Nara Bhuvaneshwari : తిరుపతిలో ఎదురుపడ్డ బద్ధ శత్రువులు.. భువనేశ్వరి ఒక లుక్ ఇవ్వడంతోనే రోజా షాక్, కొడాలికి ఉచ్చ పడిపోయింది | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Nara Bhuvaneshwari : తిరుపతిలో ఎదురుపడ్డ బద్ధ శత్రువులు.. భువనేశ్వరి ఒక లుక్ ఇవ్వడంతోనే రోజా షాక్, కొడాలికి ఉచ్చ పడిపోయింది

 Authored By kranthi | The Telugu News | Updated on :26 October 2023,5:00 pm

ప్రధానాంశాలు:

  •  తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భువనేశ్వరి

  •  తనను చూడటానికి ఎగబడ్డ భక్తులు

  •  భారీ సెక్యూరిటీ మధ్య దర్శనం చేసుకున్న భువనేశ్వరి

Nara Bhuvaneshwari : ప్రస్తుతం ఏపీలో చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం చాలా సీరియస్ గా ఉంది. వైసీపీ నేతలు కావాలని చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారని టీడీపీ నేతలు, చంద్రబాబు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. చంద్రబాబు అరెస్ట్ తో టీడీపీ పార్టీ కార్యక్రమాలన్నీ మరుగున పడిపోయాయి. దీంతో నారా భువనేశ్వరి ముందుండి పార్టీని నడిపిస్తున్నారు. తాజాగా నారా భువనేశ్వరి తిరుమలకు వెళ్లారు. శ్రీవారిని దర్శించుకోవడానికి కొందరు టీడీపీ మహిళా నేతలతో కలిసి భువనేశ్వరి తిరుమలకు వెళ్లారు. భువనేశ్వరి తిరుమలలో అడుగుపెట్టగానే భక్తులు గుమికూడారు. తనను చూడటం కోసం ఎగబడ్డారు. దీంతో భక్తులను పక్కకు తప్పించేందుకు సెక్యూరిటీ తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.

అదే అదే రోజు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మంత్రి రోజా కూడా అదే రోజు తిరుమలకు వచ్చారు. మంత్రి రోజా తిరుమల శ్రీవారిని దర్శించుకొని తిరుమల నుంచి బయటికి వచ్చారు. అయితే.. ముగ్గురూ ఒకేసారి తిరుమలను దర్శించుకోవడంతో ముగ్గురూ ఒకసారి తిరుమల బయట తారసపడ్డారు. కొడాలి నాని, రోజా అంటే ఒకటే పార్టీ కాబట్టి.. వాళ్లు తరుచూ కలుసుకుంటారు కాబట్టి పెద్దగా వాళ్లు ఇద్దరూ కలిసినప్పుడు ఎలాంటి రెస్పాన్స్ లేనప్పటికీ.. భువనేశ్వరిని ఇద్దరూ చూసి షాక్ అయ్యారు. వెంటనే రోజా అయితే.. నమస్తే అక్క అంటూ నమస్కారం పెట్టింది. ఇక.. కొడాలి నాని అయితే ఏం మాట్లాడకుండా సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Nara Bhuvaneshwari : తరుచూ శ్రీవారిని దర్శించుకుంటున్న రోజా

ఈ మధ్య మంత్రి అయినప్పటి నుంచి రోజా తరుచూ శ్రీవారిని దర్శించుకుంటున్నారు. కనీసం వారానికి ఒకసారి అయినా రోజా తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. వీలు కుదిరినప్పుడల్లా ఆమె శ్రీవారి దర్శనం కోసం వస్తుంటారు. ఏది ఏమైనా రోజా, భువనేశ్వరి ఒకేసారి తారసపడటంతో అక్కడ ఉన్న భక్తులు కూడా షాక్ అయ్యారు. ఇటీవలే వంగవీటి రాధ పెళ్లిలో పవన్ కళ్యాణ్, కొడాలి నాని ఇద్దరూ తారసపడిన విషయం తెలుసు కదా. పవన్ కళ్యాణ్ ను చూసి కొడాలి నాని దగ్గరికి వచ్చి నమస్కారం పెట్టి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. వీళ్లంతా కేవలం మీడియా ముందు, సోషల్ మీడియాలో శత్రువుల్లా తిట్టుకుంటారు కానీ.. ఫేస్ టు ఫేస్ మాత్రం అస్సలు తిట్టుకోరు. నవ్వుకుంటూ మాట్లాడుకుంటారు.

kranthi

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి