
Prashant Kishor : రాజకీయ పార్టీలకి సలహాలు ఇచ్చేందుకు ప్రశాంత్ కిషోర్ అన్ని కోట్లు తీసుకుంటారా ?
Prashant Kishor : ఇటీవల చాలా మంది రాజకీయ నాయకులు వ్యూహకర్తలపై ఆధారపడుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, జన్ సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహకర్తగా మంచి పేరు తెచ్చుకున్నారు.2019 ఎలక్షన్స్ సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ (పీకె) పేరు బలంగా వినిపించింది.. ఆయన ఫీజు కూడా చాలా ఎక్కువగా ఉంటుందని అంటుంటారు. ఈ క్రమంలో తాను ఒక ఎన్నికలో సలహాలు ఇస్తే ఫీజు రూ.100 కోట్లకు పైగా వసూలు చేస్తానని చెప్పారు పీకె.
పీకే సలహాలతో ఎన్నో పార్టీలు ఎన్నికల్లో విజయం సాధించడం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగాయి. అందుకే ఆయన ఎన్నికల వ్యూహానికి తిరుగుండదు అనేది చాలా మంది అభిప్రాయం. తాజాగా తాను ఏదైనా రాజకీయ పార్టీ లేదా నాయకుడికి సలహాలిచ్చేందుకు ఎంత తీసుకుంటారనే వివరాలను ఆయన స్వయంగా వెల్లడించారు. రూ. 100 కోట్లకు పైగా తీసుకుంటున్నట్టు ఆయన తెలిపారు. బీహార్లో జరగనున్న ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కిశోర్ తన ఫీజు వివరాలను వెల్లడించారు. బెలగంజ్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. తన ఎన్నికల ప్రచారాలకు ఎలా నిధులు సమకూరుస్తారో చెప్పాలని ప్రజలు తనను తరచుగా అడుగుతారని ఆయన పేర్కొన్నారు. వాటికి సమాధానంగా ఇప్పుడిలా తన ఫీజు వివరాలను ప్రశాంత్ కిశోర్ వెల్లడించారు.
Prashant Kishor : రాజకీయ పార్టీలకి సలహాలు ఇచ్చేందుకు ప్రశాంత్ కిషోర్ అన్ని కోట్లు తీసుకుంటారా ?
తన ప్రచార కార్యక్రమాల్లో టెంట్లు, స్టేజ్ లు వేయడానికి తన దగ్గర డబ్బు సరిపోదని అనుకుంటున్నారా.. తాను అంత బలహీనుడిని అని భావిస్తున్నారా అని ప్రశ్నించిన పీకే… తాను ఒక్క ఎన్నికల్లో ఎవరికైనా సలహా ఇస్తె రూ.100 కోట్లు, లేదా అంతకంటే ఎక్కువ తీసుకుంటానని.. వాటితోనే తన ఎన్నికల ప్రచారాలకు నిధులు సమకూర్చుకో గలుగుతున్నానని అన్నారు. కాగా… బీహార్ లో నవంబర్ 13న నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. వీటిలో పోటీ చేయడానికి జన సూరజ్ అభ్యర్థులను నిలబెట్టింది. ఇందులో భాగంగా.. బెలగంజ్ నుంచి మహ్మద్ అంజాద్.. ఇమాంగంజ్ నుంచి జితేంద్ర, రాంగఢ్ నుంచి సుశీల్, తరారీ నుంచి కిరణ్ సింగ్ బరిలోకి దిగారు! . నవంబర్ 13న ఉప ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 23న ఫలితాలు వెల్లడవుతాయి.
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటుంది. అయితే ప్రస్తుత పరిస్థితులు…
Revanth Reddy : తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. కేవలం పాలనలోనే కాకుండా మాటతీరులో…
Sanitation Worker : నిజాయతీకి వెలకట్టలేమని, అది మనిషి వ్యక్తిత్వానికి నిదర్శనమని తమిళనాడుకు చెందిన ఓ పారిశుద్ధ్య కార్మికురాలు మరోసారి…
YCP Vs TDP : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు శాసన మండలి చుట్టూ పెద్ద చర్చ జరుగుతోంది. అసలు ఈ…
హైదరాబాద్లోని ప్రముఖ పరిశోధనా సంస్థ అయిన సీఎస్ఐఆర్ - నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (NGRI) నిరుద్యోగులకు మంచి అవకాశాన్ని…
Vijay-Trisha : దశాబ్దాల కాలంగా దక్షిణాది సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా వెలుగుతున్న త్రిష కృష్ణన్, తన నటనతో ఎంతగా…
Viral Video : ఉప్పల్ ప్రాంతంలో అర్ధరాత్రి వేళ చోటుచేసుకున్న ఒక సంఘటన అన్నం విలువను, ఆకలి తీవ్రతను సమాజానికి…
YS Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఒకవైపు…
Vijay wife Sangeetha : తమిళ వెండితెర ‘దళపతి’, ప్రస్తుతం తమిళగ వెట్రి కళగం (TVK) అధినేతగా రాజకీయాల్లో బిజీగా…
Womens Day 2026 : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం మహిళా సంక్షేమమే ధ్యేయంగా మరో చారిత్రాత్మక నిర్ణయం…
Rythu Bharosa : తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. రైతు…
Woman Farmer Success Story : మారుతున్న వాతావరణ పరిస్థితులు, అకాల వర్షాలు సామాన్య రైతుకు కంటిమీద కునుకు లేకుండా…
This website uses cookies.