
Prashant Kishor : రాజకీయ పార్టీలకి సలహాలు ఇచ్చేందుకు ప్రశాంత్ కిషోర్ అన్ని కోట్లు తీసుకుంటారా ?
Prashant Kishor : ఇటీవల చాలా మంది రాజకీయ నాయకులు వ్యూహకర్తలపై ఆధారపడుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, జన్ సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహకర్తగా మంచి పేరు తెచ్చుకున్నారు.2019 ఎలక్షన్స్ సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ (పీకె) పేరు బలంగా వినిపించింది.. ఆయన ఫీజు కూడా చాలా ఎక్కువగా ఉంటుందని అంటుంటారు. ఈ క్రమంలో తాను ఒక ఎన్నికలో సలహాలు ఇస్తే ఫీజు రూ.100 కోట్లకు పైగా వసూలు చేస్తానని చెప్పారు పీకె.
పీకే సలహాలతో ఎన్నో పార్టీలు ఎన్నికల్లో విజయం సాధించడం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగాయి. అందుకే ఆయన ఎన్నికల వ్యూహానికి తిరుగుండదు అనేది చాలా మంది అభిప్రాయం. తాజాగా తాను ఏదైనా రాజకీయ పార్టీ లేదా నాయకుడికి సలహాలిచ్చేందుకు ఎంత తీసుకుంటారనే వివరాలను ఆయన స్వయంగా వెల్లడించారు. రూ. 100 కోట్లకు పైగా తీసుకుంటున్నట్టు ఆయన తెలిపారు. బీహార్లో జరగనున్న ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కిశోర్ తన ఫీజు వివరాలను వెల్లడించారు. బెలగంజ్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. తన ఎన్నికల ప్రచారాలకు ఎలా నిధులు సమకూరుస్తారో చెప్పాలని ప్రజలు తనను తరచుగా అడుగుతారని ఆయన పేర్కొన్నారు. వాటికి సమాధానంగా ఇప్పుడిలా తన ఫీజు వివరాలను ప్రశాంత్ కిశోర్ వెల్లడించారు.
Prashant Kishor : రాజకీయ పార్టీలకి సలహాలు ఇచ్చేందుకు ప్రశాంత్ కిషోర్ అన్ని కోట్లు తీసుకుంటారా ?
తన ప్రచార కార్యక్రమాల్లో టెంట్లు, స్టేజ్ లు వేయడానికి తన దగ్గర డబ్బు సరిపోదని అనుకుంటున్నారా.. తాను అంత బలహీనుడిని అని భావిస్తున్నారా అని ప్రశ్నించిన పీకే… తాను ఒక్క ఎన్నికల్లో ఎవరికైనా సలహా ఇస్తె రూ.100 కోట్లు, లేదా అంతకంటే ఎక్కువ తీసుకుంటానని.. వాటితోనే తన ఎన్నికల ప్రచారాలకు నిధులు సమకూర్చుకో గలుగుతున్నానని అన్నారు. కాగా… బీహార్ లో నవంబర్ 13న నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. వీటిలో పోటీ చేయడానికి జన సూరజ్ అభ్యర్థులను నిలబెట్టింది. ఇందులో భాగంగా.. బెలగంజ్ నుంచి మహ్మద్ అంజాద్.. ఇమాంగంజ్ నుంచి జితేంద్ర, రాంగఢ్ నుంచి సుశీల్, తరారీ నుంచి కిరణ్ సింగ్ బరిలోకి దిగారు! . నవంబర్ 13న ఉప ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 23న ఫలితాలు వెల్లడవుతాయి.
Modi : ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో జరుగుతున్న పరిణామాలు అంతర్జాతీయంగా చాలా ఉత్కంఠను రేపుతున్నాయి. ఒకవైపు యుద్ధ వాతావరణం నెలకొన్నా మన…
Vijaysai Reddy : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ మరియు డీలిమిటేషన్ బిల్లు లోక్సభలో వీగిపోయిన సంగతి తెలిసిందే.…
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు కట్టుకోవాలని లేదా భవన నిర్మాణాలు చేపట్టాలని చూస్తున్న వారికి, ముఖ్యంగా బిల్డర్లకు…
Amit Shah : పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో…
Ration Card : అమలు చేస్తున్న ఉచిత రేషన్ పథకాల ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలకు ప్రతి నెల ధాన్యం…
Pithapuram Varma : పిఠాపురం నియోజకవర్గ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం…
Abhishek Sharma : సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి తన బ్యాటింగ్తో అభిమానులను అలరించాడు. ఈ…
Power Bill : ప్రస్తుతం ప్రతి ఇంటిలో విద్యుత్ అవసరం రోజురోజుకూ పెరుగుతోంది. మొబైల్ ఛార్జింగ్ నుంచి ఫ్రిడ్జ్, టీవీ,…
Watermelon : వేసవి ఎండలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తుండగా ప్రజలు చల్లదనం కోసం పలు మార్గాలను ఆశ్రయిస్తున్నారు. భానుడి భగభగలతో…
Sharbat : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరగడంతో శరీరంలోని నీటి శాతం తగ్గిపోవడం సాధారణ సమస్య. దీని వల్ల అలసట,…
YS jagan : శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. వైసీపీ సీనియర్…
IPAC : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకగా నిలిచిన ఎన్నికల వ్యూహకర్త సంస్థ 'ఐప్యాక్' ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురిలో…
This website uses cookies.