
AP Politics : ఏపీలో రాళ్ల రాజకీయాలు.. ప్రజాస్వామ్యంలో ఎందుకీ దాడులు..!
AP Politics : మిగతా రాష్ట్రాల్లో రాజకీయాలు ఎలా ఉన్నాయో తెలియదు గానీ.. ఏపీలో మాత్రం దారుణంగా ఉన్నాయి. మొన్నటి వరకు మాటల వరకే పరిమితం అయిన రాజకీయాలు కాస్తా ఇప్పుడు దాడుల వరకు వచ్చాయి. మొన్న విజయవాడలో రాత్రి బస్సు యాత్ర చేస్తున్న సందర్భంలో జగన్ మీద అగంతకులు రాళ్లతో దాడి చేశారు. ఆ ఘటనలో జగన్ ఎడమ కనుబొమ్మ మీద గాయం అయింది. అయితే ఇదంతా వైసీపీ స్క్రిప్టు ప్రకారమే జరిగిందని టీడీపీ, జనసేన ఆరోపించాయి. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులను అందరూ ఖండించాల్సిందే.అందుకే ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ దాడిని ఖండించారు. కానీ చంద్రబాబు, పవన్ మాత్రం వైసీపీ ఆడుతున్న డ్రామా అని అంటున్నాయి. కానీ జగన్ కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ప్రతిపక్షమే దాడి చేయించిందని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే ఒక్క రోజు తేడాలో నిన్న ఆదివారం నాడు అటు పవన్ కల్యాణ్, ఇటు చంద్రబాబు మీద కూడా రాళ్లు విసిరారని వార్తలు వచ్చాయి.
కానీ వారికి ఎలాంటి గాయాలు కాలేదు. మరి ఇలా అగ్ర నేతలపై రాళ్ల దాడులు ఎందుకు జరుగుతున్నాయనే అనుమానాలు అందరికీ వస్తున్నాయి. ఎందుకంటే ఏపీలో ఇప్పుడు ఎవరూ కూడా ప్రత్యర్థులను ప్రతిపక్ష నేతలుగా చూడట్లేదు. శత్రువులుగానే చూస్తున్నారు.ఒకరిపై ఒకరు చేసుకునే విమర్శలు హద్దులు మీరిపోతున్నాయి. దారుణాతి దారుణంగా ఒకరిపై ఒకరు వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. మేం అధికారంలోకి రాగానే మిమ్మల్ని గుడ్డలూడదీసి కొడుతాం అని ఒకరు అంటారు. మేం గెలిస్తే మీరు జైలుకే అని ఇంకొకరు అంటారు. ఇంట్లోకొచ్చి కొడుతాం అని ఒకరంటారు. ఇలా తమ స్థాయిని మర్చి మపోయి మరీ హింసాత్మక మాటలు మాట్లాడుతున్నారు. దాంతో వారి పార్టీలో ఉన్న కేడర్ కూడా మైండ్ లోకి అదే ఎక్కించుకుంటున్నారు. తమ నాయకులు మాట్లాడిన మాటలకు వారు రెచ్చిపోయి దాడులకు తెగ బడుతున్నారు.
AP Politics : ఏపీలో రాళ్ల రాజకీయాలు.. ప్రజాస్వామ్యంలో ఎందుకీ దాడులు..!
అందుకే ఇప్పుడు ఈ రాళ్ల దాడులు అని చెప్పుకోవాలి. అయితే ఇలాంటి సమయాలనే సంఘ విద్రోహ శక్తులు అలవుగు మార్చుకునే ప్రమాదం కూడా ఉంటుంది. వాళ్లు వాటిని మరింత హింసాత్మకంగా మార్చే అవకాశాలు ఉంటాయి. కానీ ఈ విషయాలను పార్టీల అధ్యక్షులు పట్టించుకోవట్లేదు. ఎంత సేపు వారి స్వార్థం, వారి అధికారం కోసమే మాట్లాడుతున్నారు. కనీసం ప్రజలకు తాము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పే రోజుల నుంచి.. మేం గెలిస్తే మిమ్మల్ని బొంద పెడుతాం, జైలుకు పంపుతాం అని చెప్పుకునే స్థాయికి ఏపీ రాజకీయాలు దిగజారిపోయాయి. కాబట్టి ఇప్పటికైనా అగ్ర నేతలు ఆచితూచి మాట్లాడాలని, తమ కేడర్ ను కంట్రోల్ లో ఉంచుకోవాలని ప్రజాస్వామ్య వాదులు చెబుతున్నారు.
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు కూటమి ప్రభుత్వం భారీ…
Anil Ravipudi: టాలీవుడ్లో అపజయం ఎరుగని 'హిట్ మెషిన్'గా పేరుగాంచిన అనిల్ రావిపూడి, తన కెరీర్లో వరుసగా తొమ్మిది విజయాలను…
Vijay : తమిళనాడు Tamila Nadu Politics రాజకీయ యవనికపై 'తమిళగ వెట్రి కజగం' ( TVK ) పార్టీతో…
Hyundai EV Sector : ఎలక్ట్రిక్ వాహనాల (EV) ప్రపంచంలో ఛార్జింగ్ సమస్యలకు చరమగీతం పాడుతూ హ్యుందాయ్ మోటార్ గ్రూప్…
Indiramma Atmiya Bharosa Scheme : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అండగా నిలవాలనే…
This website uses cookies.