Categories: NewspoliticsTelangana

Telangana Budget 2024 : ఈరోజు నుంచి వాళ్ల‌కు రైతు బంధు క‌ట్‌.. కౌలు రైతులకు రైతు బంధు ఎప్ప‌టి నుంచి ఇస్తాం అంటే..!

Advertisement
Advertisement

Telangana Budget 2024 : ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఇది కాంగ్రెస్ కు తొలి బడ్జెట్ కావడం విశేషం. ఆరు గ్యారెంటీలకు సంబంధించి బడ్జెట్లో కేటాయింపులు ఎలా ఉంటాయనే దానిపై ఉత్కంఠత పెరిగింది. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శాసనసభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. శాసనసభలో ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా భట్టి విక్రమార్క రైతు భరోసాపై మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నామని ప్రకటించారు. రైతుబంధు నిబంధనలో పునః సమీక్ష చేసి నిజమైన అర్హులకు రైతు భరోసా కింద ఎకరాకు 15,000 అందించేందుకు కృత నిశ్చయంతో ఉన్నామని అన్నారు. కౌలు రైతులకు కూడా రైతు భరోసా సాయాన్ని ఇవ్వడానికి మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. అదేవిధంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కార్యక్రమాన్ని ఆధారంగా చేసుకుని రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని పటిష్టంగా అమలు చేయబోతున్నామని తెలిపారు.

Advertisement

రైతు బీమా పథకాన్ని కౌలు రైతులకు కూడా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, అందుకు అవసరమైన మార్గదర్శకాలను రూపొందిస్తున్నామని చెప్పారు. రైతుల రుణమాఫీ పై కూడా డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. శాసనసభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా రైతు రుణమాఫీ పై కూడా మాట్లాడారు. ఎన్నికల ముందు ప్రజలకు హామీ ఇచ్చిన విధంగానే రైతు రుణమాఫీ పథకాన్ని అమలు చేయబోతున్నామని తెలిపారు. రెండు లక్షల రుణమాఫీ పై త్వరలోనే కార్యాచరణ ఉంటుందని స్పష్టం చేశారు. అందుకు విధివిధానాలను రూపొందిస్తున్నామని, ప్రతి పంటకు మద్దతు ధర కూడా అందిస్తామని అన్నారు.

Advertisement

అర్హులకే రైతు బంధు ఇస్తామని రైతు బంధు నిబంధనలు పునః సమీక్షిస్తాం అన్నారు. ఎకరాకు 15,000 కౌలు రైతులకు కూడా ఇవ్వబోతున్నట్లు తెలిపారు. రైతుబంధుతో పెట్టుబడిదారులు అనర్హులు లాభపడ్డారు. రియల్ ఎస్టేట్ కంపెనీలు కొన్న భూములకు సైతం రైతుబంధు వచ్చింది. ఇప్పుడు వారికి రైతుబంధు కట్ అవుతుందని అన్నారు .నాసిరకం విత్తనాలను నకిలీ విత్తనాలను అరికట్టేందుకు తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని భట్టి విక్రమార్క తెలిపారు. రైతుకు నష్టం చేసే ఏ విత్తన వ్యాపారిని కూడా తమ ప్రభుత్వం ఉపేక్షించదని అన్నారు. నాణ్యమైన విత్తన ఉత్పత్తి విషయాలలో పురోభివృద్ధి సాధించేందుకు సకల చర్యలు తీసుకుంటామని ఈ మేరకు త్వరలో ఒక నూతన విత్తన విధానం తీసుకురాబోతున్నామని భట్టి విక్రమార్క తెలిపారు.

Advertisement

Recent Posts

India : ఇండియాపై క‌న్నెర్ర చేసిన ప్ర‌కృతి… రిపోర్ట్‌తో సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి…!

India : మన దేశాన్ని ప్రకృతి పగబట్టిందా? అంటే అవును అనిపిస్తుంది. ప్ర‌స్తుత ప‌రిస్థితులు ప్ర‌జ‌ల‌ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.…

9 hours ago

Trisha : ఎంత బ్ర‌తిమాలినా విన‌లేదు.. త్రిష వ‌ల‌న నా జీవితం నాశనం అయిందంటూ సంచ‌ల‌న కామెంట్స్

Trisha : సౌత్ అగ్ర నటీమణుల్లో త్రిష ఒకరు. నాలుగు పదుల వయసులో కూడా త్రిష డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు.…

10 hours ago

UPSC కంబైన్డ్ జియో-సైంటిస్ట్ 2024 నోటిఫికేషన్ విడుద‌ల‌.. సెప్టెంబర్ 24 వరకు ద‌ర‌ఖాస్తుకు అవ‌కాశం..!

UPSC  : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కంబైన్డ్ జియో-సైంటిస్ట్ 2024 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆసక్తి మరియు అర్హత…

11 hours ago

Fish Venkat : ఫిష్ వెంక‌ట్ అనారోగ్య ప‌రిస్థితి తెలుసుకొని చ‌లించిపోయిన చిరు, చ‌ర‌ణ్‌.. వెంట‌నే ఏం చేశారంటే..!

Fish Venkat : టాలీవుడ్‌లో కొంద‌రు స్టార్స్ ఒకానొక‌ప్పుడు ఓ వెలుగు వెలిగి ఇప్పుడు మాత్రం చాలా దారుణ‌మైన స్థితిని…

12 hours ago

Eating Food : ఆహారం తినడానికి కూడా వాస్తు నియమాలు ఉన్నాయని మీకు తెలుసా..?

Eating Food : హిందూమతంలో జీవశాస్త్రానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. వాస్తు దోషాలు యొక్క ప్రభావం జీవితంపై కూడా పడుతుందనేది…

13 hours ago

Pithapuram : పిఠాపురంలో ఏం జ‌రుగుతుంది.. వ‌ర్మ వ‌ర్సెస్ జ‌న‌సేన‌ ?

Pithapuram : ప‌వ‌న్ క‌ళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేయ‌డంతో ఆ పేరు నెట్టింట తెగ మారుమ్రోగింది.పిఠాపురం వైపు ప్ర‌జ‌లు క్యూలు…

14 hours ago

Tonsils : ట్యాన్సిల్ నొప్పిని ఇంటి నివారణలతో కూడా తగ్గించవచ్చు… ఎలాగంటే…!

Tonsils : మనకు జలుబు చేస్తే ట్యాన్సిల్స్ రావడం కామన్. అయితే ఈ టాన్సిల్స్ నాలుక వెనక గొంతుకు ఇరువైపులా…

17 hours ago

Internet : ఇంటర్నెట్ అడిక్షన్ ను ఈజీగా వదిలించుకోవచ్చు… ఎలాగో తెలుసా…!!

Internet  : ప్రస్తుత కాలంలో ఎంతోమంది మద్యం మరియు గంజాయి, పొగాకు లాంటి చెడు వ్యసనాలకు బానిసలు అయ్యి వారి…

18 hours ago

This website uses cookies.