is jagan trapping chandrababu with prashanth kishore
Prashanth Kishore – Chandrababu : అసలు ఏపీలో ఏం జరుగుతోందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఏపీలో ఎన్నికలకు ఇంకా 4 నెలల సమయమే ఉంది. ఈనేపథ్యంలో ఏపీ రాజకీయాలు రోజురోజుకూ యూటర్న్ తీసుకుంటున్నాయి. అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేకపోతున్నారు. ఎందుకంటే.. 2019 ఎన్నికల్లో వైసీపీకి పని చేసిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు టీడీపీకి పని చేస్తున్నారు. ఎన్నికలకు సరిగ్గా నాలుగు నెలల సమయం ఉన్న ఈ పీక్ టైమ్ లో ప్రశాంత్ కిషోర్ ను తన టీమ్ లో చేర్చుకున్నారు చంద్రబాబు. చంద్రబాబుతో భేటీ అవ్వడమే కాదు వెంటనే వైసీపీని టార్గెట్ చేయడం స్టార్ట్ చేశారు. వైసీపీలో ఉన్న అసంతృప్తి ఎమ్మెల్యేలను టీడీపీలోకి లాగే ప్రయత్నం చేస్తున్నారు. అసలు వైసీపీని కాదని టీడీపీ గెలుపు కోసం పని చేయడానికి ప్రశాంత్ కిషోర్ ఎందుకు వచ్చినట్టు అనేది ఎవ్వరికీ అంతుపట్టడంలేదు. నిజానికి చంద్రబాబు ఈ విషయంలో ఎవ్వరినీ నమ్మరు. అసలు ఈ ఎన్నికలు టీడీపీకి చావో రేవో అన్నట్టుగా ఉన్నాయి. ఈనేపథ్యంలో చంద్రబాబు ఎందుకు ప్రశాంత్ కిషోర్ ను అంత గుడ్డిగా నమ్ముతారు అనే మరో ప్రశ్న కూడా లేవనెత్తుతోంది.
మరోవైపు వైసీపీలో ఉన్న కొన్ని లూప్ హోల్స్ ప్రశాంత్ కు తెలుసు. అది టీడీపీకి ఖచ్చితంగా ప్లస్ అవుతుందని అనుకుంటున్నారు. కానీ.. ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రశాంత్ కిషోర్ ను నమ్మకూడదు. ప్రశాంత్ కిషోర్.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి దగ్గరి వ్యక్తి. జగన్ కు వ్యతిరేకంగా ఖచ్చితంగా ఆయన పని చేయరు. ఈ విషయంలో చంద్రబాబు కాస్త జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి చంద్రబాబు.. అతడిని నమ్మకూడదు అని టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు కోరుతున్నారు.
ఏపీలో చంద్రబాబు గెలవకూడదని బీజేపీ కూడా కోరుకుంటోంది. ఏదో పేరుకు టీడీపీతో జతకట్టాలని చూసినా బీజేపీకి వైసీపీ గెలిస్తేనే అనుకూలం. పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీ నేరుగానే బీజేపీకి మద్దతు ఇస్తుంది. మోదీకి సపోర్ట్ చేస్తుంది. బీజేపీకి ఎంపీలు తక్కువైనా.. తమ ఎంపీల మద్దతు ప్రకటిస్తుంది. కానీ ఇప్పటికే చంద్రబాబుతో బీజేపీ తెగ తెంపులు చేసుకుంది. ఈనేపథ్యంలో మోదీ కావాలని ప్రశాంత్ కిషోర్ ను చంద్రబాబు దగ్గరికి పంపించారా? లేక వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వేసిన ట్రాపా? ఇది అనేది అర్థం కావడం లేదు. ఏది ఏమైనా.. ప్రశాంత్ కిషోర్ విషయంలో చంద్రబాబు కాస్త జాగ్రత్తగా ఉండటం మాత్రం చాలా ముఖ్యం.
Raksha Bandhan : రాఖీ పండుగ వచ్చింది తమ సోదరులకి సోదరీమణులు ఎంతో ఖరీదు చేసే రాఖీలను కొని, కట్టి…
Pooja Things: శ్రావణమాసం వచ్చింది. అనేక రకాలుగా ఆధ్యాత్మికతో భక్తులు నిండి ఉంటారు. ఈ సమయంలో అనేకరకాల పూజలు, వ్రతాలు,…
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్కి బూస్టప్ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
This website uses cookies.