KCR : మార్పులు చేర్పులపై బీఆర్ఎస్ ఫుల్ ఫోకస్ .. పార్టీ వ్యవస్థనే మార్చబోతున్న కేసీఆర్..!

Advertisement
Published by
Advertisement

KCR : బీఆర్ఎస్ లో పూర్తి నాయకత్వం మారబోతుంది. వర్కింగ్ స్టైల్ ని కూడా మార్చాలని డిసైడ్ అయ్యారు. ఇటీవల ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా సమావేశమైన కేటీఆర్ వారి పాత్ర కీలకమని క్లారిటీ ఇచ్చారు. పార్టీ వ్యవస్థలోను మార్పులు తెస్తామని చెబుతున్నారు. ఇక కేసీఆర్ కింది స్థాయి క్యాడర్ తో మాట్లాడుతున్నారు. తప్పెక్కడ జరిగిందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దాదాపుగా 60 నియోజకవర్గాల నేతలతో కేసీఆర్ మాట్లాడాలని అంటున్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం పూర్తి సమయం వెచ్చించాలని పార్టీని, క్యాడర్ ను పట్టించుకోలేదని, తప్పులు జరిగాయని, దిద్దుకుందామని ఆయన చెబుతున్నట్లుగా తెలుస్తుంది. కేసీఆర్ వారి అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పేందుకు అవకాశం కల్పిస్తున్నారు.మొత్తం ఎమ్మెల్యేల గుప్పెట్లో ఉండేదని ఆయన ఆశీస్సులు లేకపోతే పార్టీ కోసం కష్టపడిన వారికి కనీస ప్రయోజనం లభించలేదన్నారు. పార్టీ కోసం కాకుండా వారు సొంత గ్రూపును మెయింటైన్ కోసం ప్రయత్నించడంతో పార్టీకి క్యాడర్ కి మధ్య దూరం పెరిగిందని ఎక్కువమంది చెప్పారు. ఈసారి అలాంటి వారికి పరిస్థితి ఉండదని కేసీఆర్ వారికి చెబుతున్నారు. ఇక పార్టీ గ్రామస్థాయి నుంచి పోలిట్ బ్యూరో వరకు పునర్వ్యవస్థీకరించాలన్న ఆలోచనతో కేసీఆర్ ఉన్నట్లుగా తెలుస్తుంది. లోక సభ ఎన్నికల అయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇటీవల లోక్ సభ సన్నాహక సమావేశాలలో ఇకనుంచి బీఆర్ఎస్ లో ఎమ్మెల్యే కేంద్రంగా పార్టీ కాకుండా, పార్టీ కేంద్రంగానే ఎమ్మెల్యేలు పనిచేసే విధానం తీసుకొస్తామని కేటీఆర్ ప్రకటించారు.

Advertisement

బీఆర్ఎస్ లో భారీ మార్పులు ఖాయమని కేటీఆర్ అంటున్న మాటలు వెల్లడిస్తున్నాయి.అధికారంలో ఉన్ననాళ్ళు పార్టీ నిర్మాణంపై కేసీఆర్, కేటీఆర్ పెద్దగా దృష్టి సారించలేదు. కార్యకర్తలని పట్టించుకోలేదు. ఇది తన తప్పేనని కేటీఆర్ కూడా అంగీకరించారు. పాలనపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల పార్టీకి సమయం ఇవ్వలేకపోయామని కేటీఆర్ సమర్ధించుకున్నారు. బీఆర్ఎస్ కు జిల్లాల పార్టీ అధ్యక్షులు, మండల, గ్రామ శాఖ అధ్యక్షులు ఉన్నా నామమాత్రమేనని అభిప్రాయాలు పార్టీ వర్గాల్లో ఉన్నాయి. కార్యవర్గాల ఏర్పాటు కాగితాలకే తప్ప సమావేశాలు నిర్వహించే సంస్కృతి ఎప్పుడు మర్చిపోయారు. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్చార్జీలుగా వ్యవహరించడంతో వారిదే రాజ్యం అయింది. దీంతో క్యాడర్ కు లీడర్ కు దూరం పెరిగింది. కార్యకర్తల కష్టాలు ఏంటో తెలియకుండా పార్టీ వ్యవహారాలు నడిచాయి. ప్రోటోకాల్ పేరుతో తనను కార్యకర్తలను కలవనీయలేదని కవిత కూడా ఒకసారి గట్టిగా ఫైర్ అయ్యారు. లోక్ సభ నియోజకవర్గాల సన్నాహక సమావేశాల్లో కేటీఆర్, హరీష్ రావు సహా రాష్ట్ర నేతల ఉపన్యాసాల తర్వాత కొంతమంది క్యాడర్ కు మాట్లాడే అవకాశం కల్పిస్తున్నారు. అయితే కార్యకర్తలు గ్రామం మండల నాయకుల అభిప్రాయాలు చాటే అవకాశం పూర్తి స్థాయిలో రాలేదు.

