
YS Jagan : ఎట్టకేలకి జగన్ వెళ్లే మార్గంలో కరెంట్ నిలిపివేయడానికి కారణం చెప్పిన సీపీ..!
Ys Jagan : ఏపీలో రాజకీయాలు మాటల దాడి నుంచి రాళ్ల దాడి వరకు చేరుకున్నాయి. ఇన్ని రోజులు కేవలం వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలకే పరిమితం అయిన రాజకీయాలు కాస్తా ఇప్పుడు రాళ్ల దాడి వరకు చేరుకున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో జగన్ బస్సుయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. శనివారం నాటికి బస్సు యాత్రకు 14 రోజులు అవుతోంది. అయితే శనివారం రాత్రి జగన్ విజయవాడలో బస్సు యాత్ర చేస్తున్న సందర్భంగా కార్యకర్తలు పూలవర్షం కురిపించారు. అదే అదునుగా కొందరు దుండగులు జగన్ మీద రాళ్లతో దాడి చేశారు. ఓ రాయి వచ్చి జగన్ కుడి కనుబొమ్మ మీద తాకింది.
దాంతో తీవ్రంగా గాయం అయింది. వెంటనే స్పందించిన సెక్యూరిటీ సిబ్బంది జగన్ మీద రాళ్లు పడకుండా అడ్డుగా ఉన్నారు. ఆ వెంటనే బస్సును లోపలికి తీసుకెళ్లి వైద్యులతో శస్త్ర చికిత్స అందించారు. అయితే ఈ దాడిపై ప్రధాని నరేంద్ర మోడీ, కేటీఆర్, తమిళనాడు సీఎం స్టాలిన్ స్పందించారు. దాడిని తీవ్రంగా ఖండించారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే తాజాగా వైసీపీ తరఫున మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రంగా స్పందించారు. జగన్ కు ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే ఈ దాడి చేశారంటూ మండిపడ్డారు. నారా లోకేష్ వ్యాఖ్యలను గమినిస్తే దాడి వెనుక టీడీపీ కుట్ర ఉందని అర్థం అవుతోంది. జగన్ పై జరిగిన దాడి టీడీపీ పనే అంటూ ఆరోపించారు పెద్దిరెడ్డి. నారా లోకేష్ ట్విట్టర్లో స్పందిస్తూ 2019 కోడి కత్తి, 2024లో రాయితో దాడి అని పోస్టు పెట్టారు. దాన్ని బట్టి చూస్తుంటే దాడి వెనకాల టీడీపీ హస్తం ఉందని మంత్రి ఆరోపించారు. ఎవరైనా కావాలని దూరం నుంచి రాయితో దాడి చేయించుకుంటారా.. కావాలంటే నారా లోకేష్ ను అదే బస్సుపై అక్కడే నిలబెడుదాం.
Ys Jagan : వైఎస్ జగన్పై దాడి టీడీపీ పనే… నారా లోకేష్ వ్యాఖ్యలే సాక్ష్యం..!
కావాలంటే ఆయన్ను కొట్టించుకోమనండి.. అప్పుడు ప్లాన్ చేసి కొట్టించుకోవడం సాధ్యం అవుతుందో లేదో అర్థం అవుతుంది అని పెద్దిరెడ్డి తీవ్రంగా స్పందించారు. ఒక ముఖ్యమంత్రికి గాయం అయితే నారా లోకేష్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం అంటూ పెద్దిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాడు పాదయాత్రకు వచ్చినంత ఆదరణ ఇప్పుడు బస్సుయాత్రకు వస్తోంది కాబట్టే దాన్ని చూసి ఓర్వలేక చంద్రబాబు ఇలాంటి కుట్రలకు తెరతీస్తున్నాడు అంటూ ఆరోపించారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
Airtel : టెలికాం రంగంలో మరోసారి ధరల పెంపు చర్చకు దారి తీసింది. ప్రముఖ టెలికాం సంస్థ Airtel తన…
CM Chandrababu : తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో నిర్వహించిన స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని పలు కీలక…
Indiramma Illu : తెలంగాణ ప్రభుత్వం పేదల సొంతింటి కలను నిజం చేయడానికి చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో కీలక…
Rythu Bharosa : తెలంగాణ రాష్ట్రంలో రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమాల్లో ‘రైతు భరోసా’…
Chicken skin : నాన్వెజ్ ప్రియుల్లో చాలామంది చికెన్ను చర్మంతో కలిపి తినడానికి ఆసక్తి చూపుతారు. ప్రత్యేకంగా ఫ్రైడ్ లేదా…
Coconut Water : వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచేందుకు కొబ్బరి నీళ్లు ఉత్తమమైన సహజ పానీయం. ఇవి దాహాన్ని…
Summer Diet : వేసవి కాలం మొదలవగానే మన ఆహారపు అలవాట్లలో మార్పులు చేయడం అవసరం అవుతుంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల…
Tamil Nadu Elections : తమిళనాడులో ఇప్పుడు ఎన్నికల వేడి మామూలుగా లేదు. అధికారాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని డీఎంకే, ఏఐడీఎంకే…
Vijay Deverakonda : సాధారణంగా టయర్ 2 హీరోలకు వరుసగా కొన్ని ఫ్లాపులు పడితే, నిర్మాతలు బడ్జెట్ తగ్గించేసి రిస్క్…
Telangana : తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ నడుస్తోంది. అదేంటంటే, కొంతకాలంగా ఫామ్ హౌస్ కే పరిమితమైన బీఆర్ఎస్ అధినేత…
Pawan Kalyan : ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి గురించి ఇప్పుడు రాజకీయ వర్గాల్లో, అభిమానుల్లో…
Modi : రాజకీయాల్లో వ్యూహ ప్రతివ్యూహాలు సహజం. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన డీలిమిటేషన్ ప్రక్రియ విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 131వ…
This website uses cookies.