2025 Year : ఈ ఏడాదిలో రాబోయే నెలల్లో చాల ప్రమాదాలు జరగబోతున్నాయా..?
ప్రధానాంశాలు:
ప్రపంచంలో జరుగుతున్న ఈ విపత్తులకు కారణం శని గ్రహమేనా..?
2025 Year : ఈ ఏడాదిలో రాబోయే నెలల్లో చాల ప్రమాదాలు జరగబోతున్నాయా..?
2025 Year : 2025 సంవత్సరాన్ని ప్రపంచం ఆశాభావంతో ప్రారంభించినా, ఆ ఆశలు మధ్యలోనే బూడిదయ్యాయి. భూకంపాలు, అగ్నిప్రమాదాలు, ఉగ్రదాడులు, మరియు మానవ కల్పిత విపత్తులు వరుసగా సంభవించాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం, భారత్-పాక్ ఘర్షణలు గణనీయంగా ప్రపంచ శాంతిని దెబ్బతీశాయి. ఇదంతా గ్రహాల స్థితిగతుల ప్రభావం అనే విశ్వాసం మళ్లీ చర్చకు వచ్చింది. శని గ్రహం మీన రాశిలోకి ప్రవేశించడం, అంగారకుడు-కేతు సంయోగం వంటి గ్రహ చలనలు ప్రపంచ స్థాయిలో సంఘర్షణలకు దారితీయవచ్చని అనేక జ్యోతిష్యులు చెబుతున్నారు.

2025 Year : ఈ ఏడాదిలో రాబోయే నెలల్లో చాల ప్రమాదాలు జరగబోతున్నాయా..?
2025 Year : శని గ్రహం మీన రాశిలోకి ప్రవేశించడం వల్లే ప్రపంచంలో ఈ విపత్తులు జరుగుతున్నాయా..?
ప్రముఖ జ్యోతిష్యులు స్వామి యోగేశ్వరానంద గిరి, కుశాల్ కుమార్ లాంటి వారు 2025లో మరిన్ని ఘోర సంఘటనలు జరగవచ్చని చెబుతున్నారు. వీరిలో కొంతమంది ఈ ఏడాది మహాభారత కాలాన్ని పోలిన గ్రహాల స్థితి ఏర్పడిందని, ఇది ఒక పునాది సంకేతమని అభిప్రాయపడుతున్నారు. నోస్ట్రాడామస్ శతాబ్దాల క్రితం చెప్పిన ప్లేగు, ఆస్టరాయిడ్ ఢీకొనడం, ఆర్థిక వ్యవస్థ పతనం వంటి భవిష్యవాణులు కూడా 2025నకే వర్తిస్తాయా అనే ఉహాగానాలు ఊపందుకుంటున్నాయి.
సోషల్ మీడియాలో మరో ఆసక్తికరమైన అంశం వైరల్ అవుతోంది. 2025 క్యాలెండర్ 1941 నాటి క్యాలెండర్తో ఒకేలా ఉందని. 1941లో జపాన్ పర్ల్ హార్బర్పై దాడి చేసి అమెరికా రెండో ప్రపంచ యుద్ధంలోకి అడుగుపెట్టింది. ఈ పోలికను ఆధారంగా చేసుకుని “చరిత్ర పునరావృతమవుతోంది” అనే భావన కొన్ని వర్గాలలో భయం, ఆందోళనకు దారితీస్తోంది. అయితే ఇది కేవలం గ్రెగోరియన్ క్యాలెండర్లో ఉండే యాదృచ్ఛిక సమ్మేళనం మాత్రమేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అయినప్పటికీ, ప్రపంచం ఇప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.