడుతున్నావని ప్రశ్నించాడు. దీంతో వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ పరిస్థితిలో జయశ్రీ తన భర్త చేతులు పట్టుకోగా, ఆమె తండ్రి పండరి వెంకటేష్ గొంతు నులిమి అక్కడికక్కడే హతమార్చాడు. ఇతరులకు విషయం తెలియకుండా ఉండేందుకు సోమవారం ఉదయం జయశ్రీ, ఆమె తండ్రి మృతదేహాన్ని ఆటోలో తరలించే ప్రయత్నం చేశారు. కానీ వెంకటేష్ తల్లి మరియు సోదరులు ఈ అనుమానాస్పద ప్రవర్తనను గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, వెంకటేష్ తల్లి ఫిర్యాదు మేరకు జయశ్రీ, ఆమె తండ్రిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళల అభ్యున్నతికి వినూత్నమైన పథకాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు రాయితీపై వ్యవసాయ…
AI affect job loss : ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆర్థిక మందగమనం, పెరుగుతున్న ఖర్చులు,…
సాధారణంగా దూర ప్రాంతాలకు తక్కువ ఖర్చుతో ప్రయాణించడానికి ప్రజలు రైలును ఎంచుకుంటారు. రైలు ప్రయాణంలో మహిళలు, చిన్నారులు, వృద్ధులు అధికంగా…
ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. అర్హత ఉన్నప్పటికీ ఉద్యోగాలు లేనివారికి బెనిఫిషియరీ మేనేజ్మెంట్ స్కీమ్ కింద వర్క్ ఫ్రమ్…
Mobile Offer | ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ ఒప్పో తాజాగా మరొక బడ్జెట్ 5G ఫోన్తో మార్కెట్ను ఊపేస్తోంది. అత్యాధునిక…
Ganesh Chaturthi Boosts | భక్తి, ఉత్సాహం, రంగురంగుల పందిళ్లు, డీజే మోతలతో దేశమంతటా గణేష్ చతుర్థి ఘనంగా జరుపుకున్నారు. అయితే…
Melbourne Airport | ప్రముఖ మలయాళ నటి నవ్య నాయర్ కు ఆస్ట్రేలియాలోని ఎయిర్పోర్ట్లో ఊహించని అనుభవం ఎదురైంది. ఓనం…
బిగ్బాస్ తెలుగు సీజన్ 9 మునుపెన్నడు లేని విధంగా సరికొత్త కాన్సెప్ట్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కామనర్స్, సెలబ్రెటీలను బిగ్బాస్…
This website uses cookies.