Categories: Newspolitics

YS Jagan : చంద్ర‌బాబు ఇంత క‌న్నా మోసం ఏదైన ఉందా అంటూ ఏకి పారేసిన జ‌గ‌న్

Advertisement
Advertisement

YS Jagan : ప్ర‌స్తుతం ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న జ‌గ‌న్ వీలున్న‌ప్పుడ‌ల్లా చంద్ర‌బాబుని ఏకిపారేస్తున్నారు. కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చి ఆరు నెల‌లు అవుతున్నా మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల్ని అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ సీఎం చంద్రబాబుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇచ్చిన హామీలు అమ‌లు చేయ‌ని విధానం చూస్తుంటే ఇంత బ‌రితెగింపు ఏంట‌ని అనిపిస్తుందని జ‌గ‌న్ అన్నారు. త‌న సోష‌ల్ మీడియాలో చంద్ర‌బాబుని ఓ రేంజ్‌లో ఏకి పారేసారు జ‌గ‌న్. ప్రజలకు ఇచ్చిన మాటను అమలు చేయకుండా టేక్‌ ఇట్‌ గ్రాంటెడ్‌గా తీసుకుంటారా? లక్షలమంది తల్లులకు, పిల్లలకు, రైతులకు ఇంతటి ద్రోహం తలపెడతారా? అంటూ జగన్ త‌న ట్వీట్‌లో రాసుకొచ్చారు.

Advertisement

YS Jagan : చంద్ర‌బాబు ఇంత క‌న్నా మోసం ఏదైన ఉందా అంటూ ఏకి పారేసిన జ‌గ‌న్

జ‌గ‌న్ వార్నింగ్స్..

Advertisement

ఇక అధికారంలోకి రాక‌ముందు తల్లికి వందనం అని, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ ఏడాదికి రూ.15వేలు చొప్పున ఇస్తామన్నారు, అధికారంలోకి రాగానే అంతకుముందు మేం ఇస్తున్న అమ్మ ఒడి పథకాన్ని సైతం ఆపేశారని గుర్తుచేశారు. తల్లికి వందనం పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారో నిర్దిష్టంగా చెప్పలేదని జగన్ చెప్పుకొచ్చారు. ఇంతకన్నా మోసం ఏమైనా ఉంటుందా? ఇంతకన్నా పచ్చి దగా ఏమైనా ఉంటుందా? అని జగన్ ప్రశ్నించారు. మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేయడం, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కడం మీకు అలవాటుగా మారిపోయింది చంద్రబాబుగారూ…? అంటూ నిప్పులు చెరిగారు జ‌గ‌న్.

అంతేకాదు రైతు భ‌రోసా తీరు కూడా ఏ మాత్రం బాగోలేదు అంటూ జ‌గ‌న్ చెప్పుకొచ్చారు. ఈ ఏడాది ఖరీఫ్‌, రబీ రెండు సీజన్లు అయిపోతున్నా ఇవ్వకుండా గడిపేశారంటూ విమ‌ర్శించారు. ఇదిగో అదుగో అంటూ లీకులు ఇస్తున్నా కూడా రైతులకు పెట్టుబడి సహాయం కింద ఒక్కపైసా ఇవ్వలేదన్నారు. అధికారంలోకి వచ్చిన ఆ ఏడాదే 2019 అక్టోబరులో ప్రారంభమై, అప్పటినుంచి క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం రూ.13,500 చొప్పున 53.58 లక్షల రైతుల చేతిలో, రూ.34,378కోట్లు తాము పెట్టామని,, కేంద్రం ఇచ్చేది కాకుండా మీరు ఏడాదికి రూ.20వేలు ఇస్తామని చెప్పారు త‌ప్ప ఇప్పటి వ‌ర‌కు ఒక్క పైసా ఇవ్వ‌లేదు అని జ‌గ‌న్ విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించారు.

Advertisement

Recent Posts

Constable Soumya : కానిస్టేబుల్ సౌమ్య మృతికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం : చుంచు కుమార్

Constable Soumya  : హైదరాబాద్ రాష్ట్రంలో ఎక్సైజ్ సిబ్బంది విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని…

4 minutes ago

Jogi Ramesh : నారా లోకేష్ ‘పిల్ల చేష్టలకు’ భయపడేది లేదు – జోగి వార్నింగ్

Jogi Ramesh : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో సెగలు పుట్టించే పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌…

24 minutes ago

Farmers : అన్నదాతల‌కు గుడ్‌న్యూస్‌… బ‌డ్జెట్‌లో భారీ వ‌రాలు జ‌ల్లు..!

Farmers : Budget 2026 -27 : కేంద్ర బడ్జెట్ 2026-27లో అన్నదాతలకు అద్భుతమైన ప్రోత్సాహకాలను ప్రకటించింది. వ్యవసాయ, ఉద్యానవన…

1 hour ago

Mahesh Babu – Balakrishna : ఓడియమ్మ బంటీ .. మహేష్ – బాలయ్య మల్టీ స్టారర్ .. థియేటర్‌లు బ్లాస్ట్

Mahesh Babu - Balakrishna : టాలీవుడ్‌లో Tollywood  సూపర్ స్టార్ మహేష్ బాబు  Superstar Mahesh Babu ,…

2 hours ago

KCR : ఉద్యమ రచన చేసిన గదిలోనే విచారణ .. కేసీఆర్ భావోద్వేగం..!

KCR : తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో  phone tapping case  తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది.…

3 hours ago

Prabhas : అన్నా నీ కాళ్ళు పట్టుకుంటాం .. ఆ పని మాత్రం చేయకు అంటున్న ప్రభాస్ ఫ్యాన్స్

Prabhas : మారుతి దర్శకత్వంలో  Maruti Direction  ప్రభాస్ హీరోగా వచ్చిన చిత్రం ‘ది రాజాసాబ్‌’ అనుకున్న స్థాయిలో విజయం…

4 hours ago

Rythu Bharosa : రైతు భరోసా డబ్బులు ఎప్పుడు ? .. యాసంగి పంట పై అన్నదాతల ఎదురు చూపులు

Rythu Bharosa : యాసంగి పంట  Yasangi panta  సీజన్ ప్రారంభమై ఇప్పటికే రెండు నెలలు గడుస్తుతుంది. కానీ ప్రభుత్వ…

5 hours ago

Ration Card: రేషన్ లబ్దిదారులకు గుడ్‌న్యూస్… మరో నిత్యావసర సరుకు.. రూ.20కే పంపిణీ..

Ration Card: ఆంధ్రప్రదేశ్‌లోని రేషన్ కార్డు లబ్దిదారులకు రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అందించింది. ఇప్పటివరకు రేషన్ దుకాణాల్లో బియ్యం,…

6 hours ago