ycp mlas to join in tdp after prashanth kishore joins tdp
Prashanth Kishore : గత రెండు మూడు రోజుల నుంచి ఎక్కడ చూసినా ఏపీలో ప్రశాంత్ కిషోర్ గురించే చర్చ నడుస్తోంది. దానికి కారణం.. ప్రశాంత్ కిషోర్, నారా లోకేష్ ఇద్దరూ కలిసి ఒకే విమానంలో విజయవాడకు రావడం.. ఆ తర్వాత ప్రశాంత్ కిషోర్.. చంద్రబాబుతో భేటీ కావడం అన్నీ చూశాం. గత ఎన్నికల్లో వైసీపీకి పని చేసిన ప్రశాంత్ కిషోర్.. వైసీపీ గెలిచిన తర్వాత వైసీపీకి దూరం అయ్యారు. వైసీపీకి దూరం అయిన తర్వాత మళ్లీ వైసీపీతో టచ్ లోకి రాలేదు. ఈసారి ఎన్నికలకు ఇంకా నాలుగు నెలల సమయమే ఉన్నా.. ఈసారి ప్రశాంత్ కిషోర్ టీమ్ తో వైసీపీ టైఅప్ పెట్టుకోలేదు. దీన్నే చాన్స్ గా తీసుకొని వెంటనే ప్రశాంత్ కిషోర్ తో చంద్రబాబు భేటీ అయి.. టీడీపీ గెలుపు కోసం పని చేయాల్సిందిగా కోరారు. ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ టీమ్ టీడీపీతో టైఅప్ అయినట్టే. వ్యూహాలు కూడా రచిస్తున్నారు. అవి వర్కవుట్ కూడా అవుతున్నట్టు తెలుస్తోంది.
గెలవడం కోసం ఏ పార్టీ అయినా ఎన్ని జిమ్మిక్కులు ప్రదర్శించడానికి కూడా రెడీగా ఉంటాయి. అందుకే ప్రశాంత్ కిషోర్.. చంద్రబాబును కలవడం హాట్ టాపిక్ గా మారింది. ఒకప్పుడు ప్రశాంత్ కిషోర్ బీహార్ రౌడీ అన్న చంద్రబాబే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ తో టైఅప్ అయ్యారు. అవన్నీ ప్రశాంత్ కు కూడా తెలుసు. మరోవైపు వైసీపీలో ఇన్ చార్జీలను మార్చడం టీడీపీకి ప్లస్ అయింది. అయితే.. చంద్రబాబును ప్రశాంత్ కిషోర్ ఊరికే కలవలేదట. వైసీపీలో అసంతృప్తితో ఉన్న నాయకుల లిస్ట్ ను చంద్రబాబుకు అందించారట. వాళ్లు ఇప్పటికే ప్రశాంత్ తో టచ్ లో ఉన్నారట. వాళ్లంతా ప్రశాంత్ కు టచ్ లోకి రావడంతో ఆ లిస్టును చంద్రబాబుకు అందించారట ప్రశాంత్ కిషోర్.
చంద్రబాబు కూడా ఆ లిస్టును చూసి వాళ్లు పార్టీలోకి రావడానికి మంచి ఆఫర్ ఇవ్వాలని అనుకుంటున్నారట. వాళ్లు పార్టీలోకి వస్తే ఎమ్మెల్యే టికెట్లు కొందరికి, పార్టీ గెలిస్తే వేరే పదవులు ఇచ్చేందుకు హామీ ఇచ్చేందుకు రెడీ అయ్యారట. వాళ్లంతా ఒకవేళ టీడీపీలోకి వస్తే మాత్రం ఇది ఖచ్చితంగా వైసీపీకి పెద్ద మైనస్ అనే చెప్పుకోవాలి. చూద్దాం మరి ఏం జరుగుతుందో?
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్కి బూస్టప్ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
This website uses cookies.