
KCR – Prashanth Kishore : పరిస్థితి చేయిదాటిపోయింది.. ఇప్పుడు నేను ఏం చేయలేను.. కేసీఆర్కు తెచ్చి చెప్పిన ప్రశాంత్ కిషోర్
KCR – Prashanth Kishore : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా వవారం రోజుల సమయం మాత్రమే ఉంది. ఈనేపథ్యంలో తెలంగాణలో మూడోసారి గెలవడం కోసం బీఆర్ఎస్ పార్టీ తెగ ప్రయత్నాలు చేస్తోందనే చెప్పుకోవాలి. హ్యాట్రిక్ గెలుపు కోసం అటు కేసీఆర్, ఇటు కేటీఆర్.. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఏది ఏమైనా ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా గాలి వీస్తోంది. ఆ విషయం హైకమాండ్ కు కూడా తెలిసే ఏకంగా సీఎం కేసీఆర్ రంగంలోకి దిగి ప్రతి నియోజకవర్గంలో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహిస్తూ కాంగ్రెస్ ను ఎండగడుతున్నారు. అయినా కూడా ప్రజల నుంచి సరైన స్పందన రావడం లేదు. మేనిఫెస్టో కూడా అంతగా ప్రజలను ఆకట్టుకోవడం లేదు. దీంతో ప్రశాంత్ కిషోర్ ను రంగంలోకి దింపాలని సీఎం కేసీఆర్ ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తోంది. ఇటీవల సుమారు మూడు గంటల పాటు ప్రశాంత్ కిషోర్ తో సీఎం కేసీఆర్ చర్చలు జరిపారట. ఎన్నికల వరకు తమతో కలిసి పనిచేయాలని పీకేకు కేసీఆర్ సూచించినట్టు తెలుస్తోంది. అయితే.. బీఆర్ఎస్ ను ప్రస్తుతం జనాలు నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడేం చేసినా వర్కవుట్ కాదు.. పరిస్థితి చేయిదాటిపోయింది.. అని తన నిస్సహాయతను పీకే వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
కేసీఆర్ కుటుంబంపై, ప్రభుత్వంపై తెలంగాణ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. మంత్రి కేటీఆర్ పై కూడా వ్యతిరేకత ఉండటంతో.. తాను ఇప్పుడు ఏం చేయలేనని పీకే చేతులు ఎత్తేసినట్టు తెలుస్తోంది. అంతే కాదు.. ప్రస్తుత తెలంగాణ పరిస్థితిపై ఫ్లాష్ సర్వే నిర్వహించి ఆ వివరాలను సీఎం కేసీఆర్ కు పీకే అందించారట. ఆ రిపోర్ట్ చూసి కేసీఆర్, కేటీఆర్ షాక్ అయినట్టు తెలుస్తోంది. పీకే తన వల్ల కాదని చెప్పినా.. కనీసం మ్యాజిక్ ఫిగర్ కు చేరుకునేలా 60 సీట్లు గెలుచుకునేలా ఈ వారం రోజులు ఏదైనా ప్రణాళిక అందించాలని.. తమ వ్యూహాలను చెప్పాలని పీకేను కేసీఆర్ కోరారట. దీంతో కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ఎలా పుంజుకుందో.. అది తెలంగాణ ఎన్నికల్లో ఎంత ప్రభావం చూపిస్తుందో పీకే కేసీఆర్ కు చెప్పారట. ఈ సమయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నా.. ఎలాంటి వ్యూహాలు రచించినా అది మైనస్ అవుతుంది తప్ప పార్టీకి ఏమాత్రం ప్లస్ కాదని వివరించారట.
నిజానికి ప్రశాంత్ కిషోర్ టీమ్ కొన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీతో కలిసి పని చేసింది. కానీ.. మధ్యలో ఆ డీల్ ఎందుకో ఆగిపోయింది. ఐఫ్యాక్ సేవలను కొన్ని సర్వేల కోసం మాత్రమే వాడుకొని ఆ తర్వాత వదిలేశారు. ఇప్పుడు చివర్లో తేడా కొట్టేసరికి మళ్లీ పీకే దగ్గరికి వెళ్లడంతో ఇప్పుడు తన వల్ల కాదని పీకే కూడా చేతులెత్తేశారట. వారం రోజుల్లో ఏం చేయలేమని.. ఇప్పుడు హడావుడి చేస్తే అది మొదటికే మోసం వస్తుందని పీకే కూడా కేసీఆర్ కు చెప్పినట్టు తెలుస్తోంది. మరి.. కనీసం మ్యాజిక్ ఫిగర్ వచ్చే పరిస్థితులు నిజంగానే తెలంగాణలో లేవా? ఏం జరుగుతుందో తెలియాలంటే డిసెంబర్ 3 వరకు వెయిట్ చేయాల్సిందే.
Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…
Petrol : భారత్లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
This website uses cookies.