Advertisement

అదే సమయంలో కేసీఆర్ కేటీఆర్ సభల్లోను బీఆర్ఎస్ ముఖ్య కార్యక్రమాల్లోనూ, మీడియా సమావేశాల్లోను, చర్చా వేదికల్లోను ఎక్కడ చూసినా వేళ్ళ మీద లెక్కబట్ట గలిగే కొందరు నాయకులు ఎక్కువగా ఉండేవారు. వారిలో ఇద్దరు ముగ్గురు మినహా మిగతా వారంతా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. వారిని దూరం పెడితేనే మంచిది అన్న భావన కార్యకర్తల్లో వినిపిస్తుంది. వారి స్థానంలో యువనాయకత్వానికి తొలిసారిగా గెలిచిన వారికి అవకాశాలు కల్పిస్తే పార్టీకి మేలు జరగవచ్చు అని అంటున్నారు. ఈసారి మాత్రం పార్టీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా గ్రామ మండల జిల్లా రాష్ట్ర శాఖల వరకు కొత్త తరం నాయకులకు ఉద్యమ కాలంలో క్రియాశీలకంగా ఉన్న నాయకులకు ప్రాధాన్యం దక్కితే పార్టీకి పూర్వవైభవం ఖాయమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

Recent Posts

Ys Jagan : బ్రేకింగ్ : హుటాహుటిన డిల్లీ కి జగన్ , మోడీ నుంచి అర్జంట్  పిలుపు??

Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా ఢిల్లీ పర్యటనలు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యాయి. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ…

3 hours ago

INDIAN ARMY : GOOSEBUMPS NEWS : 2 లక్షల డ్రోన్లు రంగంలోకి దించిన రాజ్ నాథ్ సింగ్..!

INDIAN ARMY : భారతదేశ రక్షణ రంగం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రూపొందించిన పది ఏళ్ల భారీ ప్రణాళిక మన దేశ…

5 hours ago

Revanth Reddy : CM రేవంత్ విలువ తెలుసుకున్న తెలంగాణా మంత్రులు

Revanth Reddy : తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరు మరియు…

6 hours ago

Modi Decisions : మతమార్పిడి చేస్తున్న వాళ్లకి మోడీ చావు దెబ్బ .. తిరుగులేని చట్టం

Modi Decisions : దేశంలో స్వచ్ఛంద సంస్థల పేరుతో విదేశాల నుండి వచ్చే నిధుల వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు…

7 hours ago

Visakhapatnam Murder Case : అప్పుడు డ్ర‌మ్ము.. ఇప్పుడు ఫ్రిడ్జ్‌.. మీర‌ట్ ను మించిన వైజాగ్ స్టోరీ.. అస‌లేం జ‌రిగింది..!

Visakhapatnam Murder Case ప్రశాంతతకు మారుపేరైన విశాఖపట్నం Visakhapatnam నగరంలో నెత్తురోడింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ శ్రద్ధా వాకర్…

8 hours ago

YS Jagan arrest : జగన్ త్వరలో అరస్ట్ ? బీజేపీ నుంచి అతిపెద్ద హింట్ !

YS Jagan Arrest: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా జగన్ అరెస్ట్ అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. రాష్ట్రంలో…

10 hours ago

Hydroponics Farming : మట్టితో పనిలేకుండా వ్యవసాయం.. కోట్లు సంపాదిస్తున్న ముగ్గురు మిత్రులు.. 35000 మందికి ట్రైనింగ్.. ‘హైడ్రోపోనిక్స్’ సక్సెస్ స్టోరీ ఇదే

Hydroponics Farming : వ్యవసాయం అనగానే ఎకరాల కొద్దీ భూమి, దానికి తగ్గట్లు మట్టి, ట్రాక్టర్లు, ఎరువులు.. ఇవే మనకు…

11 hours ago

Director Raghavendra Rao : శ్రీదేవి గురించి తెలియని నిజాలు చెప్తూ ఏడ్చేసిన డైరెక్టర్ రాఘవేంద్ర రావు

Director Raghavendra Rao : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో శతాధిక చిత్రాల దర్శకుడిగా వెలుగొందుతున్న కె. రాఘవేంద్రరావు, తాజాగా ఒక…

13 hours ago

New Changes : ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక మార్పులు .. లాభనష్టాల వివరాలివే .. !

New Changes : భారతదేశంలో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏప్రిల్ 1, 2026 నుంచి పలు…

14 hours ago

Gold Silver Rate 30 March 2026 : భారీగా పెరిగి, ఇప్పుడు స్థిరంగా పసిడి ధరలు.. ఈరోజు ధరలివే..!

Gold Silver Rate 30 March 2026 : భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని…

15 hours ago

Cold Water : అతిగా చల్లని నీరు తాగుతున్నారా? గుండె మరియు జీర్ణక్రియపై దాని ప్రభావం ఇదే!

Cold Water : వేసవి కాలంలో ఎండ వేడి నుంచి ఉపశమనం పొందడానికి మనం చేసే మొదటి పని ఫ్రిజ్‌లోని…

17 hours ago