pawan kalyan revealed that ys-jagan called him
Pawan Kalyan : ప్రస్తుతం ఏపీలో వారాహి యాత్ర ట్రెండ్ అవుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రను మొదలు పెట్టిన విషయం తెలుసు కదా. ఈ యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ భారీ బహిరంగ సభ నిర్వహించి వైసీపీ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. అసలే ఎన్నికల ఏడాదిలోకి ఎంటర్ అవడంతో ఏపీలో రాజకీయాలన్నీ వేడెక్కుతున్నాయి. ముందస్తు వచ్చినా.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రెడీగా ఉండాలి కదా. అందుకే జనసేనాని ఇప్పటి నుంచే ఎన్నికలకు సమాయత్తం అవుతూ వారాహి యాత్రను చేపట్టారు.
ఇందులో భాగంగా వారాహి యాత్రలో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో పవన్ కళ్యాణ్ విరుచుకుపడ్డారు. కొన్ని ఆసక్తికరమైన విషయాలను కూడా ఈసందర్భంగా పవన్ కళ్యాణ్.. తన అభిమానులతో పంచుకున్నారు. 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత వైఎస్ జగన్.. ముఖ్యమంత్రిగా తన ప్రమాణ స్వీకారానికి రావాలని పవన్ కళ్యాణ్ కు ఫోన్ చేశారట. ఆయన ఫోన్ చేసినప్పుడు మనస్ఫూర్తిగా తాను శుభాకాంక్షలు తెలిపానని.. తాము కూడా చాలా బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేతలుగా వ్యవహరిస్తామని చెప్పామని పవన్ కళ్యాణ్ తెలిపారు.
pawan kalyan revealed that ys-jagan called him
తాము ఎట్టిపరిస్థితుల్లోనూ వ్యక్తిగత విమర్శలు చేయమని.. పాలసీల పరంగానే ఏదైనా తప్పు జరిగితే మాత్రం గొంతెత్తి మాట్లాడుతాం. కానీ.. మాకు ఆ అవకాశం రావద్దు. అలాంటి పాలన చేయండి. మీకు జనాలు నమ్మి 151 సీట్లు ఇచ్చారు.. అని నేను జగన్ కు శుభాకాంక్షలు చెప్పాను.. అని 2019 ఎన్నికల తర్వాత జరిగిన విషయాన్ని తాజాగా పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు. కానీ.. తాను ఇప్పుడైతే భవన నిర్మాణ కార్మికుల కోసం రోడ్డెక్కానో.. అప్పటి నుంచి నన్ను తిట్టడం ప్రారంభించారని.. పవన్ కళ్యాణ్ భావోద్వేగానికి గురయ్యారు. వారాహి యాత్రలో భాగంగా తొలి బహిరంగ సభ జరిగిన కత్తిపూడిలో పవన్ కళ్యాణ్ పై వ్యాఖ్యలు చేశారు.
Arattai app |ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు ఉపయోగిస్తున్న వాట్సాప్కి భారత్ నుండి గట్టి పోటీగా ఓ స్వదేశీ మెసేజింగ్…
RRB | సర్కారు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త! భారతీయ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) తాజాగా పెద్ద…
Farmers | ఆంధ్రప్రదేశ్ రైతులకు ఒక కీలకమైన హెచ్చరిక. ఈ-క్రాప్ బుకింగ్కు సెప్టెంబర్ 30 (రేపు) చివరి తేదీగా వ్యవసాయ…
Modi | ప్రధాని నరేంద్ర మోదీ తన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా…
Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (SEC)…
Prize Money | ఆసియా కప్ 2025 ఫైనల్లో ప్రతిష్టాత్మక భారత్ vs పాకిస్తాన్ తలపడడం క్రికెట్ ప్రపంచాన్నే ఉత్కంఠకు…
Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…
TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…
This website uses cookies.