Categories: ExclusiveNewspolitics

Ys Jagan : వైఎస్ జ‌గ‌న్‌పై దాడి టీడీపీ ప‌నే… నారా లోకేష్ వ్యాఖ్య‌లే సాక్ష్యం..!

Advertisement
Advertisement

Ys Jagan : ఏపీలో రాజకీయాలు మాటల దాడి నుంచి రాళ్ల దాడి వరకు చేరుకున్నాయి. ఇన్ని రోజులు కేవలం వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలకే పరిమితం అయిన రాజకీయాలు కాస్తా ఇప్పుడు రాళ్ల దాడి వరకు చేరుకున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో జగన్ బస్సుయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. శనివారం నాటికి బస్సు యాత్రకు 14 రోజులు అవుతోంది. అయితే శనివారం రాత్రి జగన్ విజయవాడలో బస్సు యాత్ర చేస్తున్న సందర్భంగా కార్యకర్తలు పూలవర్షం కురిపించారు. అదే అదునుగా కొందరు దుండగులు జగన్ మీద రాళ్లతో దాడి చేశారు. ఓ రాయి వచ్చి జగన్ కుడి కనుబొమ్మ మీద తాకింది.

Advertisement

Ys Jagan : స్పందించిన మోడీ..

దాంతో తీవ్రంగా గాయం అయింది. వెంటనే స్పందించిన సెక్యూరిటీ సిబ్బంది జగన్ మీద రాళ్లు పడకుండా అడ్డుగా ఉన్నారు. ఆ వెంటనే బస్సును లోపలికి తీసుకెళ్లి వైద్యులతో శస్త్ర చికిత్స అందించారు. అయితే ఈ దాడిపై ప్రధాని నరేంద్ర మోడీ, కేటీఆర్, తమిళనాడు సీఎం స్టాలిన్ స్పందించారు. దాడిని తీవ్రంగా ఖండించారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే తాజాగా వైసీపీ తరఫున మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రంగా స్పందించారు. జగన్ కు ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే ఈ దాడి చేశారంటూ మండిపడ్డారు. నారా లోకేష్‌ వ్యాఖ్యలను గమినిస్తే దాడి వెనుక టీడీపీ కుట్ర ఉందని అర్థం అవుతోంది. జగన్ పై జరిగిన దాడి టీడీపీ పనే అంటూ ఆరోపించారు పెద్దిరెడ్డి. నారా లోకేష్ ట్విట్టర్‌లో స్పందిస్తూ 2019 కోడి కత్తి, 2024లో రాయితో దాడి అని పోస్టు పెట్టారు. దాన్ని బట్టి చూస్తుంటే దాడి వెనకాల టీడీపీ హస్తం ఉందని మంత్రి ఆరోపించారు. ఎవరైనా కావాలని దూరం నుంచి రాయితో దాడి చేయించుకుంటారా.. కావాలంటే నారా లోకేష్ ను అదే బస్సుపై అక్కడే నిలబెడుదాం.

Advertisement

Ys Jagan : వైఎస్ జ‌గ‌న్‌పై దాడి టీడీపీ ప‌నే… నారా లోకేష్ వ్యాఖ్య‌లే సాక్ష్యం..!

కావాలంటే ఆయన్ను కొట్టించుకోమనండి.. అప్పుడు ప్లాన్ చేసి కొట్టించుకోవడం సాధ్యం అవుతుందో లేదో అర్థం అవుతుంది అని పెద్దిరెడ్డి తీవ్రంగా స్పందించారు. ఒక ముఖ్యమంత్రికి గాయం అయితే నారా లోకేష్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం అంటూ పెద్దిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాడు పాదయాత్రకు వచ్చినంత ఆదరణ ఇప్పుడు బస్సుయాత్రకు వస్తోంది కాబట్టే దాన్ని చూసి ఓర్వలేక చంద్రబాబు ఇలాంటి కుట్రలకు తెరతీస్తున్నాడు అంటూ ఆరోపించారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

Advertisement

Recent Posts

India : ఇండియాపై క‌న్నెర్ర చేసిన ప్ర‌కృతి… రిపోర్ట్‌తో సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి…!

India : మన దేశాన్ని ప్రకృతి పగబట్టిందా? అంటే అవును అనిపిస్తుంది. ప్ర‌స్తుత ప‌రిస్థితులు ప్ర‌జ‌ల‌ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.…

9 hours ago

Trisha : ఎంత బ్ర‌తిమాలినా విన‌లేదు.. త్రిష వ‌ల‌న నా జీవితం నాశనం అయిందంటూ సంచ‌ల‌న కామెంట్స్

Trisha : సౌత్ అగ్ర నటీమణుల్లో త్రిష ఒకరు. నాలుగు పదుల వయసులో కూడా త్రిష డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు.…

10 hours ago

UPSC కంబైన్డ్ జియో-సైంటిస్ట్ 2024 నోటిఫికేషన్ విడుద‌ల‌.. సెప్టెంబర్ 24 వరకు ద‌ర‌ఖాస్తుకు అవ‌కాశం..!

UPSC  : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కంబైన్డ్ జియో-సైంటిస్ట్ 2024 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆసక్తి మరియు అర్హత…

11 hours ago

Fish Venkat : ఫిష్ వెంక‌ట్ అనారోగ్య ప‌రిస్థితి తెలుసుకొని చ‌లించిపోయిన చిరు, చ‌ర‌ణ్‌.. వెంట‌నే ఏం చేశారంటే..!

Fish Venkat : టాలీవుడ్‌లో కొంద‌రు స్టార్స్ ఒకానొక‌ప్పుడు ఓ వెలుగు వెలిగి ఇప్పుడు మాత్రం చాలా దారుణ‌మైన స్థితిని…

12 hours ago

Eating Food : ఆహారం తినడానికి కూడా వాస్తు నియమాలు ఉన్నాయని మీకు తెలుసా..?

Eating Food : హిందూమతంలో జీవశాస్త్రానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. వాస్తు దోషాలు యొక్క ప్రభావం జీవితంపై కూడా పడుతుందనేది…

13 hours ago

Pithapuram : పిఠాపురంలో ఏం జ‌రుగుతుంది.. వ‌ర్మ వ‌ర్సెస్ జ‌న‌సేన‌ ?

Pithapuram : ప‌వ‌న్ క‌ళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేయ‌డంతో ఆ పేరు నెట్టింట తెగ మారుమ్రోగింది.పిఠాపురం వైపు ప్ర‌జ‌లు క్యూలు…

14 hours ago

Tonsils : ట్యాన్సిల్ నొప్పిని ఇంటి నివారణలతో కూడా తగ్గించవచ్చు… ఎలాగంటే…!

Tonsils : మనకు జలుబు చేస్తే ట్యాన్సిల్స్ రావడం కామన్. అయితే ఈ టాన్సిల్స్ నాలుక వెనక గొంతుకు ఇరువైపులా…

17 hours ago

Internet : ఇంటర్నెట్ అడిక్షన్ ను ఈజీగా వదిలించుకోవచ్చు… ఎలాగో తెలుసా…!!

Internet  : ప్రస్తుత కాలంలో ఎంతోమంది మద్యం మరియు గంజాయి, పొగాకు లాంటి చెడు వ్యసనాలకు బానిసలు అయ్యి వారి…

18 hours ago

This website uses cookies.