
#image_title
Pass Book : ప్రస్తుతం ఏపీలో కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులని సరిదిద్దే పనిలో కూటమి ప్రభుత్వం ఉంది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం రూ. 23 కోట్ల వ్యయంతో జారీ చేసిన 21.86 లక్షల భూ హక్కు సర్వే పత్రాల స్థానంలో ప్రభుత్వం ముద్ర క్యూఆర్ కోడ్తో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేయాలని ఏపీ క్యాబినేట్ ఓ నిర్ణయం తీసుకుంది.
#image_title
ప్రజాధనం దుర్వినియోగం చేసి రూ. వందల కోట్ల ఖర్చుతో మాజీ సీఎం 75 లక్షల సర్వే రాళ్లపై తన ఫోటోలు వేసుకున్నారు. వాటిని పూర్తిగా ఆపాలని మంత్రవర్గం నిశ్చయించింది. ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేయకుండా అనర్హత వేటు నిబంధనను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. బుధవారమిక్కడ వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ నిర్ణయాలను సమాచార, పౌరసంబంధాలు, గృహనిర్మాణ శాఖల మంత్రి కొలుసు పార్థసారథి విలేకరులకు వెల్లడించారు.
వైసీపీ ప్రభుత్వం భూ సర్వే చేసి ప్రజల మధ్య గొడవలు పెట్టిందన్నారు రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ . ఈనెల 20 నుంచి భూ సమస్యలపై రీసర్వే చేస్తామన్నారు . మండలంలో ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకుని సర్వే చేపడుతామన్నారు. పైలెట్ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత గ్రామసభలు పెట్టి క్యూ ఆర్ కోడ్తో పాస్ బుక్ లు జారీ చేస్తామన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్.
Virosh Jodi : తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ఆదరణ పొందిన జంటగా గుర్తింపు పొందిన విజయ్ దేవరకొండ –…
Vivo X200 Pro : ప్రీమియం ఫీచర్లు, సూపర్ కెమెరా క్వాలిటీ, బలమైన పనితీరు అన్నీ కలిపి స్మార్ట్ఫోన్ను తక్కువ…
Vijay : తమిళ సినీ నటుడు, టీవీకే (తమిళగా వెట్రి కళగం) అధినేత విజయ్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన…
TTD Jobs : నిరుద్యోగ వైద్య అభ్యర్థులకు శుభవార్త. తిరుమల తిరుపతి దేవస్థానములు (టీటీడీ) అనుబంధ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న…
గల్ఫ్ ప్రాంతంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ప్రపంచ దేశాలన్నింటికీ ఒక పెద్ద హెచ్చరికలా కనిపిస్తున్నాయి. ఇరాన్ మరియు ఇజ్రాయిల్ మధ్య…
విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని మరియు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మధ్య నడుస్తున్న ఆధిపత్య పోరు…
తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఒక పెద్ద మార్పు గురించి జోరుగా చర్చ జరుగుతోంది. దాదాపు నాలుగున్నర దశాబ్దాల రాజకీయ…
PMSBY : ఈ రోజుల్లో ఒక కప్పు టీ తాగాలన్నా కనీసం 20 రూపాయలు ఖర్చవుతోంది. అయితే అదే 20…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ నడుస్తోంది, అదే జగన్ అరెస్ట్ వ్యవహారం. గత ఐదేళ్ల పాలనలో…
womens : మహిళల సాధికారతను ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలను అమలు చేస్తోంది. రాష్ట్రంలోని…
USA Target : అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్న గొడవలు చూస్తుంటే అసలు వాళ్ళ అసలు ఉద్దేశం ఏంటనేది పెద్ద ప్రశ్నగా…
Free Gas Cylinder Scheme : రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఉపశమనం కలిగించేందుకు అమలులో ఉన్న దీపం పథకం…
This website uses cookies.