
Pawan Kalyan has been selected as a candidate for Janasena
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాలలో దూకుడుగా వెళుతున్నారు. జనసేన వారాహి యాత్రలో ప్రజా సమస్యల విషయంలో వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీస్తూ సీఎం వైఎస్ జగన్ పై పవన్ చేస్తున్న వ్యాఖ్యలు… కీలకంగా మారాయి. ముఖ్యంగా వాలంటీర్లు వ్యవస్థ పై పవన్ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా ఏపీ రాజకీయాలను వేడెక్కించాయి. ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కంటే దూకుడుగా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారు. పవన్ చేస్తున్న వ్యాఖ్యలతో… ఏపీలో రాజకీయ ముఖచిత్రం జనసేన వర్సెస్ వైసీపీ అన్నట్టు పరిస్థితి మారింది. ముఖ్యంగా గోదావరి జిల్లాలలో పవన్ సామాజిక వర్గం కాపు వర్గానికి చెందిన ఓట్లు ఎక్కువగా ఉండటంతో.. అక్కడ జరుగుతున్న వారాహి యాత్రకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.
ఇదే సమయంలో గోదావరి జిల్లాలలో ఒక్క స్థానం కూడా వైసిపి గెలవనివ్వకుండా చేయడమే తన టార్గెట్ అని పవన్ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. మామూలుగా గోదావరి జిల్లాలలో ఇంకా కోస్తా ఆంధ్రాలో చాలావరకు తెలుగుదేశం పార్టీకి బలమైన ఓటు బ్యాంక్ ఉంది. ఈ క్రమంలో టిడిపికి కంచుకోటలుగా కొన్ని నియోజకవర్గాల సైతం ఉన్నాయి. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బలంగా ఉండే చోట్ల పవన్ కళ్యాణ్ తన పార్టీ అభ్యర్థులను వచ్చే ఎన్నికలకు ఎంపిక చేసినట్లు సమాచారం. అది కూడా గోదావరి జిల్లాలలోనే అట. విషయంలోకి వెళ్తే పిఠాపురం, రాజానగరం, కొవ్వూరు నియోజకవర్గలు…టీడీపీ పార్టీకి బలమైన కంచుకోటలుగా ఉన్నాయి.
Pawan Kalyan has been selected as a candidate for Janasena
పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు ఈ మూడు నియోజకవర్గాలలో ఆగమేఘాల మీద పవన్ ఇన్చార్జిలను నియమించారు. తంగెల ఉదయ్ శ్రీనివాస్, బత్తుల రామకృష్ణ, టీవీ రామారావులను ఇన్చార్జిలుగా నియమించడం జరిగింది. ఈ పరిణామంతో తెలుగుదేశం పార్టీకి గోదావరి జిల్లాలలో ఎక్కడ కూడా.. ఉనికి లేకుండా పవన్ పెద్ద వ్యూహం పన్నినట్లు వార్తలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోదావరి జిల్లాలలో అత్యధికంగా గెలిచే పార్టీ యే అధికారంలోకి వస్తది. 2014లో జనసేన పొత్తుతో తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాలు గెలిచింది. 2019లో వైసిపి.. అత్యధిక స్థానాలు తెలిసింది.
అయితే తాజాగా తెలుగుదేశం పార్టీతో పొత్తులు కుదిరే ప్రసక్తి కనిపించకపోవడంతో పాటు సీట్ల సర్దుబాటులో ఒకే తాటిపైకి పరిస్థితులు రాని నేపథ్యంలో.. పవన్ గోదావరి జిల్లాలను ఆధారం చేసుకుని కింగ్ మేకర్ అవటానికి ట్రై చేస్తున్నట్లు టాక్. కర్ణాటక రాష్ట్రంలో కుమారస్వామి మాదిరిగా ఏపీలో పవన్ గోదావరి జిల్లాలలో సత్తా చాటి ముఖ్యమంత్రి స్థానాన్ని డిసైడ్ చేసే రీతిలో.. చాలా పెద్ద ప్లాన్ వేసినట్లు సమాచారం.
Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…
Petrol : భారత్లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
This website uses cookies.