AP Politics : ఏపీలో రాళ్ల రాజకీయాలు.. ప్రజాస్వామ్యంలో ఎందుకీ దాడులు..!
AP Politics : మిగతా రాష్ట్రాల్లో రాజకీయాలు ఎలా ఉన్నాయో తెలియదు గానీ.. ఏపీలో మాత్రం దారుణంగా ఉన్నాయి. మొన్నటి వరకు మాటల వరకే పరిమితం అయిన రాజకీయాలు కాస్తా ఇప్పుడు దాడుల వరకు వచ్చాయి. మొన్న విజయవాడలో రాత్రి బస్సు యాత్ర చేస్తున్న సందర్భంలో జగన్ మీద అగంతకులు రాళ్లతో దాడి చేశారు. ఆ ఘటనలో జగన్ ఎడమ కనుబొమ్మ మీద గాయం అయింది. అయితే ఇదంతా వైసీపీ స్క్రిప్టు ప్రకారమే జరిగిందని టీడీపీ, జనసేన ఆరోపించాయి. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులను అందరూ ఖండించాల్సిందే.అందుకే ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ దాడిని ఖండించారు. కానీ చంద్రబాబు, పవన్ మాత్రం వైసీపీ ఆడుతున్న డ్రామా అని అంటున్నాయి. కానీ జగన్ కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ప్రతిపక్షమే దాడి చేయించిందని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే ఒక్క రోజు తేడాలో నిన్న ఆదివారం నాడు అటు పవన్ కల్యాణ్, ఇటు చంద్రబాబు మీద కూడా రాళ్లు విసిరారని వార్తలు వచ్చాయి.
కానీ వారికి ఎలాంటి గాయాలు కాలేదు. మరి ఇలా అగ్ర నేతలపై రాళ్ల దాడులు ఎందుకు జరుగుతున్నాయనే అనుమానాలు అందరికీ వస్తున్నాయి. ఎందుకంటే ఏపీలో ఇప్పుడు ఎవరూ కూడా ప్రత్యర్థులను ప్రతిపక్ష నేతలుగా చూడట్లేదు. శత్రువులుగానే చూస్తున్నారు.ఒకరిపై ఒకరు చేసుకునే విమర్శలు హద్దులు మీరిపోతున్నాయి. దారుణాతి దారుణంగా ఒకరిపై ఒకరు వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. మేం అధికారంలోకి రాగానే మిమ్మల్ని గుడ్డలూడదీసి కొడుతాం అని ఒకరు అంటారు. మేం గెలిస్తే మీరు జైలుకే అని ఇంకొకరు అంటారు. ఇంట్లోకొచ్చి కొడుతాం అని ఒకరంటారు. ఇలా తమ స్థాయిని మర్చి మపోయి మరీ హింసాత్మక మాటలు మాట్లాడుతున్నారు. దాంతో వారి పార్టీలో ఉన్న కేడర్ కూడా మైండ్ లోకి అదే ఎక్కించుకుంటున్నారు. తమ నాయకులు మాట్లాడిన మాటలకు వారు రెచ్చిపోయి దాడులకు తెగ బడుతున్నారు.
AP Politics : ఏపీలో రాళ్ల రాజకీయాలు.. ప్రజాస్వామ్యంలో ఎందుకీ దాడులు..!
అందుకే ఇప్పుడు ఈ రాళ్ల దాడులు అని చెప్పుకోవాలి. అయితే ఇలాంటి సమయాలనే సంఘ విద్రోహ శక్తులు అలవుగు మార్చుకునే ప్రమాదం కూడా ఉంటుంది. వాళ్లు వాటిని మరింత హింసాత్మకంగా మార్చే అవకాశాలు ఉంటాయి. కానీ ఈ విషయాలను పార్టీల అధ్యక్షులు పట్టించుకోవట్లేదు. ఎంత సేపు వారి స్వార్థం, వారి అధికారం కోసమే మాట్లాడుతున్నారు. కనీసం ప్రజలకు తాము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పే రోజుల నుంచి.. మేం గెలిస్తే మిమ్మల్ని బొంద పెడుతాం, జైలుకు పంపుతాం అని చెప్పుకునే స్థాయికి ఏపీ రాజకీయాలు దిగజారిపోయాయి. కాబట్టి ఇప్పటికైనా అగ్ర నేతలు ఆచితూచి మాట్లాడాలని, తమ కేడర్ ను కంట్రోల్ లో ఉంచుకోవాలని ప్రజాస్వామ్య వాదులు చెబుతున్నారు.
Raja Mother : మేఘాలయ హనీమూన్ కేసు దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన భర్తని భార్యనే…
Gut Health :గట్ హెల్త్ అంటే పేగుల ఆరోగ్యం. ప్రేగులు ఎంత ఆరోగ్యంగా ఉంటాయో మనం కూడా అంతే ఆరోగ్యంగా…
Trivikram Jr Ntr : టాలీవుడ్ డైరెక్టర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కొత్త సినిమాలపై క్రేజీ వార్తలు వస్తున్నాయి. త్రివిక్రమ్..…
Hair On Ears : పురుషులకు సహజంగానే వెంట్రుకలు మొలుస్తుంటాయి. కొందరికీ చాతిపై దట్టంగా వెంట్రుకలు పెరుగుతాయి. మరికొందరికి చెవులపై…
Today Gold prices : గత వారం బంగారం ధరలు తగ్గగా..ఈ వారం మాత్రం బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. మూడు…
Nikhil Movie : యువ నటుడు నిఖిల్ సిద్ధార్థ్ కొత్త సినిమా షూటింగ్లో ఊహించని ప్రమాదం సంభవించింది. కీలకమైన సన్నివేశాలు…
Green Almond : దారుణంగా ప్రతి ఒక్కరు కూడా బాదంపప్పుని ఏడు లేదా ఎనిమిది తీసుకొని రాత్రి నానబెట్టి మరుసటి…
singer Mangli : టాలీవుడ్ ప్రముఖ సింగర్ మంగ్లీ తన బర్త్ డే వేడుకల వివాదంతో హాట్ టాపిక్గా మారింది.…
This website uses cookies.