
#image_title
YS Jagan : ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ వీలున్నప్పుడల్లా చంద్రబాబుని ఏకిపారేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు అవుతున్నా మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల్ని అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ సీఎం చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయని విధానం చూస్తుంటే ఇంత బరితెగింపు ఏంటని అనిపిస్తుందని జగన్ అన్నారు. తన సోషల్ మీడియాలో చంద్రబాబుని ఓ రేంజ్లో ఏకి పారేసారు జగన్. ప్రజలకు ఇచ్చిన మాటను అమలు చేయకుండా టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకుంటారా? లక్షలమంది తల్లులకు, పిల్లలకు, రైతులకు ఇంతటి ద్రోహం తలపెడతారా? అంటూ జగన్ తన ట్వీట్లో రాసుకొచ్చారు.
YS Jagan : చంద్రబాబు ఇంత కన్నా మోసం ఏదైన ఉందా అంటూ ఏకి పారేసిన జగన్
జగన్ వార్నింగ్స్..
ఇక అధికారంలోకి రాకముందు తల్లికి వందనం అని, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ ఏడాదికి రూ.15వేలు చొప్పున ఇస్తామన్నారు, అధికారంలోకి రాగానే అంతకుముందు మేం ఇస్తున్న అమ్మ ఒడి పథకాన్ని సైతం ఆపేశారని గుర్తుచేశారు. తల్లికి వందనం పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారో నిర్దిష్టంగా చెప్పలేదని జగన్ చెప్పుకొచ్చారు. ఇంతకన్నా మోసం ఏమైనా ఉంటుందా? ఇంతకన్నా పచ్చి దగా ఏమైనా ఉంటుందా? అని జగన్ ప్రశ్నించారు. మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేయడం, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కడం మీకు అలవాటుగా మారిపోయింది చంద్రబాబుగారూ…? అంటూ నిప్పులు చెరిగారు జగన్.
అంతేకాదు రైతు భరోసా తీరు కూడా ఏ మాత్రం బాగోలేదు అంటూ జగన్ చెప్పుకొచ్చారు. ఈ ఏడాది ఖరీఫ్, రబీ రెండు సీజన్లు అయిపోతున్నా ఇవ్వకుండా గడిపేశారంటూ విమర్శించారు. ఇదిగో అదుగో అంటూ లీకులు ఇస్తున్నా కూడా రైతులకు పెట్టుబడి సహాయం కింద ఒక్కపైసా ఇవ్వలేదన్నారు. అధికారంలోకి వచ్చిన ఆ ఏడాదే 2019 అక్టోబరులో ప్రారంభమై, అప్పటినుంచి క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం రూ.13,500 చొప్పున 53.58 లక్షల రైతుల చేతిలో, రూ.34,378కోట్లు తాము పెట్టామని,, కేంద్రం ఇచ్చేది కాకుండా మీరు ఏడాదికి రూ.20వేలు ఇస్తామని చెప్పారు తప్ప ఇప్పటి వరకు ఒక్క పైసా ఇవ్వలేదు అని జగన్ విమర్శల వర్షం కురిపించారు.
Constable Soumya : హైదరాబాద్ రాష్ట్రంలో ఎక్సైజ్ సిబ్బంది విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని…
Jogi Ramesh : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో సెగలు పుట్టించే పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర మంత్రి నారా లోకేష్…
Farmers : Budget 2026 -27 : కేంద్ర బడ్జెట్ 2026-27లో అన్నదాతలకు అద్భుతమైన ప్రోత్సాహకాలను ప్రకటించింది. వ్యవసాయ, ఉద్యానవన…
Mahesh Babu - Balakrishna : టాలీవుడ్లో Tollywood సూపర్ స్టార్ మహేష్ బాబు Superstar Mahesh Babu ,…
KCR : తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో phone tapping case తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది.…
Prabhas : మారుతి దర్శకత్వంలో Maruti Direction ప్రభాస్ హీరోగా వచ్చిన చిత్రం ‘ది రాజాసాబ్’ అనుకున్న స్థాయిలో విజయం…
Rythu Bharosa : యాసంగి పంట Yasangi panta సీజన్ ప్రారంభమై ఇప్పటికే రెండు నెలలు గడుస్తుతుంది. కానీ ప్రభుత్వ…
Ration Card: ఆంధ్రప్రదేశ్లోని రేషన్ కార్డు లబ్దిదారులకు రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అందించింది. ఇప్పటివరకు రేషన్ దుకాణాల్లో బియ్యం,…
This website uses cookies.