
#image_title
Roja : ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా ఎక్కడ చూసినా చంద్రబాబు అరెస్ట్ గురించే చర్చ నడుస్తోంది. చంద్రబాబును అరెస్ట్ చేయడం అనేది అక్రమం అంటూ టీడీపీ నేతలు ఓవైపు నిరసన తెలుపుతుంటే మరోవైపు వైసీపీ నేతలు సంబురాలు చేసుకుంటున్నారు. చంద్రబాబు అరెస్ట్ సక్రమమే అని.. ఆయనకు తగిన శాస్త్రి జరిగిందని అంటున్నారు. ఇక.. వైసీపీ మంత్రి రోజా అయితే చంద్రబాబుపై తీవ్రస్థాయిలో స్పందించారు. నిజమైన మహాత్మా గాంధీ వారసుడిగా జగన్ మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్లడం, ఆ పార్టీలో మేము మంత్రిగా ఉండటం మా అదృష్టం. అదే సమయంలో ఎన్టీఆర్ గారు చెప్పారు. గొడ్డు కన్నా హీనం, గాడ్సే కన్నా ఘోరం అని చంద్రబాబు గురించి. గాడ్సే కన్నా ఘోరమైన చంద్రబాబు ఈరోజు జైలులో తాను తప్పు చేసి ప్రజల డబ్బులు దోచుకొని సాక్ష్యాదారాలతో అరెస్టయి జైలులో కూర్చొని తానేదో త్యాగం చేసినట్టు తనదేదో అక్రమంగా అరెస్ట్ చేసినట్టు ఈరోజు జైలులో ఆయన నిరాహార దీక్ష చేయడం, బయట ఆయన భార్య చేయడం చూస్తే మహాత్మా గాంధీ గారిని అవమానించినట్టే అని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు.
మహాత్మా గాంధీ లాంటి వాళ్లు అందరూ కూడా నిస్వార్థంగా దేశ ప్రజల కోసం తమ ప్రాణాలు అర్పించారు. ఎన్నో పోరాటాలను అహింసా మార్గంలో చేశారు. కానీ.. చంద్రబాబు జీవితమే హింసా మార్గం. పిల్లనిచ్చిన తండ్రి లాంటి ఎన్టీఆర్ కే వెన్నుపోటు పొడిచాడు. ఆ తర్వాత వంగవీటి రంగా గారి విషయం మీకు తెలుసు. అలా చెప్పుకుంటే పోతే ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని ఎలా వేధించారో మనకు తెలుసు. హింసా మార్గంలో వెళ్లిన చంద్రబాబు ఈరోజు నిరాహార దీక్ష చేయడం అనేది ఎక్కడా సింపతీ కాదు.. అసహ్యించుకుంటున్నారు. మొన్న మీరు చూశారు.. పల్లాలు కొట్టడం, విజిల్స్ వేయడం లాంటి చిల్లర చేష్టలు చేశారు. నిజంగా మాకు కోటికి పైగా సభ్యత్వం ఉంది అని అంటారు కదా. మరి ఆ కోటి మంది ఎక్కడికెళ్లారు. నిజంగా చంద్రబాబుకు అన్యాయం జరిగి ఉంటే.. ఆయన్ను అక్రమంగా అరెస్ట్ చేసి ఉంటే.. ఆ కోటి మంది బయటికి వచ్చి ఎందుకు నిరసన తెలియజేయలేదు అంటూ రోజా మండిపడ్డారు.
#image_title
మీ రాజకీయ ఉనికి కోసం మీరు ఈరోజు ఏదైతే చేస్తున్నారో అది ప్రజలంతా గమనిస్తున్నారు. అందుకే ప్రజలెవ్వరు కూడా మీరు చేస్తున్న ఈ చిల్లర చేష్టలను కానీ.. ఈ దొంగ చేసే దీక్షలను ప్రజలెవ్వరూ స్వాగతించడం లేదు. మహాత్మా గాంధీని అవమానించే విధంగా ఈరోజు చేసేదాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే.. పవన్ కళ్యాణ్ 15 సీట్లకు జనసేన అభ్యర్థులను పెట్టుకుంటే చాలు. వైసీపీకి 175 నియోజకవర్గాలకు అభ్యర్థులు రెడీగా ఉన్న పార్టీ. ఏ సమయంలో అయినా సింగిల్ గా ఎన్నికలకు వెళ్లే దమ్మున్న నాయకుడు జగన్ మోహన్ రెడ్డి. ఈరోజు జనసేనకు పోటీ చేయడానికి టీడీపీ కావాలి.. టీడీపీకి జనసేన కావాలి. సన్యాసి, సన్యాని రాసుకుంటే బూడిద రాలుతుంది తప్ప.. ఇంకేం రాలదు అనేది జనసేన, టీడీపీ తెలుసుకోవాలి. ఈరోజు జగన్ పక్కన జనం ఉన్నారు. జగన్ పాదయాత్రలో ఏం ఇచ్చారో ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చడమే కాకుండా ఈ రోజు హామీ ఇవ్వనివి కూడా చాలా పథకాలు అమలు చేశారు అని రోజా స్పష్టం చేశారు.
Beer Kidney Stones : కిడ్నీలో రాళ్లు (Kidney Stones) ఏర్పడటం ప్రస్తుతం సాధారణ ఆరోగ్య సమస్యగా మారింది. కిడ్నీ…
Low-Calorie Snacks : ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలంటే కేవలం ప్రధాన భోజనాలపై మాత్రమే కాదు, మధ్యలో తీసుకునే స్నాక్స్పైనా ప్రత్యేక…
Jr NTR : టాలీవుడ్లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కనున్న…
Balka Suman Arrest : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే, BRS నాయకుడు బాల్క…
హైదరాబాద్లోని గాంధీభవన్ ప్రాంగణంలో ఉన్న ఇందిరా భవన్లో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం ఘనంగా…
Union Cabinet Expansion : ప్రధానమంత్రి Narendra Modi నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ ప్రస్తుతం…
Pawan Kalyan : 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే దృష్టి సారించింది. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి…
OTT Movie : వేదికలపై ప్రతిరోజూ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్లు విడుదలవుతున్నాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం విడుదలైన…
Ganugabanda : సమాజంలో చిన్నారుల ఆరోగ్యవంతమైన ఎదుగుదల, విద్యాభివృద్ధి లక్ష్యంగా అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అంగన్వాడీ టీచర్…
After : తెలంగాణలోని నాగర్కర్నూల్ జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఓ హత్య కేసు స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. వివాహేతర…
Cooking Oil : మన రోజువారీ వంటల్లో వంట నూనె కీలక పాత్ర పోషిస్తుంది. కూరలు, ఫ్రైలు, స్నాక్స్, పప్పులు..…
This website uses cookies.