
AP Politics : ఏపీలో రాళ్ల రాజకీయాలు.. ప్రజాస్వామ్యంలో ఎందుకీ దాడులు..!
AP Politics : మిగతా రాష్ట్రాల్లో రాజకీయాలు ఎలా ఉన్నాయో తెలియదు గానీ.. ఏపీలో మాత్రం దారుణంగా ఉన్నాయి. మొన్నటి వరకు మాటల వరకే పరిమితం అయిన రాజకీయాలు కాస్తా ఇప్పుడు దాడుల వరకు వచ్చాయి. మొన్న విజయవాడలో రాత్రి బస్సు యాత్ర చేస్తున్న సందర్భంలో జగన్ మీద అగంతకులు రాళ్లతో దాడి చేశారు. ఆ ఘటనలో జగన్ ఎడమ కనుబొమ్మ మీద గాయం అయింది. అయితే ఇదంతా వైసీపీ స్క్రిప్టు ప్రకారమే జరిగిందని టీడీపీ, జనసేన ఆరోపించాయి. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులను అందరూ ఖండించాల్సిందే.అందుకే ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ దాడిని ఖండించారు. కానీ చంద్రబాబు, పవన్ మాత్రం వైసీపీ ఆడుతున్న డ్రామా అని అంటున్నాయి. కానీ జగన్ కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ప్రతిపక్షమే దాడి చేయించిందని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే ఒక్క రోజు తేడాలో నిన్న ఆదివారం నాడు అటు పవన్ కల్యాణ్, ఇటు చంద్రబాబు మీద కూడా రాళ్లు విసిరారని వార్తలు వచ్చాయి.
కానీ వారికి ఎలాంటి గాయాలు కాలేదు. మరి ఇలా అగ్ర నేతలపై రాళ్ల దాడులు ఎందుకు జరుగుతున్నాయనే అనుమానాలు అందరికీ వస్తున్నాయి. ఎందుకంటే ఏపీలో ఇప్పుడు ఎవరూ కూడా ప్రత్యర్థులను ప్రతిపక్ష నేతలుగా చూడట్లేదు. శత్రువులుగానే చూస్తున్నారు.ఒకరిపై ఒకరు చేసుకునే విమర్శలు హద్దులు మీరిపోతున్నాయి. దారుణాతి దారుణంగా ఒకరిపై ఒకరు వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. మేం అధికారంలోకి రాగానే మిమ్మల్ని గుడ్డలూడదీసి కొడుతాం అని ఒకరు అంటారు. మేం గెలిస్తే మీరు జైలుకే అని ఇంకొకరు అంటారు. ఇంట్లోకొచ్చి కొడుతాం అని ఒకరంటారు. ఇలా తమ స్థాయిని మర్చి మపోయి మరీ హింసాత్మక మాటలు మాట్లాడుతున్నారు. దాంతో వారి పార్టీలో ఉన్న కేడర్ కూడా మైండ్ లోకి అదే ఎక్కించుకుంటున్నారు. తమ నాయకులు మాట్లాడిన మాటలకు వారు రెచ్చిపోయి దాడులకు తెగ బడుతున్నారు.
AP Politics : ఏపీలో రాళ్ల రాజకీయాలు.. ప్రజాస్వామ్యంలో ఎందుకీ దాడులు..!
అందుకే ఇప్పుడు ఈ రాళ్ల దాడులు అని చెప్పుకోవాలి. అయితే ఇలాంటి సమయాలనే సంఘ విద్రోహ శక్తులు అలవుగు మార్చుకునే ప్రమాదం కూడా ఉంటుంది. వాళ్లు వాటిని మరింత హింసాత్మకంగా మార్చే అవకాశాలు ఉంటాయి. కానీ ఈ విషయాలను పార్టీల అధ్యక్షులు పట్టించుకోవట్లేదు. ఎంత సేపు వారి స్వార్థం, వారి అధికారం కోసమే మాట్లాడుతున్నారు. కనీసం ప్రజలకు తాము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పే రోజుల నుంచి.. మేం గెలిస్తే మిమ్మల్ని బొంద పెడుతాం, జైలుకు పంపుతాం అని చెప్పుకునే స్థాయికి ఏపీ రాజకీయాలు దిగజారిపోయాయి. కాబట్టి ఇప్పటికైనా అగ్ర నేతలు ఆచితూచి మాట్లాడాలని, తమ కేడర్ ను కంట్రోల్ లో ఉంచుకోవాలని ప్రజాస్వామ్య వాదులు చెబుతున్నారు.
SSC Notification 2026 : దేశవ్యాప్తంగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం మంచి అవకాశాన్ని అందించింది. సెంట్రల్…
Chanakyaniti : సాధారణంగా చాణక్యుడు చెప్పిన నీతి సూత్రాలు మనిషి జీవితాన్ని ఒక క్రమపద్ధతిలో నడిపించడానికి ఎంతగానో తోడ్పడతాయి. ముఖ్యంగా…
Reels Watching : నేటి ఆధునిక ప్రపంచంలో సోషల్ మీడియా మన జీవనశైలిలో అంతర్భాగంగా మారింది. ఉదయం నిద్రలేవగానే ఫోన్…
Jeera Water : ఈ రోజుల్లో ఆరోగ్యంపై ప్రజల్లో విపరీతమైన అవగాహన పెరిగింది. సాధారణ వ్యక్తుల నుంచి సెలబ్రిటీల వరకు…
summer : వేసవి కాలం క్రమంగా తీవ్రరూపం దాల్చుతోంది. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మనందరిపై ప్రభావం చూపుతున్నప్పటికీ చిన్న పిల్లలపై…
Foreign Trip : సాధారణంగా మనలో చాలా మందికి విదేశీ ప్రయాణం చేయాలని ఒక కల ఉంటుంది. కానీ ఫారిన్…
Ys Family : వైఎస్ కుటుంబానికి సంబంధించి గత పాతికేళ్ల కిందట ఒక ఊహించని సంఘటన జరిగిందనే వార్త ఇప్పుడు…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు వైఎస్ జగన్ నిర్ణయాలు మళ్ళీ హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. గత ఎన్నికల వరకు వైసిపి వెనుక ఉండి…
Ananya Nagalla : అనన్య నాగళ్ల హీరోయిన్ గా నటిస్తున్న మూవీ "లీసా". ఈ చిత్రాన్ని వెంకట్ దుగ్గిరెడ్డి (యూఎస్ఏ),…
High Court : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగ అభ్యర్థులకు ఇది ఒక గొప్ప అవకాశంగా చెప్పవచ్చు. రాష్ట్ర హైకోర్టులో వివిధ…
Students : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం కోసం మరొక ముఖ్యమైన అడుగు వేసింది. ఇప్పటికే విద్యార్థుల విద్య, ఆరోగ్యం,…
This website uses cookies.